తమిళనాడు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీంఎకేకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు సీ విజయభాస్కర్, ఎ స్పీ వేలుమణి ఇండ్లపై ఈ రోజు మంగళవారం విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఈ ఇద్దరు మంత్రులకు చెందిన 30 ప్రదేశాల్లో ఆ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఇద్దరిపై వేర్వేరుగా అవినీతి కేసులు రిజిస్టరై ఉన్నాయి. పుడుకొట్టై జిల్లాలోని ఇలుపురులో ఉన్నమాజీ ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్ నివాసంలో …
Read More »TimeLine Layout
September, 2022
-
13 September
సీఎం నితీశ్ కుమార్ కు బీజేపీ షాక్
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని అధికార పార్టీ అయిన జేడీయూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో మైత్రిబంధాన్ని తెగదెంపులు చేసుకున్న సంగతి విధితమే. దీంతో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కమలనాథులు తన పాత మిత్రపక్షమైన జేడీయూకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. డయ్యూ డామన్ ప్రాంతంలో జేడీయూకు 17 మంది పంచాయతీ సభ్యులున్నారు. వారిలో 15 మంది కాషాయ కండువాలు కప్పుకున్నారు. మరో వైపు …
Read More » -
13 September
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అరెస్ట్
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ని మరమనిషి అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీకి చెందిన హుజూర్ బాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ క్రమంలో సభ నుంచి బయటకు వచ్చిన ఈటలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే ఈటలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అరెస్ట్పై ఈటల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. …
Read More » -
13 September
జీఎస్టీ సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలపై జీఎస్టీ భారం మరింత పెరుగుతోంది. పాలు, పెరుగు సహా ప్రతి చిన్న వస్తువుపై జీఎస్టీ పడుతోంది. ఇదే విషయాన్ని సభకు తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఇంటి యజమానులకు ఉన్న మినహాయింపును కూడా కేంద్రం తొలగించిందని ఆయన తెలిపారు.పార్లమెంటులో మెజార్టీ ఉంది కదా …
Read More » -
13 September
బీజేపీ సర్కారుపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అగ్రహాం
ఉమ్మడి ఏపీ విభజన చట్టం రూపొందించేటప్పుడే తెలంగాణకు అన్యాయం జరిగిందని, అన్ని రకాల కేంద్ర విద్యాసంస్థలు ఏపీలో నెలకొల్పేలా చట్టంలో పొందుపరిచారని మండలిలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు. తెలంగాణకు ఇచ్చిన ట్రైబల్ యూనివర్సిటీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని, కేంద్రం తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క విభజన హామీ నెరవేర్చలేదని చెప్పారు. ‘వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏపీకి రావాల్సిన అన్నింటినీ దగ్గరుండి ఏపీకి ఇప్పించారు. తెలంగాణకు ఒక …
Read More » -
13 September
మోదీ, కేటీఆర్ల దిగ్భ్రాంతి.. ఎక్స్గ్రేషియా ప్రకటన
సికింద్రాబాద్లోని రూబీ లగ్జరీ హోటల్లోని గ్రౌండ్ ఫ్లోర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది మరణించగా.. తాజాగా ప్రధానిమోదీ, రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. – ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధాని మోదీ ప్రకటించారు. – అగ్రిప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం తరఫున …
Read More » -
13 September
సికింద్రాబాద్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి..!
సికింద్రాబాద్లోని రూబీ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఏడుగురు మరణించగా పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. తాజాగా మరో వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 8కి చేరింది. మరణించినవారు, గాయపడిన వారిలో ఏపీ వాసులు ఉన్నారు. గాయపడిన వారిని సిటీలోని అపోలో, యశోద హాస్పిటల్స్కి తరలించారు. మృతులు వీరే.. ఈ ఘటనలో విజయవాడ రామవరప్నాడుకు చెందిన అల్లాడి …
Read More » -
12 September
ఓవర్టేక్ చేస్తూ.. లారీ కిందకి దూసుకెళ్లిన బైక్.. 3 మృతి!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ బైకు లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More » -
12 September
ఆయోధ్య రాముడి మందిరానికి ఖర్చు ఎంతో తెలుసా..!
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి బడ్జెట్ను వెల్లడించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. రాముడి మందిరానికి అక్షరాల రూ. 1800 కోట్ల దాకా ఖర్చు అవుతుందని తెలిపింది ట్రస్ట్. ఆదివారం ఫైజాబాబ్ సర్క్యూట్ హౌస్లో ఇందుకు సంబంధించిన విషయాలపై చర్చించేందుకు సమావేశమయ్యారు ట్రస్ట్ సభ్యులు. ఈ సమావేశంలో ఆలయ నిర్మాణ విధివిధానాలకు ఆమోదం తెలిపింది ట్రస్ట్. ఇందులో ట్రస్ట్కు చెందిన మొత్తం 15 మంది సభ్యులు పాల్గొన్నారు.
Read More »