మంగళవారం (ఏప్రిల్ – 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపలేకపోతున్నట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో …
Read More »ఆపదలో ఉన్నా అంటే చాలు నేనున్నా అంటున్న మంత్రి కేటీఆర్
ప్రస్తుత కరోనా మహమ్మారి సమయంలో సాయం చేసే చేతుల కోసం ఎదురు చూసే చూపులు ఎన్నో. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఓ యువతి కొవిడ్ భారిన పడి ఆస్పత్రిలో చేరింది. తమ సోదరి స్థితిని వివరిస్తూ యువకుడు రెమ్డెసివిర్ డ్రగ్ కావాల్సిందిగా మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా విన్నవించాడు. దయచేసి ఆంధ్రా ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరాడు. దీనిపై తక్షణం స్పందించిన మంత్రి కేటీఆర్ తన స్నేహితుడు, ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి …
Read More »తెలంగాణలో కరోనా పంజా
తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో 6,551 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. రోజువారీ కేసులు కాస్త తగ్గగా.. మరణాలు పెరిగాయి. రాష్ట్రంలో వైరస్ ప్రభావంతో 43 మంది మృతి చెందినట్లు పేర్కొంది. నిన్న ఒకే వైరస్ నుంచి కోలుకొని 3,804 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 65వేలు దాటింది. ప్రస్తుతం …
Read More »బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి-మంత్రి హారీష్ రావు
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా లేక బీడీ కార్మికులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినందుకా అని ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్, బీడీ కార్మికులకు పెన్షన్ పథకాల్లో కేంద్రం వాటా ఒక్కపైసా లేదని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఏనాడైనా బీడీ కార్మికులకు రూపాయి ఇచ్చరా అని …
Read More »తెలంగాణలో స్కూళ్లకు ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు
తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఏప్రిల్ 27 నుంచి మే నెల 31వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సంబంధించి వేసవి సెలవుల నిర్ణయంపై గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్షించారని మంత్రి తెలిపారు. కరోనా విస్తరించిన …
Read More »తెలంగాణలో కొత్తగా 8,126 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 8,126 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,95,232కు పెరిగింది. కొవిడ్ ధాటికి మరో 38 మంది చనిపోగా, కరోనా మరణాల సంఖ్య 1999కు చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 62, 929 యాక్టివ్ కేసులున్నాయి. మరో 3,307 మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 3.30 లక్షలకు చేరింది.
Read More »గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్
గ్రేటర్ పరిధిలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 1,259 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 97,178 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.
Read More »మాజీ ఎమ్మెల్యే కుంజ భిక్షం మృతి
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కుంజ భిక్షం మృతి చెందారు. గత నెల బెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికే పరిమితమైన ఆయన.. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. కుంజా భిక్షం 1989-99 కాలంలో 10 ఏళ్లు బూర్గంపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన మరణం పట్ల సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్లు సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు …
Read More »మరోసారి గ్రేటర్ వరంగల్ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం….
గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో భాగంగా 1&2వ డివిజన్ గుండ్లసింగారం, పెగడపల్లి, వంగపహాడ్ గ్రామాలలో రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితో కలిసి వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 1&2వ డివిజన్ అభ్యర్థులు గణిపాక కల్పన, బానోత్ కల్పన గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ …
Read More »తెలంగాణలో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్
వ్యాక్సిన్ పంపిణీపై తెలంగాణ రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్టు శనివారం ప్రకటించింది. 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్నవారికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఏపీ సర్కార్ శుక్రవారం ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు కోట్ల మందికి వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు 30 లక్షల మందికి వ్యాక్సిన్ అందించిన సర్కార్.. ఇక …
Read More »