TimeLine Layout

November, 2022

  • 13 November

    అమ్మానాన్నల్లో ఎవరు కావాలి..? పాప జవాబుకు చలించి అక్కున చేర్చుకున్న జడ్జి!

    ఆ ఆరేళ్ల చిన్నారి తల్లిదండ్రులు విడిపోవాలని కోర్టును ఆశ్రయించారు. పాప ఎవరి దగ్గర ఉండాలని విషయమై జడ్జి ఆ చిన్నారిని అమ్మ కావాలా.. నాన్న కావాలా.. అని అడిగింది. దీంతో ఆ చిన్నారి తడుముకోకుండా చెప్పిన ఆన్సర్‌కు జడ్జి సైతం చలించిపోయారు. షాద్‌నగర్ పట్టణంలోని కోర్టులో శనివారం ఈ ఘటన జరిగింది. కల్వకుర్తి పరిధిలోని మాడ్గుల గ్రామానికి చెందిన భార్యాభర్తలు తమకు డివోర్స్ కావాలంటూ లోక్‌అదాలత్‌లో భాగంగా న్యాయమూర్తిని ఆశ్రయించారు. …

    Read More »
  • 13 November

    ఎయిర్‌షోలో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు.. ఆరుగురు మృతి!

    అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో దారుణం చోటుచేసుకుంది. వెటర్స్ గౌరవార్థం మూడు రోజుల పాటు ఎయిర్‌షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రెండు యుద్ధ విమానాలు ఎయిర్‌షో చేసేందుకు గాల్లో ఎగరగా రెండు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు సిబ్బంది మృతి చెందారు. ఈ విషయాన్ని ది ఫెడరల్ ఎవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రెండు విమానాలు బోయింగ్ …

    Read More »
  • 13 November

    త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్: హరీశ్‌రావు

    రాష్ట్రంలో త్వరలోనే గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేంద్రం అగ్నిపథ్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని ఆయన అన్నారు. యువత జీవితాన్ని నాశనం చేసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన విమర్శించారు. సిద్ధిపేటలో కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న యువతకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 వేలకు …

    Read More »
  • 13 November

    వైజాగ్ సముద్ర తీరాన “నేవీ మారథాన్”.. 18 వేల మంది పరుగులు

    విశాఖ పట్నం సాగర తీరాన నేవీ మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 18 వేలమంది యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పరుగులు తీశారు. ఈ మారథాన్.. ఫుల్ మారథాన్ 42కిలోమీటర్లు, ఆఫ్‌ మారథాన్‌ (21కే), 10కే, 5కే విభాగాల్లో జరిగింది. ఆర్‌కే బీచ్‌ సమీపంలోని కాళికాదేవి ఆలయం ఆవరణలో నేవీ ఆఫీసర్లు, సినీ నటులు అడవి శేషు, మిలింద్ సోమన్ …

    Read More »
  • 13 November

    ఓటీటీలోకి కాంతార ఎప్పుడొస్తుందో తెలుసా..!

    ఏ ఆర్భాటం లేకుండా కేవలం ఓ కన్నడ మూవీగా రిలీజ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార సినిమా. ఒక్క భాషలోనే రిలీజ్ బ్లాక్‌బస్టర్‌ టాక్ దక్కించుకోవడంతో చకచకా ఇతర భాషల్లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీ కోసం రెండు మూడు సార్లు థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు ఉన్నారంటే సినిమా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో సినీప్రియులు కాంతార ఎప్పుడడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎంతో …

    Read More »
  • 13 November

    తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైతుబంధు

    రాష్ట్ర రైతులకు తీపి కబురు తెలిపింది ప్రభుత్వం. డిసెంబరులో రైతు బంధు నగదును ఖాతాల్లో వేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైతు బంధు సాయం నిధులను రిలీజ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రెండో పంట సాగుకు రైతు బంధు సాయాన్ని అందించనున్నట్లు మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయగా ఆర్థిక శాఖ ఆమోదించింది. రైతుబంధు కింద సంవత్సరానికి రెండు …

    Read More »
  • 13 November

    సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం!

    తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మునగాల సమీపంలో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో పది మంది తీవ్రంగా గాయపడడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది. మునగాల మండల కేంద్రం శివారులోని పెట్రోలు బంక్‌ వద్ద ఓ ట్రాక్టర్, లారీని ఢీకొట్టింది. ట్రాక్టర్ రాంగ్ రూట్‌లో వెళ్లడం వల్లనే ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి సమీపంలోని సాగర్ …

    Read More »
  • 12 November

    ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీలు

    ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఈ రోజు శనివారం తెలంగాణలో  రామగుండంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పట్టణంలో ఫ్లెక్సీలు వెలిసాయి. తెలంగాణకు మోదీ ఇచ్చి హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ గుర్తుతెలియని వ్యక్తులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఐటీఐఆర్‌ ఏర్పాటు ఎంతవరకు వచ్చిందని, టెక్స్‌టైల్‌ పార్కు ఏమైందని, మిషన్ భగీరథకు ఎన్ని నిధులు ఇచ్చారని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడికిపోయిందని, డిఫెన్స్ కారిడార్, బయ్యారం స్టీల్‌ప్లాంట్, మెడికల్ …

    Read More »
  • 12 November

    దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

    గడిచిన గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 833 కరోనా   కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో  ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,65,643కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,553 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,22,562 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఎనిమిది మంది …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat