Classic Layout

సోదరులకు ఎలాంటి రాఖీ కట్టాలి..?

సోదరులకు కట్టే రాఖీలు కొనేందుకు అమ్మాయిలు చాలా కష్టపడుతుంటారు. డిజైన్లు, రంగులు.. ఇలా చాలానే చూస్తారు. కొందరైతే వెండి, బంగారు రాఖీలు కొంటారు. కానీ నూలు దారం, దూది లేదా దారాలతో కలిపి చేతితో చేసిన రాఖీ కట్టడం మన సంప్రదాయమని పండితులు చెబుతున్నారు. పండుగ ఇలాగే మొదలైందట. ప్లాస్టిక్ షీట్లు, రంగుల్లోని రాఖీల ధర ఎక్కువేకాక అవి పర్యావరణానికి హాని చేస్తాయి. అయినా రాఖీ భావన రంగుల్లో కాదు …

Read More »

మరోసారి గాయపడిన విశాల్

తమిళ స్టార్ హీరో..యువ నటుడు విశాల్ మరోసారి గాయపడ్డాడు. ఇటీవలే ‘లాఠీ’ షూటింగ్ సమయంలో గాయపడ్డ ఈ హీరో కోలుకుని తాజాగా కెమెరా ముందుకొచ్చాడు. చెన్నైలో ఈ తెల్లవారుజామున ‘మార్క్ ఆంటోని’ షూటింగ్ సమయంలో మరోసారి తీవ్రంగా గాయపడ్డట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మార్క్ ఆంటోని’.

Read More »

ఊర్వశీ రౌటేలాకి వింత అనుభవం

బాలీవుడ్ కి చెందిన  నటి ఊర్వశీ రౌటేలా ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఎప్పుడైనా ఇబ్బందికర పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయా అన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆమె.. ‘నాకు చాలా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. దుబాయ్లో ఈజిప్ట్కు చెందిన ఓ సింగర్ను కలిశా. అప్పటికే ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలున్న ఆయన.. పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అది మా కుటుంబం, సంస్కృతి, సంప్రదాయానికి విరుద్ధం. అందుకే నిర్ణయం తీసుకోలేదు’ అని చెప్పుకొచ్చింది.

Read More »

షూటింగ్ లో టబుకు గాయాలు

 సినిమా ఇండస్ట్రీకి చెందిన  సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్ లో తీవ్రంగా గాయపడినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో జరుగుతోంది. ఇందులో టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. తాజాగా చిత్రీకరణలో గ్లాస్ పగిలి టబు కన్ను, నుదుటికి గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం జరిగిందట. వెంటనే …

Read More »

ఆ హీరోతో ఎఫైర్ పై స్పందించిన రష్మిక మందన్న

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ .. యువతకు అభిమాన కలల యువరాణి.. రష్మిక మందన్న.. అయితే తనను డార్లింగ్ అని రౌడీ హీరో విజయ్ దేవరకొండ సంభోదించడంపై  బాలీవుడ్ మీడియా ప్రశ్నించింది. దీనిపై రష్మిక ఆసక్తికరంగా స్పందించింది. ‘నేనొక నటిని. మాములుగా అయితే మీరు నా మూవీల గురించి ప్రశ్నించొచ్చు. కానీ మీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? ఎవరితో డేట్ చేస్తున్నారు? లాంటి ప్రశ్నలనే …

Read More »

త్రివర్ణ పతాకం ఎలా తయారైంది అంటే..?

త్రివర్ణ పతాకం భారతదేశానికే గర్వకారణం. మనమందరం గర్వపడేలా ఈ జెండాను తయారుచేసింది తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య. 1906లో కలకత్తాలో నిర్వహించిన కాంగ్రెస్‌ సమావేశాల ప్రారంభ సమయంలో బ్రిటిష్‌ వారి జాతీయ జెండాను కాంగ్రెస్‌ నాయకులు ఆవిష్కరించడం చూసి పింగళి వెంకయ్య కలత చెందారు. మహాత్మాగాంధీ వెన్నుతట్టగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టంలోని కృష్ణా జిల్లాలోగల మచిలీపట్నం వద్ద భట్లపెనుమర్రులో తెలుగు …

Read More »

స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికి అందాలి

అఖంఢ భారత స్వాతంత్య్ర ఫలాలు ప్రతిఒక్కరికి అందాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. దేశంలో పేదరికం అంతరించిపోవాలని, ప్రజలంతా సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వజ్రోత్సవాల సందర్భంగా దేశ‌, రాష్ట్ర ప్రజలు, రైతులు, మహిళలు, పేదల కోసం మనమందరం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్‌ రన్‌లో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

ఫీల్డ్‌ అసిస్టెంట్లకు సీఎం కేసీఆర్ శుభవార్త

గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి విధుల్లోకి తీసుకొన్నది. గతంలో జరిగిన సమావేశాల్లో భాగంగా  శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు నిన్న బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. ఫీల్డ్‌ అసిస్టెంట్లు అందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, డీఆర్డీవోలకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. డీఆర్డీవోల దగ్గర రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. దీంతో 7,651 …

Read More »

కాంగ్రెస్ లో కొత్త రగడకు తెరలేపిన మునుగోడు ఉప ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడంతో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి  ఉపఎన్నిక అనివార్యం అయింది. అయితే ఈ ఉప ఎన్నిక రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త రగడకు తెరలేపింది. ఉప ఎన్నికలో …

Read More »

బాలికలపై ముకేశ్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ వ్యాప్తంగా విశేషంగా ఆకట్టుకున్న శక్తిమాన్‌, మహాభారతం ధారావాహికల ద్వారా  అందరి మన్నలను  పొందిన సీనియర్‌ నటుడు ముకేశ్‌ ఖన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సెక్స్‌ను కోరే బాలికలను వ్యభిచారులతో పోల్చారు. ‘ఒక బాలిక సెక్స్‌ కావాలని అబ్బాయిని కోరితే, ఆమె బాలిక కాదు.. వ్యభిచారి. ఎందుకంటే నాగరిక సమాజానికి చెందిన వారెవరూ అలాంటి పనులు చేయరు’ అని ఆయన వ్యాఖ్యానించారు. తన యూట్యూబ్‌ చానల్‌లో పోస్ట్‌ చేసిన వీడియోలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat