సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీనటుడు కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ఇవాళ(ఆదివారం) వేకువజామున 3.25 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో సినీరంగంలో తీవ్ర విషాదం నెలకొంది. రేపు ఉదయం హైదరాబాద్లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణం రాజు 1940 జనవరి 20న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో …
Read More »TimeLine Layout
September, 2022
-
10 September
తెలంగాణకు అతి భారీ వర్షసూచన
రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఓ ప్రకటన విడుదల చేశారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. వర్షాలతో పాటు గంటకు సుమారు 40కి.మీ వేగంతో …
Read More » -
10 September
Tollywood లో విషాదం
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చి అఖండ విజయం సాధించిన మహర్షి సినిమాలో రైతుగా నటించిన నటుడు గురుస్వామి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. మహర్షి మూవీలో మట్టి, రైతుల మధ్య అనుబంధాన్ని చెప్పే సీన్లో గురుస్వామి నటన ఆకట్టుకుంటుంది. కర్నూలు (D) వెల్దుర్తిలో పుట్టిన ఆయన.. చదువు పూర్తైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేసి, విజేత ఆర్ట్స్ సంస్థను స్థాపించి నాటకాలు …
Read More » -
10 September
ఏడాది వయసులోనే పెళ్లి ..20ఏండ్లకు ఆ పెళ్లి రద్దు.. ఎందుకంటే..?
రాజస్థాన్ జోధ్ పూర్ కు చెందిన రేఖ అనే బాలికకు ఏడాది వయసులోనే ఓ బాలుడికిచ్చి 20 ఏళ్ల కిందట బాల్యవివాహం చేశారు. తాజాగా కాపురానికి రావాలని అత్తింటివారు ఒత్తిడిచేశారు. తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లిని ఒప్పుకోనని రేఖ చెప్పడంతో కుల పెద్దలు రూ.10 లక్షలు జరిమానా విధించారు. దీంతో ఆమె ఓ ట్రస్టు సాయంతో ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసింది. విచారించిన కోర్టు.. ఆ పెళ్లిని రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది.
Read More » -
10 September
ఎలిజబెత్ తాగిన టీ బ్యాగ్ ఎంతనో తెలుసా..?
బ్రిటన్ రాణీ ఎలిజబెత్ II మరణంతో.. ఆమె వాడిన టీబ్యాగ్ ను Ebay అమ్మకానికి పెట్టింది. 1998లో ఎలిజబెత్ ఈ టీ బ్యాగ్ ను వినియోగించారు.. దానిని దాదాపు 12వేల డాలర్లకు Ebay అమ్ముతోంది. అంటే దాదాపు రూ.9.5 లక్షలకు కొనుగోలు చేయొచ్చు. ఈ టీ బ్యాగ్ మార్కెట్లో రూ. 5కు దొరుకుతుంది ..కానీ రాణి యూజ్ చేసినందున రూ.9.5లక్షలకు అమ్ముతున్నారు. ఎలిజబెత్ II మరణంతో ప్రపంచ దేశాల ప్రముఖులు …
Read More » -
10 September
తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ గా తరుణ్ చుగ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి ఇంఛార్జ్, కో ఇంఛార్జ్ లు నియమితులయ్యారు. తరుణ్ చుగ్ ఇంఛార్జ్, అరవింద్ మీనన్ కో ఇంఛార్జ్ గా నియమిస్తూ బీజేపీ జాతీయ అధిష్టానం ప్రకటన జారీ చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు ఇంఛార్జ్, కో ఇంఛార్జ్లను నియమించింది. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ దేబ్ ను హర్యానా ఇంఛార్జ్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని పంజాబ్ ఇంఛార్జ్ నియమించింది. పశ్చిమబెంగాల్ కు బీహార్ …
Read More » -
10 September
అమలపాల్ కు రెండో పెళ్లైందా..?
సరిగ్గా ఎనిమిదేండ్ల కిందట అంటే 2014లో తమిళ దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకుని, విడిపోయిన హీరోయిన్ అమలాపాల్ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పంజాబీ సింగర్ భవి నిందర్ సింగ్ తనను వేధిస్తున్నాడని అమలాపాల్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. 2017లోనే అమలతో సింగ్ కు పెళ్లి జరిగిందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు ఆధారాలు సమర్పించారు. దీంతో అమల రెండో పెళ్లి నిజమేనని …
Read More » -
10 September
మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానే..?
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గుభాళించేది గులాబీ జెండాయేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఇప్పటికే అక్కడ టీఆర్ఎస్ విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని చెప్పారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలం కొండూరు గ్రామ ఉప సర్పంచ్ పాలకుర్ల జంగయ్య గౌడ్, వార్డు సభ్యులు జహంగీర్, పగడాల రాములు, రాంబాబు, ఉడుగు శ్రీను శనివారం ఉదయం …
Read More » -
10 September
తెలంగాణ యువతకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్శాఖకు ఆర్థికశాఖ ఇటీవల 529 పోస్టులను మంజూరుచేసిన నేపథ్యంలో ఆయా పోస్టులను వివిధ జిల్లాలకు విభజిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిషత్తు (జెడ్పీ), జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాల్లో (డీపీవో) వివిధ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జెడ్పీ సూపరిటెండెంట్ పోస్టులు 103, జెడ్పీ సీనియర్ అసిస్టెంట్ పోస్టులు 151, జెడ్పీ జూనియర్ …
Read More » -
10 September
సోషల్ మీడియాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సెటైర్లు
కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వ తీరు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా మారింది. సెప్టెంబర్ 17న తాము చేసే కార్యక్రమాలను ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంచడానికి ఏకంగా ప్రైవేటు సంస్థల సహకారం తీసుకోవాలని నిర్ణయించింది. దీని కో సం ఏకంగా టెండర్లనే పిలిచింది కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ. ప్రపంచంలోని ఏ దేశ ప్రభుత్వం కూడా ట్విట్టర్లో ట్రెండింగ్ కోసం టెండర్లు పిలిచిన దాఖలాలు లేవు. ఒక్క మన కేంద్ర …
Read More »