rameshbabu
November 18, 2021 SLIDER
721
అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణ రైతాంగం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల ప్రయోజనాలను రక్షించుకోవాలని ఈ యుద్ధాన్ని ప్రారంభించాం అని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నాలో కేసీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్ నగరంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. అవసరమైతే ఢిల్లీ వరకు కూడా యాత్ర చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడిదాకా అయినా సరే పోయి …
Read More »
rameshbabu
November 18, 2021 NATIONAL, SLIDER
729
దేశంలో గడిచిన 24గంటల్లో 12,32,505 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 11,919 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కేసుల్లో మళ్లీ వృద్ధి కనిపించింది. 11,242 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3.44 కోట్లకు చేరగా 3.38 కోట్ల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.28 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 1,28,762 మంది మహమ్మారితో బాధపడుతున్నారు.
Read More »
rameshbabu
November 18, 2021 SLIDER, TELANGANA
497
తెలంగాణ రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతుల మహాధర్నాకు సంఘీభావంగా విచ్చేసిన పార్టీ ప్రజాప్రతినిధులందరికీ సీఎం కేసీఆర్ స్వాగతం తెలిపారు. ఇందిరా పార్కు వద్ద చేపట్టిన రైతు మహాధర్నాలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.ధర్మంగా, న్యాయంగా వ్యవసాయం చేసి దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. కేంద్రం విధానాల వల్ల మన రైతాంగం దెబ్బతినే అవకాశం ఉంది. నేటి కేంద్ర ప్రభుత్వం రైతాంగం, వ్యవసాయం పట్ల …
Read More »
rameshbabu
November 18, 2021 CRIME, MOVIES, SLIDER
1,271
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో తనపై జరిగిన దాడి వివరాలను నటి షాలూ చౌరాసియా వెల్లడించింది. ‘ఈనెల 14న సా. కేబీఆర్ పార్కులో వాకింగ్ కి వెళ్లాను. తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. మనీ డిమాండ్ చేశాడు. నగదు లేదని రూ.10వేలు ఫోన్ పే చేస్తా నంబర్ చెప్పమన్నా. నంబర్ చెబుతుంటే నేను 100కు డయల్ చేయబోయా. ఇది గమనించి …
Read More »
rameshbabu
November 18, 2021 MOVIES, SLIDER
651
టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా బాలీవుడ్లోనూ మంచి ఆఫర్లు కొట్టేస్తోంది. ఇప్పటికే షాహిద్ ‘సన్నీ’, అజయ్ దేవగణ్ ‘రుద్ర’లో నటించిన ఈ ముద్దుగుమ్మకు కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘యోధ’ అనే యాక్షన్ ఫ్రాంచైజీలో ఓ లీడ్ రోల్ దక్కిందట. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ వంటి నటులు ఇందులో నటిస్తున్నారు. పుష్కర్ ఓజా ఈ ఫ్రాంచైజీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
Read More »
rameshbabu
November 18, 2021 ANDHRAPRADESH, SLIDER
1,042
ఏపీ వైద్య ఆరోగ్యశాఖలో 10,865 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 7390 కాగా, కొత్తగా సృష్టించినవి 3475 ఉన్నాయి. దీనిలో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద 4142 పోస్టులు, APVVP పరిధిలో 2520 పోస్టులు, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 4203 పోస్టులు ఉండగా.. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్టులన్నింటినీ ఒకేసారి భర్తీ చేయనున్నారు.
Read More »
rameshbabu
November 18, 2021 ANDHRAPRADESH, SLIDER
631
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన భార్య సుప్రవ కరోనా బారిన పడగా.. వారికి హైదరాబాద్ మహానగరంలోని AIG ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు. అటు విజయవాడలోని రాజభవన్లో పనిచేసే అధికారుల్లో కొందరితో పాటు గవర్నర్ వ్యక్తిగత సహాయ సిబ్బందికి కలిపి మొత్తం పది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో రాజభవన్లో పనిచేసే సిబ్బంది అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు.
Read More »
rameshbabu
November 18, 2021 SLIDER, SPORTS
977
టీమిండియా మహిళా క్రికెటర్..బ్యూటీ స్మృతి మంధాన అరుదైన రికార్డు సాధించింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ తొలి శతకం సాధించిన భారత మహిళా క్రికెటర్ గా అవతరించింది. సిడ్నీ థండర్ తరఫున ఆడుతున్న మంధాన.. మెల్ బోర్న్ లో రెనెగేడ్స్ లో జరిగిన మ్యాచ్ సెంచరీ(114).తో చెలరేగింది. అయితే ఈమ్యాచులో సిడ్నీపై మెల్బోర్న్ విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా స్మృతి మంధాన ఎంపికైంది.
Read More »
rameshbabu
November 18, 2021 NATIONAL, SLIDER
546
ఈనెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాలకు సంబంధించి పార్లమెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఈ సమావేశాల్లో కేంద్రాన్ని పలు అంశాలపై ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. లఖింపూర్, నామమాత్రంగా తగ్గించిన ఇంధన ధరలు, డ్రగ్స్ సరఫరా, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి.
Read More »
rameshbabu
November 18, 2021 SLIDER, TELANGANA
654
తెలంగాణ రాష్ట్రంలోని ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద అధికార టీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించనుంది. ఈ మహాధర్నాలో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఉ. 11గం.- మ. 2గం. వరకు ధర్నాచౌక్ పార్టీ ముఖ్యనేతలంతా బైఠాయించనున్నారు. ధర్నా అనంతరం రాజ్ భవన్ కి వెళ్లి గవర్నర్ తమిళ సై కి వినతి పత్రం సమర్పించనున్నారు. …
Read More »