అమరావతి: సారాను విచ్చలవిడిగా ఊరూరా ప్రవహించేలా చేసింది టీడీపీ చీఫ్ చంద్రబాబే అని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రభుత్వం ఇచ్చే వివరణను కూడా టీడీపీ సభ్యులు వినిపించుకోకుండా సభలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. శాసనసభలో నారాయణస్వామి మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సారా వ్యవహారంలో రూ.550కోట్లను చంద్రబాబు కొల్లగొట్టారని.. ఆయనపై కేసు కూడా నమోదైందని గుర్తు చేశారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం ఆయనకు బాగా …
Read More »TimeLine Layout
March, 2022
-
21 March
ఏపీ అసెంబ్లీలో ‘పెగాసస్’ రచ్చ.. !
అమరావతి: ఏపీ శాసనసభలో ‘పెగాసస్’ అంశం చిచ్చు రాజేసింది. ఇటీవల వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో చేసి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత వేడిని రాజేశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెగాసస్ స్పైవేర్ను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ మమత పేర్కొన్నారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అప్పటి ఐటీ మంత్రి లోకేష్ స్పందిస్తూ అలాంటిదేమీ లేదని.. ఆ స్పైవేర్ను కొనలేదని చెప్పారు. ఈ …
Read More » -
21 March
ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం సీఎం కేసీఆర్
ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. సోమవారం టీఆర్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ధాన్యం సేకరణ విషయంపై కేంద్రంతో చర్చించేందుకు రేపు మంత్రుల బృందం, ఎంపీల బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఆహారశాఖ మంత్రిని కలిసి, మెమోరాండం అందజేస్తారన్నారు. వాళ్లు సమ్మతిస్తే సంతోషం.. సమ్మతించని పక్షంలో ఎంతని పోరాటానికైనా సిద్ధం కావాలని సమావేశం నిర్ణయించిందని పేర్కొన్నారు. ‘ఈ పోరాటం ఆషామాషీగా …
Read More » -
21 March
దేశానికి కావాల్సింది కశ్మీర్ ఫైల్స్ కాదు.. డెవలప్మెంట్ ఫైల్స్ -సీఎం కేసీఆర్
తెలంగాణ భవన్ లో గులాబీ దళపతి,సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులతో సహా పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కాశ్మీర్ ఫైల్స్ …
Read More » -
21 March
ప్రభాస్ తో మళ్లీ నటిస్తా అంటున్న బుట్టబొమ్మ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా లేటెస్ట్ గా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ రాధే శ్యామ్. ఇందులో హీరోయిన్ గా బుట్టబొమ్మ ..హట్ బ్యూటీ పూజా హెగ్డే నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మళ్లీ పనిచేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది . ‘ రాధేశ్యామ్ కోసం ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకెంతో ఆనందంగా …
Read More » -
21 March
రాశీ ఖన్నా సంచలన వ్యాఖ్యలు
చిన్న సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగెట్టిన అందాల రాక్షసి..సొట్టబుగ్గల సుందరి…టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన వివరాలను తెలిపింది. ‘నిజానికి నేను కాపీ రైటర్ కావాలనుకున్నాను. ఇందుకోసం డిగ్రీ పూర్తి చేయగానే దానికి సంబంధించిన కోర్సు కూడా చేద్దామనుకున్నా. అంతలోపే మద్రాస్ కేఫ్ అవకాశం వచ్చింది. అనంతరం అవసరాల శ్రీనివాస్ ఊహలు గుసగుసలాడే స్క్రిప్ట్ నన్ను సంప్రదించారు. కాదనలేకపోయాను’ అంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.
Read More » -
21 March
కాకరకాయతో లాభాలు ఎన్నో..?
కాకరకాయ తినడానికి చేదుగా ఉంటది.. దీనివల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. *కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తుంది. * కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు *జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. *రక్తాన్ని శుద్ధి చేయడంలో సాయపడుతుంది. * కాలినగాయాలు, పుండ్లు మానడానికి తోడ్పడుతుంది.
Read More » -
21 March
శ్రీలంకలో కిలో చికెన్ రూ. వెయ్యి పైమాటే.
శ్రీలంక దేశం గత కొన్ని రోజులుగా తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో విలవిల్లాడుతోంది. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దేశంలో ఇప్పుడు ఓ కోడిగుడ్డు రూ. 35 పలుకుతుంది. కిలో చికెన్ రూ. వెయ్యి పైమాటే. పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ధరలైతే అందకుండా పోయాయి. లీటరు పెట్రోలు ప్రస్తుతం రూ.283 ఉండగా, డీజిల్ రూ. 220గా ఉంది. కరెంటు ఊసే లేకుండా పోయింది. ఆర్థిక సంక్షోభం ముదరడంతో దేశంలోని 90 …
Read More » -
21 March
వేసవిలో కర్బూజ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు
ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎండలు మండుతున్నాయి. అందుకే వేసవిలో కర్బూజ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. డీహైడ్రేషన్, ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. శరీరం తేమగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. హైబీపీని తగ్గించి గుండెను సురక్షితంగా ఉంచుతుంది. కంటి చూపు మెరుగు పరిచి కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. కర్బూజ తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర …
Read More »