Classic Layout

చివరి వరకూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితోనే….!

వైఎస్సార్‌సీపీ పార్టీ మారుతున్నట్లు నిన్న కొన్ని టీవీ చానళ్లలో వచ్చిన వార్తలు సత్యదూరమని వైఎస్సార్‌సీపీకి చెందిన కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తెలిపారు. వైఎస్సార్‌సీపీని వీడే ప్రసక్తి లేదని వారు స్పష్టం చేశారు. కొన్ని టీవీ చానళ్లు మైండ్‌గేమ్‌ ఆడుతూ తాను పార్టీ మారుతున్నట్టుగా ప్రసారం చేయడం తగదని బాలనాగిరెడ్డి అన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వీడే ప్రసక్తే …

Read More »

ఫలించిన మంత్రి తుమ్మల వ్యూహం…!

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 11 డివిజన్లలో 9 డివిజన్లను టీబీజీకేఎస్ కైవసం చేసుకున్నది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యహం ఫలించింది. ఏఐటీయూసీకి పట్టున్న ఇల్లెందు, మణుగూరు ఏరియాలో టీబీజీకేఎస్‌ ఘన విజయం సాధించింది. మిత్ర పక్షాలకు కంచుకోటగా నిలిచిన రెండు ఏరియాలపై గులాబీ జెండా రెప రెపలాడింది. భద్రాద్రి …

Read More »

మరో ఐదు రోజులు భారీ వర్షాలు..

తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వచ్చే ఐదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వానలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 48 గంటల్లో బలపడే అవకాశం ఉన్నదని, ఉపరితల ఆవర్తనానికి అల్పపీడన ప్రభావం తోడైతే రాష్ట్రవ్యాప్తంగా ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. ఈ నెల 15 వరకు ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించే …

Read More »

నేడు కుమ్రంభీం 77వ వర్ధంతి..!

ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రంభీం 77వ వర్ధంతిని శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడెఘాట్‌లో నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. స్మారక చిహ్నంలోని కుమ్రంభీం విగ్రహానికి రంగులు వేశారు. జల్.. జంగల్.. జమీన్ నినాదాలకు గుర్తుగా నిర్మించిన మూడు ద్వారాలను ముస్తాబు చేశారు. అధికారికంగా నిర్వహిస్తున్న భీం వర్ధంతికి వేలాది సంఖ్యలో ఆది వాసీలు తరలిరానుండగా, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేర్వేరుగా భోజనం, తాగునీటి వసతిని …

Read More »

నేడు రెండు లాజిస్టిక్స్ పార్కులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్..!

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు బృహత్తర పథకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరుకులను దిగుమతి చేసుకొనేందుకు రెండు లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. వస్తువుల రవాణాకు, ఎగుమతి- దిగుమతులకు అనుకూలంగా ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డుకు సమీపంలో నాగార్జునసాగర్ హైవేపై ఒకటి, విజయవాడ హైవేపై మరొకటి నిర్మించనున్నారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) …

Read More »

టీబీజీకేఎస్ గెలుపుతో వాడవాడలా సంబురాలు..!

సింగరేణి సంస్థ గుర్తింపు సంఘానికి గురువారం జరిగిన ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ప్రభంజనం సృష్టించింది. కార్పొరేట్, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, రామగుండం-1,2,3, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ ఏరియాల్లో టీబీజీకేఎస్ ఘన విజయం సాధించింది. ఫలితాలు వెలువడిన వెంటనే టీబీజేకేఎస్ నాయకులు రంగులు చల్లుకొని, పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు. సింగరేణిలో ఆనందోత్సాహాలతో బైక్ ర్యాలీలు నిర్వహించారు. కోల్‌బెల్ట్‌లో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొన్నది.

Read More »

ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌ టీ–హబ్‌..మంత్రి కేటీఆర్

బహుళజాతి సంస్థలతో పోటీపడే స్థాయికి భారత్ స్టార్టప్ సంస్థలు ఎదుగాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆకాంక్షించారు. గురువారం ఢిల్లీలో ఇండియా ఎకనామిక్ సమ్మిట్ స్కేల్ ఆఫ్ ఇండియా ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. స్టార్టప్ సంస్థలు సమస్యలను పరిష్కార కోణంలో చూడకుండా.. తమ ఉత్పత్తులను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే స్థాయిలో పరిణతి సాధించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం దేశంలో …

Read More »

సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ప్రభంజనం…!

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) ఘనవిజయం సాధించిందితెలంగాణ బొగ్గుగని సంఘం తిరుగులేని మెజార్టీతో మరోసారి గుర్తింపు హోదా ఖరారైంది. ప్రత్యర్థులంతా ఒక్కటై కూటమి కట్టినా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా.. టీబీజీకేఎస్ బాణం గుర్తు దూసుకుపోతున్నది. కార్మికులంతా సీఎం కేసీఆర్, ఎంపీ కవితల వెంటే నిలిచారు. భారీగా నమోదైన పోలింగ్ టీబీజీకేఎస్ విజయాన్ని కౌంటింగ్‌కు ముందే తేల్చింది. టీబీజీకేఎస్‌కు కనీసం …

Read More »

కొత్తగూడెం కార్పొరేట్‌లో టీబీజీకేఎస్ ఘనవిజయం

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ జోరు కొనసాగుతుంది. ఇప్పటికే సింగరేణి భవన్, ఇల్లందులో విజయకేతనం ఎగురవేసిన టీబీజీకేఎస్ కొత్తగూడెం కార్పొరేట్‌లోనూ విజయం సాధించింది. 544 ఓట్ల ఆధిక్యంతో టీబీజీకేఎస్ గెలుపొందింది. కొత్తగూడెం కార్పొరేట్‌లో మొత్తం ఓట్లు 1475కాగా 1415 ఓట్లు పోలైయ్యాయి. వీటిలో టీబీజీకేఎస్‌కు 866 ఓట్లు రాగా ఏఐటీయూసీకి 322 ఓట్లు వచ్చాయి. మిగతా డివిజన్లలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మణుగూరు, బెల్లంపల్లిలో …

Read More »

ఇల్లెందులో టీబీజీకేఎస్ ఘనవిజయం

హైదరాబాద్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇల్లందులో టీబీజీకేఎస్ ఘనవిజయం సాధించింది. 217 ఓట్ల మెజార్టీతో టీబీజీకేఎస్ గెలిచింది. ఇల్లెందులో కార్మిక సంఘాల వారిగా పోలైన ఓట్ల వివరాలిలా ఉన్నాయి. టీబీజీకేఎస్‌కు 617 ఓట్లు, ఏఐటీయూ- 400, హెచ్‌ఎంఎస్- 36, సీఐటీయూసీ-13, ఐపీటీయూ- 5 ఓట్లు వచ్చాయి. కాగా మరో రెండు స్థానాల్లో టీబీజీకేఎస్ విజయం దిశగా దూసుకెళ్తుంది. కొత్తగూడెం కార్పొరేట్, మణుగూరు ఓట్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat