సిద్దిపేట పారుపల్లి వీధిలో గల శ్రీ రామ రాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయం లో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరిశ్ రావు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ స్వాములతో కల్సి భిక్ష చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ హనుమాన్ నామ స్మరణ.. సర్వపాప హారణ..!! అని హనుమత్ కృప తోనే సర్వజగద్రక్ష అని.. అంజనేయుని అనుగ్రహము ఎక్కడ ఉంటే అక్కడ విజయం సిద్ధిస్తుందని అన్నారు.. …
Read More »వరంగల్ నగర మేయర్గా గుండా ప్రకాశ్రావు..!!
వరంగల్ నగర మేయర్గా గుండా ప్రకాశ్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హన్మకొండ సునీల్గార్డెన్స్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కార్పొరేటర్లు ప్రకాశ్రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రకాశ్రావును అభినందించారు. ఈ సందర్భంగా ప్రకాశ్రావు మాట్లాడుతూ.. తన అభ్యర్థిత్వానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు పాదాభివందనం …
Read More »విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఆశీస్సులు తీసుకున్న సీఎం కేసీఆర్
విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామివారిని సీఎం కేసీఆర్ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఫిల్మ్నగర్ దైవ సన్నిదానానికి సీఎం వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆధ్యాత్మిక, రాజకీయాంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. జూన్లో పీఠం ఉత్తరాధికారి బాధ్యతల స్వీకారోత్సవానికి రావాలని కేసీఆర్ని స్వరూపానంద ఆహ్వానించారు. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ నగర్లోని …
Read More »71ఏళ్ల చరిత్రలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చినా గట్టిగా నిలబడింది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ సైనికులందరికీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో కేటీఆర్ టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సైనికులుగా పని చేసిన తెలంగాణవాదులందరికీ శుభాకాంక్షలు. 71 ఏండ్ల చరిత్రలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ గట్టిగా నిలబడ్డ పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. 2001లో కేసీఆర్ ఒంటరిగా ఉద్యమం మొదలు పెట్టారని, త్యాగాల పునాదుల మీదనే …
Read More »గల్లీ నుంచి ఢిల్లీ దాకా టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది…కేటీఆర్
టీఆర్ఎస్ 18వ అవిర్భావ దినోత్సవం శనివారం తెలంగాణ భవన్లో జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ జెండాను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఇన్నేళ్లు కేసీఆర్ వెంట నడిచిన గులాబీ సైనికులకు పార్టీ అవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంచుకున్న లక్ష్యంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా.. రెండు సార్లు సీఎం అయిన …
Read More »కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం సంతోషకరం…హరీశ్రావు
పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణమని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్ధిపేట నివాసంలో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో హరీశ్రావు పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కార్యకర్తలు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సాధనలో ఎందరో కార్యకర్తల కష్టం, శ్రమ ఉందన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి, ప్రతి కార్యకర్త సంక్షేమం కోసం పార్టీ కృషిచేస్తదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం సంతోషకరమని …
Read More »వేములవాడ రూరల్ MPTC ఎన్నికకు హైకోర్టు బ్రేక్
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల MPTC ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. వేములవాడ రూరల్ లో రిజర్వేషన్ల ప్రక్రియను మరోసారి పరిశీలించాలని.. ఆ తర్వాత ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. 2011 జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల ప్రక్రియ జరగలేదంటూ… పిటిషన్ ను ధాఖలు చేశారు వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేష్. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే వేములవాడ రూరల్ మండలానికి స్థానిక సంస్థ ఎన్నికలు …
Read More »నిరాడంబరంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర సమితి 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహిస్తామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణభవన్ లో మీడియా సమావేశంలో తలసాని మాట్లాడుతూ.. రేపు ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సీఎం కేసీఆర్ పై విశ్వాసంతోనే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ లో చేరుతున్నరని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగానికి జీవనాడి అని..వెట్ …
Read More »కేటీఆర్ ఔదార్యం..!!
– దివ్యాంగ క్రీడాకారుడికి రూ. లక్ష సాయం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. దివ్యాంగ క్రీడాకారుడికి రూ. లక్ష ఆర్థిక సాయం చేశారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలం మూడుచింతల తండాకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు ధీరావత్ మహేశ్ చైనాలో జరిగే ప్రపంచ బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యాడు. దీంతోపాటే పారా క్రికెట్ ఇండియా టీమ్ వైస్కెప్టెన్గా కూడా ఎంపికయ్యాడు. బీచ్ వాలీబాల్ మే …
Read More »మిషన్ భగీరథకు ప్రతిష్ఠాత్మక హడ్కో అవార్డు
తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఇంటికి మంచినీటిని అందించేందుకు నిర్మిస్తున్న బృహత్తర ప్రాజెక్టు మిషన్ భగీరథకు ప్రతిష్ఠాత్మక హడ్కో అవార్డు దక్కింది. మౌలిక సదుపాయాల కల్పనలో మిషన్ భగీరథ వినూత్న పథకంగా హడ్కో అభివర్ణించింది. మిషన్ భగీరథకు మూడోసారి హడ్కో అవార్డు లభించడం విశేషం. ఢిల్లీలో జరిగిన హడ్కో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో పాల్గొని.. హడ్కో అవార్డును ఈఎన్సీ కృపాకర్రెడ్డి స్వీకరించారు.
Read More »