rameshbabu
May 17, 2021 ANDHRAPRADESH, SLIDER
1,174
తనను అరికాళ్లపై కర్రతో, రబ్బరు తాడుతో కొట్టారని రఘురామ రాజు దిగువ కోర్ట్లో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఎల్లో మీడియా మరియు తెలుగుదేశం జనసేన సంబంధించిన సామాజిక మధ్యమలో దానిని చిలువలు, వలువలు చేసి..ఆ అరికాళ్ల ఫొటోలను పతాక శీర్షికలో ప్రచురించింది. అదే ఫొటోలనే తెలుగు దేశం పార్టీ వైరల్ చేసింది. అయితే..ఇదంతా కట్టు కథేనని…ఆయనకు ఎలాంటి గాయాలూ లేవని హైకోర్ట్ నియమించిన వైద్యుల కమిటీ ఆదివారం తేల్చడంతో ఎల్లో …
Read More »
rameshbabu
May 17, 2021 SLIDER, TELANGANA
782
తెలంగాణలో కొత్తగా 3,816 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 27మంది కరోనాతో మృతి చెందారు. అదే సమయంలో 5,892 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 50,969 కోవిడ్-19 యాక్టివ్ కేసులున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో 658, రంగారెడ్డి 326, మేడ్చల్ 293, కరోనా కేసులు బయటపడ్డాయి. తెలంగానలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
Read More »
rameshbabu
May 17, 2021 SLIDER, TELANGANA
425
అన్ని ప్రైవేట్ దవాఖానాల్లో 20 శాతం పడగలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వీటిలో పేదలకు కరోనా వైద్య సేవలు అందించేందుకు వినియోగిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రైవేట్ దవాఖానలలో కరోనా రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు దవాఖానలో కొవిడ్ ట్రీట్మెంట్ కోసం పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారని రోగి బంధువులు …
Read More »
rameshbabu
May 17, 2021 SLIDER, TELANGANA
364
కరోనా నియంత్రణ కోసం, వైరస్ బారిన పడిన వారి వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎరబెల్లి దయాకర్రావు అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లకు అవసరమైన రెమ్డెసివిర్ ఇంజక్షన్లను, ఆక్సిజన్ను పూర్తి స్థాయిలో సరఫరా చేస్తోందని చెప్పారు. కరోనా వైద్య సేవల కోసం కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని.. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు …
Read More »
rameshbabu
May 16, 2021 SLIDER, TELANGANA
484
తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలుపంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్ కో ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి 200 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను అందజేసింది. ఈ మేరకు చైనా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రత్యేకంగా విమానంలో వచ్చిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లలను మంత్రి శ్రీ కేటీఆర్ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ సమక్షంలో గ్రీన్ కో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం …
Read More »
rameshbabu
May 16, 2021 ANDHRAPRADESH, SLIDER
889
ఎంపీ రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్లో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. అధికారులు ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. రఘురామకు పరీక్షలు నిర్వహించిన వైద్య బృందం గుంటూరు జిల్లా కోర్టులో మెడికల్ రిపోర్ట్ను సమర్పించింది. కాగా, పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ శుక్రవారం అరెస్టు చేసిన సంగతి విదితమే. ఈ కేసులో …
Read More »
rameshbabu
May 16, 2021 ANDHRAPRADESH, SLIDER
866
సీఎంల కుమారులు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుస్తుంటే చంద్రబాబు కుమారుడు లోకేశ్ మాత్రం ఓడిపోయారని ఎద్దేవా చేస్తూ YCP ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్కు TDP నేత వంగలపూడి అనిత కౌంటరిచ్చారు. YSR, స్టాలిన్, కేసీఆర్, ములాయం కుమారులు గెలిస్తే.. లోకేశ్ ఓడిపోయారని విజయసాయి ట్వీట్ చేశాడు.. దీనికి అనిత .. ‘మీరు చెప్పిన లిస్టులో జైలుకు వెళ్లిన CM కొడుకు ఒక్కడే.. వాయిదాలు తప్పించుకుని తిరుగుతుంది ఆ ఒక్కడే’ అంటూ …
Read More »
rameshbabu
May 16, 2021 NATIONAL, SLIDER
964
ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, టీకా కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కాదని UIDAI స్పష్టం చేసింది. ఆధార్ లేదన్న కారణంతో ఆస్పత్రుల్లో చేర్చుకోకపోవడం, టీకా, మందులు ఇవ్వకపోవడం లాంటివి చేయకూడదని పేర్కొంది. ఏ వ్యక్తి అయినా, లబ్ధిదారుడైనా ఆధార్ లేకున్నా ఎమర్జెన్సీ సేవలు పొందొచ్చని తెలిపింది. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, పింఛన్ డాక్యుమెంట్ చూయించి టీకా వేసుకోవచ్చని పేర్కొంది.
Read More »
rameshbabu
May 16, 2021 SLIDER, SPORTS
1,633
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కరోనా రోగుల ఆకలి తీరుస్తున్నాడు. ఢిల్లీలో ఇప్పటివరకు 51,000 మందికి భోజనం పంపిణీ చేశాడు. ఢిల్లీలో కరోనా బారిన పడి, ఆహారం కావాలంటే ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరాడు. సెహ్వాగ్ అందించే పార్శిళ్లలో చపాతీ, అన్నం, ఓ ఫ్రై, పప్పు, టమాట రైస్ లాంటివి ఉన్నాయి. సెహ్వాగ్ ఫౌండేషన్ తరపున వీరూ ఈ సాయం చేస్తున్నాడు.
Read More »
rameshbabu
May 16, 2021 MOVIES, SLIDER
669
అఖిల్ అక్కినేనితో నటిస్తున్న ‘ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లో స్టాండప్ కమెడియన్గా పూజా హెగ్దే కన్పించనుంది. సన్నివేశాలకు అవసరమైనంత వరకే తన స్టాండప్ స్కిల్స్ చూపించాల్సి ఉంటుందని ఇందుకోసం చాలా హోంవర్క్ చేశానని చెప్పింది. మరే సినిమా కోసం ఈ స్థాయిలో హోంవర్క్ చేసి శ్రమించలేదని పూజా వెల్లడించింది. జీఎ2 బ్యానర్పై బన్నీ వాస్, డైరెక్టర్ వాసు వర్మ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు.
Read More »