TimeLine Layout

July, 2022

  • 16 July

    ఏపీలో అర్హులైన 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్హులైన దాదాపు 3.5 కోట్ల మందికి బూస్టర్ డోస్ ఉచితంగా అందించేలా ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి విడదల రజని చెప్పారు. రోజుకు 15 లక్షల మందికి చొప్పున టీకా వేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మొత్తం 45 రోజుల్లో అందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామన్నారు. పీహెచ్సీలు, సచివాలయాలు, రైల్వేస్టేషన్లు, కాలేజీలు, స్కూళ్లు, బస్టేషన్లు, పారిశ్రామిక వాడల్లో బూస్టర్ డోసు అందుబాటులో ఉంటుందన్నారు.

    Read More »
  • 16 July

    ఆ హీరో నటనంటే నాకిష్టం

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సర్కారు వారి పాట’తో మంచి విజయాన్ని అందుకున్న మహానటి కీర్తి సురేష్.. తాజాగా ధనుష్ సరసన “సాని కాగితం” మూవీలో నటించింది కీర్తి. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో తనకు విజయ్ సేతుపతి నటనంటే చాలా ఇష్టమని చెప్పింది. జయంరవి, కార్తీ లాంటి నటులతో సినిమాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. మణిరత్నం, రాజమౌళి, శంకర్ దర్శకత్వంలో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. …

    Read More »
  • 16 July

    ఏపీ యువకుడు.. అమెరికా క్రికెట్‌ టీమ్‌కి ఎంపిక

    ఆంధ్రా తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడిన శివకుమార్‌ అనే యువ ఆటగాడు అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. నెదర్లాండ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలి ఇంటర్నేషనల్‌మ్యాచ్‌ను అతడు ఆడాడు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన శివకుమార్‌.. కొంతకాలం క్రితం అమెరికాలో స్థిరపడ్డాడు. ఏదైనా దేశం తరఫున జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలంటే కనీసం మూడేళ్లు ఆ దేశంలో నివసించాలన్నది ఐసీసీ నిబంధన. ఈ నేపథ్యంలో ఇటీవలే మూడేళ్ల …

    Read More »
  • 16 July

    త్వరలో సీఎం జగన్‌ ‘ప్రజాదర్బార్‌’

    త్వరలో ప్రజా సమస్యలపై నేరుగా ప్రజల నుంచే వినతిపత్రాలను స్వీకరించేందుకు ఏపీ సీఎం జగన్‌ సిద్ధమవుతున్నారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ‘ప్రజాదర్బార్‌’ పేరిట వీటిని స్వీకరించి సమస్య పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం 10 గంటలోపు ఈ ప్రజాదర్బార్‌ను పూర్తిచేసే అవకాశముంది. మధ్యాహ్న సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఆయన అపాయింట్‌మెంట్‌ ఇవ్వనున్నారు. శని, …

    Read More »
  • 16 July

    IIIT విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి : మంత్రి హరీశ్‌రావు

    బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును స్పందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌, కలెక్టర్‌, జిల్లా వైద్యాధికారులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక వైద్య బృందాలను పంపడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.

    Read More »
  • 16 July

    IIIT విద్యార్థులకు అస్వస్థత.. విచారణకు మంత్రి ఆదేశం

    బాసర ఆర్జీయూకేటీలో మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్‌ దవాఖానకు తరలించాలని ఆర్జీయూకేటీ డైరెక్టర్‌, జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు

    Read More »
  • 16 July

    70 అడుగుల‌కు పైగా గోదావ‌రి ప్ర‌వాహం

    కుండ‌పోత వ‌ర్షాలు, భారీ వ‌ర‌ద‌ల నేప‌థ్యంలో గోదావ‌రి ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలో భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి న‌ది మ‌హోగ్ర‌రూపం దాల్చింది. న‌దీ ప్ర‌వాహం 70 అడుగులు దాటి పోయింది. న‌దీ ప్ర‌వాహాన్ని చూసి స్థానికులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. భ‌ద్రాచ‌లం ప‌రిస‌రాల్లో ఎటు చూసినా వ‌ర‌ద ప్ర‌వాహామే క‌నిపిస్తోంది. దీంతో భ‌ద్రాచ‌లం రామాల‌యంతో పాటు స‌మీప కాల‌నీలు నీట మునిగాయి. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్ర‌స్తుతం భ‌ద్రాచ‌లం వ‌ద్ద …

    Read More »
  • 16 July

    గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ రేపు ఆదివారం ఏరియల్‌ సర్వే

    తెలంగాణ రాష్ట్రంలో గత వారంతం భారీ వర్షాలు కురిసిన సంగతి విదితమే. దీంతో రాష్ట్రంలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ రేపు ఆదివారం ఉదయం ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. ఎన్నడు లేని విధంగా కురిసిన వర్షాలతో   కడెం నుంచి భద్రాచలం వరకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్‌ పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేయనున్నారు. ముంపు …

    Read More »
  • 16 July

    దేశంలో కొత్తగా 20,044 మందికి కరోనా  పాజిటివ్‌

    దేశంలో ఈ వారంలో వరుసగా మూడో రోజూ 20 వేలకుపైగా కరోనా పాజిటీవ్  కేసులు నమోదయ్యాయి. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో  కొత్తగా 20,044 మందికి కరోనా  పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసుల సంఖ్య 4,37,30,071కు చేరాయి. ఇందులో 4,30,63,651 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.కరోనా మహమ్మారి భారిన పడి మొత్తం  5,25,660 మంది మృతిచెందారు. మరో 1,40,760 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat