TimeLine Layout

February, 2021

  • 19 February

    ‘సర్కారు వారి పాట’ మూవీ విడుదలకు ముహుర్తం ఖరారు

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఇలానే అడిగిన ఓ అభిమాని ట్వీట్ కు స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ‘సినిమా రిలీజ్ కు ఇంకా సమయం ఉంది. గతంలో వచ్చిన పాటలకు మించి …

    Read More »
  • 19 February

    తులసి ఆకులతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు..!

    తులసి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..? చర్మరోగాలను నివారిస్తుంది ఆస్మా, ఆయాసం, కోరింత దగ్గులను అరికడుతుంది కఫాన్ని నివారిస్తుంది కడుపులో నులి పురుగుల్ని నిర్మూలిస్తుంది. ఆకలిని వృద్ధి చేస్తుంది రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మలబద్ధకం తగ్గుతుంది కిడ్నీలో రాళ్లు కరిగిస్తుంది

    Read More »
  • 19 February

    ఏపీ సీఎం జగన్ ప్రధాని కావాలి-డిప్యూటీ సీఎం నారాయణ

    ఏపీ అధికార వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి  పై ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ,బీజేపీ,జనసేన,కమ్యూనిస్టులు  ఒక్క మాట మాట్లాడినా. వైసీపీ నేతలు మూకుమ్మడిగా స్పందిస్తారు. అలాగే సీఎం జగన్ ను కూడా ప్రశంసిస్తుంటారు. కుప్పంలో  వైసీపీకి చెందిన  మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలవడంపై స్పందించిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ‘ ప్రజలకు ఇంత మేలు చేస్తున్న జగన్ ఒకసారి ప్రధాని కావాలి. ఇందుకోసం దేవుడ్ని ప్రార్థిస్తున్నా, కుప్పం ప్రజలకు …

    Read More »
  • 19 February

    అధికార వైసీపీకి షాక్

    ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ నియంతృత్వ పోకడలు నచ్చకనే ఆ పార్టీని వీడుతున్నట్లు డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి మామయ్య శత్రుచర్ల చంద్రశేఖరరాజు తెలిపారు. ‘పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఓటేయకపోతే పెన్షన్లు ఇళ్లు వంటి పథకాలు వర్తించవని వాలంటీర్ల ద్వారా పార్టీ నాయకులు చెప్పించారు. ఇది సరైన విధానం కాదు రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం. ఈ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం అథోగతి పాలవుతోంది’ అని ఆయన …

    Read More »
  • 19 February

    చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ ఆత్మహత్య

    ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ కుమార్తె శిరిష్మ (27) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసంలో బుధవారం రాత్రి ఉరివేసుకుని చనిపోయారు. ఈమెకు 2016లో గ్రానైట్ వ్యాపారి సిద్ధార్థతో పెళ్లింది. నాలుగేళ్లు అవుతున్నా సంతానం కలగకపోవడంతో శిరీష్మ డిప్రెషన్‌కు లోనయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకున్నారు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు నిన్న కేసు నమోదు చేశారు.

    Read More »
  • 19 February

    ఇంటర్ ఫెయిలైన వారికి శుభవార్త

    తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫెయిలైన వారికి ఇంటర్ బోర్డు ఊరట కల్గించింది. 2020 మార్చి పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరికి మే నెలలో నిర్వహించాల్సిన పరీక్షల్లో 70% సిలబస్, 50% ఛాయిస్ వర్తింపజేశారు. ఫస్టియర్ సప్లిమెంటరీతో పాటు సెకండియర్ పరీక్షలు ఒకేసారి రాయాల్సి ఉంటుంది కాబట్టి ఒత్తిడికి లోను కాకుండా ఈ అవకాశం కల్పించారు. సెకండియర్ లో ఫెయిలైన విద్యార్థులను ఇప్పటికే పాస్ చేశారు

    Read More »
  • 19 February

    గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు నగరాన్ని “ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020” గా ప్రకటించాయి. పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచేందుకు తగు జాగ్రత్తలు చేపట్టడం ద్వారా. ఆరోగ్యకరమైన సంతోషకర నగరంగా రూపొందడానికి దోహదపడ్డాయి.

    Read More »
  • 19 February

    ఆ కలను నెరవేర్చుకున్న బుట్టబొమ్మ

    మెగాహీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుందా సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన పూజా హెగ్డే ప్ర‌స్తుతం త‌న హ‌వా కొన‌సాగిస్తుంది. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ను త‌న ఖాతాలో వేసుకుంటూ ద‌ర్శ‌క నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షిస్తుంది. గ‌త ఏడాది అల వైకుంఠ‌పురములో చిత్రంతో అల‌రించిన పూజా ఈ ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే తెలుగు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక హిందీలోను పూజా న‌టిస్తుండ‌గా స‌ల్మాన్ స‌ర‌స‌న కభీ …

    Read More »
  • 19 February

    మోహన్ బాబుకు రూ.1లక్ష జరిమానా..!

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబుకు జీహెచ్‌ఎంసీ రూ.లక్ష జరిమానా విధించింది. జూబ్లీహిల్స్‌ ఫిల్మ్‌నగర్‌ రోడ్‌ నంబర్‌ 1లోని ప్లాట్‌ నంబర్‌ 6 వద్ద మోహన్‌బాబు ఇంటి ఆవరణలో అనుమతి లేకుండా 15 అడుగుల ఎత్తున్న వాణిజ్య ప్రకటన బోర్డు ఏర్పాటుచేశారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో జీహెచ్‌ఎంసీ.. చలాన్‌ వేసింది.

    Read More »
  • 19 February

    తెలంగాణ రాష్ట్ర ప్రగతి అద్భుతం

    వ్యవసాయం, విద్యుత్తు, నీటిపారుదలరంగాల్లో తెలంగాణ ఎంతో ప్రగతిని సాధించిందని బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ ప్రశంసించారు. రాష్ట్రంలో 31 జిల్లాల్లో పర్యటించిన ఆయన గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రగతిపై సమాలోచనలు చేశారు. కరోనా అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని ఫ్లెమింగ్‌ అడిగి తెలుసుకున్నారు. తాను స్వయంగా స్థానికంగా పర్యటించి, అమలవుతున్న …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat