ఇటీవల స్మాల్ స్ర్కీన్పై ప్రదీప్ స్టారయ్యాడు. కొద్దికాలంగా బుల్లితెరపై సంచనాలు సృష్టిస్తున్నాడు. అతడికి పెద్ద హీరోలకు ఉన్న ఫాలోయింగ్ యూత్లో ఉంది. ఎందోలో అయినా ఇమిడి పోగలడు. అతను చేస్తున్న కొంచెం టచ్లో ఉంటే చెప్తా అనే షోకి ఆడియన్స్ నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. స్టార్ సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేస్తున్న ఆ షో ప్రదీప్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆ షోనే కాకుండా ఎన్నో రియాల్టీ షోలు, యాంకరింగ్లు …
Read More »Blog Layout
రాష్ట్రం కోసమే చంద్రబాబు స్నానం కూడా చేయకుండా బిజీగా పర్యటనలు
తెలుగుజాతిని నడిపిస్తున్నాని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం స్నానం చేయడాన్ని కూడా త్యాగం చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 10 రోజులు పాటు విదేశాల్లో పర్యటించిన చంద్రబాబు అక్కడ విశేషాలను మీడియాకు వివరించారు. విదేశీ పర్యటన ద్వారా భారీగా పెట్టుబడులను తాను ఆకర్శించానన్నారు. వ్యవసాయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలకు అమెరికా పర్యటన ఊతం ఇచ్చిందన్నారు. రైతుల ఇంట నిత్య దీపావళి ఉండాలన్నదే …
Read More »ఆ విషయం నాకు 6నెలల క్రితమే తెలుసు.. రమణ సంచలన వాఖ్యలు..
తెలుగుదేశం పార్టీకి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పై తెలంగాణ తెలుగుదేశ అద్యక్షుడు ఎల్ . రమణ సంచలన వాఖ్యలు చేసారు . ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ… 1985లో ఇందిరతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీకి నాదెండ్ల వెన్నుపోటు పొడిస్తే 2017లో రాహుల్ గాంధీతో కలిసి టీడీపీకి రేవంత్రెడ్డి ద్రోహం చేశారని అన్నారు . పార్టీని రేవంత్రెడ్డి …
Read More »హరితేజను ఎక్కడికో తీసుకెళ్లి మూతికి గుడ్డ పెట్టేందుకు ట్రై…
బిగ్బాస్ రియాలిటీ షో తర్వాత సినీ నటి, యాంకర్ హరితేజ జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్నట్టుండి సెలబ్రిటీగా మారిపోవడంతోపాటు పలు అవకాశాలు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయి. బిగ్బాస్కు ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొందరికే తెలిసిపోయిన హరితేజ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసిన సెలబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం ఫిదా అనే కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్న హరితేజ ఇటీవల అలీ నిర్వహించే ఓ టాక్ షోలో బిగ్బాస్ కంటెస్టెంట్ ఆదర్శ్తో కలిసి పాల్గొన్నది. …
Read More »విజయశాంతి కోసం చిరంజీవి పట్టు.. షాక్లో సైరా టీమ్!
ఫిల్మ్నగర్లో వినబడుతున్న మాటల ప్రకారం విజయశాంతి సినిమా ఇండస్ర్టీలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. లేడీ అమితాబ్ అని పిలుపిచ్చుకునే ఏకైక నటి విజయశాంతి. అనేక హీరోల పక్కన గ్లామర్ హీరోయిన్గా నటించి.. ఆ తరువాత తానే ఓ సూపర్ హీరో అనే స్థాయికి ఎదిగిపోయింది. విజయవాంతి తాను నటించిన పలు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. అలాంటి విజయశాంతి తాను కూడా రాజకీయాల్లో …
Read More »తప్ప తాగి పోలీసులకు చెప్పు చూపించిన యువతి వీరంగం
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మద్యం తాగిన యువతి వీరంగం సృష్టించింది. తప్పతాగి కారులో వచ్చిన ఆమె, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులపై దుర్భాషలాడింది. బ్రీతింగ్ అనలైజర్ టెస్ట్కు కూడా సహకరించకుండా హల్చల్ చేసింది. దీంతో కష్టపడి ఆమెకు పరీక్షలు నిర్వహించిన పోలీసులు, అతిగా మద్యం తాగినట్టు తేలడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఇక ఈ ఈమెతో పాటు మొత్తం 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. …
Read More »రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి మీకు తెలియని విషయాలు..
రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్బ్రాండ్గా పేరుగాంచిన కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్రెడ్డి టీడీపీకి గుడ్బై చెప్పేశారు.టీడీపీలో చేరిన స్వల్పకాలంలోనే అత్యున్నత పదవులను అలంకరించిన ఆయన రాజకీయ ప్రస్థానం మీకోసం… 1969, నవంబర్ 8న మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డి పల్లిలో జన్మించిన రేవంత్ రెడ్డి.. రాజకీయ అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి.. రాష్ట్రంలో కీలక నేతగా మారిపోయారు.రేవంత్ తన రాజకీయ అరంగేట్రం టీఆర్ఎస్ పార్టీ ద్వారా చేశారు. 2002లో టీఆర్ఎస్ పార్టీలో …
Read More »కాంగ్రెస్ లోకి రేవంత్..నేడు కుంతియాతో భేటీ
టీడీపీ పార్టీకి రిజైన చేసిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఆయన ఎల్లుండి ఢిల్లీలో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే దీనిపై ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మరో 30మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ రానున్నారు. ఆయనతో రేవంత్రెడ్డి …
Read More »ఓ టాప్ సీక్రెట్ని లీక్ చేసిన ఎన్టీఆర్.. ఆ ఇద్దరు ఎవరు?
ఎన్టీఆర్ హిరోగా బాబి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం `జై లవకుశ`. ఈ సినిమా తారక్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే. జై, లవ, కుశ పాత్రల్లో ఎన్టీఆర్ అభినయం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా చేయడం వెనక.. ఓ టాప్ సీక్రెట్ని తారక్ చాలా ఆలస్యంగా వెలుగులోకి తెచ్చారు. వాస్తవానికి బాబి ఈ సినిమా స్క్రిప్టు వినిపించినప్పుడు నటించాలా? వద్దా? అనే డైలెమ్మాలో …
Read More »వెయ్యి కోట్లతో రాయదుర్గంలో ఇమేజ్ టవర్…
హైదరాబాద్కు మరో మణిహారం అలంకారం కానున్నది. హైదరాబాద్ నగర ప్రతిష్ఠను మరింత పెంచేలా, నగరానికి మరో ఐకానిక్ భవంతిగా నిలిచేలా ఇమేజ్ టవర్ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాయదుర్గంలోని పదెకరాల స్థలంలో 16 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో దీనిని నిర్మించాలని నిర్ణయించారు. రహేజా మైండ్ స్పేస్ క్రాస్రోడ్స్ నుంచి ఇనార్బిట్ మాల్కు వెళ్లే దారిలో పక్కన …
Read More »