నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ విడతల వారీగా అనుమతులు ఇస్తోంది. తొలి విడతలో 30,453 పోస్టులకు పర్మిషన్ ఇచ్చిన ఆర్థికశాఖ.. ఈరోజు మరో 3,334 పోస్టుల భర్తీకి అనుమతించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పోస్టులు అగ్నిమాపక, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని ఖాళీలకు సంబంధించినవి. మిగతా శాఖల్లోని …
Read More »TimeLine Layout
April, 2022
-
13 April
తిరుమలకు భారీగా భక్తులు.. 30 కంపార్ట్మెంట్లు ఫుల్
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులను కూడా టీటీడీ అనుమతిస్తుండటంతో పెద్ద ఎత్తున తిరుమల చేరుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు సర్వదర్శనం టోకెన్లు లేని సుమారు 17వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లలోనూ క్యూలైన్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం పూర్తయ్యేందుకు సుమారు 10 నుంచి 15 …
Read More » -
13 April
మంత్రి రోజాకు దిష్టితీసిన భర్త సెల్వమణి
వైకాపా జెండా పట్టుకుని నడిచిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాష్ట్రంలోని కుల సమీకరణాల ఆధారంగా కేటాయింపులు చేశారని చెప్పారు. సచివాలయంలోని రెండో బ్లాక్లో రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రోజాకు ఆమె భర్త సెల్వమణి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ …
Read More » -
13 April
గవర్నమెంట్ హాస్పిటల్స్లో బూస్టర్కి పర్మిషన్ ఇవ్వండి: హరీశ్రావు
రాష్ట్రంలోని గవర్నమెంట్ హాస్పిటళ్లలోనూ కొవిడ్బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. ఇటీవల 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి కేవలం ప్రైవేట్ హాస్పిటల్స్లోనే బూస్టర్ డోసుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటళ్లలో బూస్టర్ డోసు ఇచ్చేందుకు అనుమతించాలని మన్సుఖ్ మాండవీయను హరీశ్రావు కోరారు. …
Read More » -
13 April
నేనెప్పుడూ జగన్కు విధేయురాలినే: సుచరిత
ఇటీవల మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఏపీ హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత సీఎం జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. కేబినెట్లో చోటు కల్పించలేకపోవడానికి గల కారణాలను సీఎం వివరించడంతో ఆమె మెత్తబడ్డారు. అనంతరం మీడియాతో సుచరిత మాట్లాడారు. దివంగత సీఎం రాజశేఖర్రెడ్డి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. జడ్పీటీసీ నుంచి హోంమంత్రిగా ఎదిగేందుకు జగన్ అవకాశం కల్పించారన్నారు. రెండున్నరేళ్ల తర్వాత కొంతమందిని మారుస్తానని సీఎం ముందే చెప్పారని.. …
Read More » -
13 April
అంబేద్కర్ వల్లే తెలంగాణ వచ్చింది : మంత్రి కేటీఆర్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేటలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పీవీ మార్గ్లో 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి ఈ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరించబోతోందన్నారు. భారతదేశం …
Read More » -
13 April
“ఆ పని చేస్తుంటే” నాకు ముచ్చెమటలు పడతాయి-పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ… అందాల రాక్షసి ..బుట్టబొమ్మ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తన గురించి ఎవరైన పొగుడుతూ’ఎవరైనా నాపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే నాకు చెమటలు పట్టేస్తుంటాయి’ అని హీరోయిన్ పూజా హెగ్దే అంటోంది. స్టేజీపై ఎవరైనా ఎదురుగా నుంచొని తనపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే కొంచెం ఒత్తిడి గురవుతానని తెలిపింది. ఆ పొగడ్తలను ఎలా తీసుకోవాలో తనకు తెలియదని చెప్పొకొచ్చింది. కానీ …
Read More » -
13 April
ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రికాషన్ డోస్ కు అనుమతించండి -కేంద్రానికి మంత్రి హరీశ్ రావు లేఖ
ప్రభుత్వం వైద్యంలో 18-59 వయస్సు వారికి కరోనా నుంచి రక్షణకు ప్రికాషనరీ డోస్ ఇవ్వడానికి అనుమతివ్వాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. భవిష్యత్లో కొత్త వేరియంట్ల ద్వారా కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో, రెండు డోసులు పూర్తి చేసుకొని అర్హులైన వారికి ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుక్ మాండవీయకు విజ్ఞప్తి చేశారు. ఈ …
Read More » -
13 April
పాన్ ఇండియన్ ట్రెండ్ గురించి KGF దర్శకుడు షాకింగ్ కామెంట్స్
పాన్ ఇండియన్ ట్రెండ్ గురించి మాట్లాడటానికి తాను సరైన వ్యక్తినని అనుకోవడం లేదని స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అన్నాడు. బ్లాక్బస్టర్ హిట్ అయిన KGF కూడా తాను అనుకోకుండా చేసిన సినిమానేనని చెప్పుకొచ్చాడు. అది అంతపెద్ద సినిమా అవుతుందని తాను ముందు ఊహించలేదని వెల్లడించాడు. యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన KGF భారీ హిట్ కొట్టడంతో ఇప్పుడు KGF2 సిద్ధం చేశారు. ఆ సినిమా ఏప్రిల్ 14న …
Read More » -
13 April
ముఖేష్ అంబానీకి షాకిచ్చిన అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ
ప్రముఖ వ్యాపార వేత్త అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరులు జాబితాలో 6వ స్థానానికి చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 65,091 కోట్లను చేరుకుంది.. దీంతో 118 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఆయన ఈ స్థానానికి చేరుకున్నట్లు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ తెలిపింది. అటు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలోనూ అదానీ 6వ స్థానంలో ఉండగా.. రిలయన్స్ …
Read More »