TimeLine Layout

January, 2022

  • 21 January

    తెలంగాణలో నేటి నుండి ఫీవర్‌ సర్వే

    తెలంగాణ రాష్ట్రంలో  శుక్రవారం నుండి ఫీవర్‌ సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. గురువారం ఆయన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు. ఆరోగ్య సిబ్బందికితోడు మున్సిపల్, పంచాయతీ అధికారులు ఫీవర్‌ సర్వేలో పాల్గొంటారన్నారు. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తారన్నారు.లక్షణాలున్న వారందరికీ హోం ఐసోలేషన్‌ …

    Read More »
  • 21 January

    తెలంగాణలో కరోనా ఆంక్షలు పొడిగింపు

    తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కొవిడ్‌ ఆంక్షలను పొడిగించింది. ఇప్పటికే సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. ఇవాళ్టితో ఆంక్షల గడువు ముగుస్తున్న తరుణంలో ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్‌ మహమ్మారి కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని ప్రభుత్వం సూచించింది. …

    Read More »
  • 20 January

    టాలీవుడ్ లో విషాదం

    టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో మరణించాడు. ఆయన స్వస్థలం శ్రీకాకుళం పలాసలో కన్నుమూశాడు. గతంలో షూటింగ్ సమయంలో పడిపోవడంతో శ్రీనుకు ఛాతీపై దెబ్బ తగిలింది.. తర్వాత గుండె సమస్యలు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక శ్రీనివాస్ సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియల్స్ లో నటించాడు.జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది,మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా MBBS, …

    Read More »
  • 20 January

    దానిమ్మలో దండిగా పోషకాలు

    దానిమ్మలో దండిగా పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు..అయితే దానిమ్మను తినడం వల్ల ఏమి ఏమి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా…? దానిమ్మ గింజలను తింటే రక్తవృద్ధికి తోడ్పడతాయి. గుండెకు మేలు చేస్తాయి.. దానిమ్మకు నొప్పులు తగ్గించే శక్తి ఉంది..మన చర్మాన్ని మృదువుగా మార్చడంలో దోహదపడుతుంది.. దానిమ్మతో జీర్ణశక్తిని పెరుగుతుంది.మన తల జుట్టు ఆరోగ్యంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. దానిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.. నోటిలోని బ్యాక్టీరియాలను …

    Read More »
  • 20 January

    తెలంగాణలో గ్రామాల్లో కరోనా పంజా

    తెలంగాణలో గ్రామాల్లో కరోనా పంజా విసురుతోంది. రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ తోపాటు మరో 14 జిల్లాల్లో వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, హనుమకొండ, సంగారెడ్డి, ఖమ్మం, మంచిర్యాల, కరీంనగర్, భద్రాద్రి, పెద్దపల్లి, మహబూబ్నగర్, సిద్దిపేట, నిజామాబాద్, యాదాద్రి, వికారాబాద్ జిల్లాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాకపోకలు యథేచ్ఛగా కొనసాగడం, పండగలు, శుభకార్యాలు, రాజకీయ కార్యక్రమాలే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయి.

    Read More »
  • 20 January

    మేడారం మహాజాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

    మేడారం మహాజాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ చెప్పారు.వచ్చేనెల 16 నుంచి 19 వరకు జరిగే జాతరలో అమ్మవార్లను దర్శించుకోవటానికి వచ్చే వీఐపీ, వీవీఐపీలకు ఇచ్చే పాస్‌ (సాట్ల)లలో వారు దర్శించుకొనే తేదీ,సమయం కచ్చితంగా ఉండేలా ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు.తద్వారా సాధారణ భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బంది కలుగదని వెల్లడించారు. సమ్మక్క-సారలమ్మలు గద్దెల మీద కొలువైన రోజే సీఎం కేసీఆర్‌ దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారని ఆమె …

    Read More »
  • 20 January

    డీఏ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

    తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల డీఏ సుమారుగా 10.01 శాతం పెరగనుండగా.. 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ వర్తించనుంది. ఈ నెల వేతనంతో కలిపి పెరిగిన డీఏ అకౌంట్లో జమ కానుండగా.. 2021 జూలై నుంచి బకాయిలు జీపీఎఫ్ ప్రభుత్వం జమ చేయనుంది. ఇటీవల కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    Read More »
  • 20 January

    తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం

    మూడు వన్డేల సీరిస్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 31 పరుగుల తేడాతో భారత్ పరాజయం పాలైంది. సఫారీ బౌలర్ల దాటికి 265/8 పరుగులకే పరిమితం అయ్యింది. చివర్లో శార్థూల్(50*) పోరాడినా విజయాన్ని అందించలేకపోయాడు. ధావన్ 79, కోహ్లి 51 పరుగులతో రాణించినా మిగతా బ్యాట్స్మెన్ తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో ఓటమి పాలైంది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, షంసీ, ఫెహ్లుక్వాయో తలో 2వికెట్లు తీయగా, మహరాజ్, మార్క్రమ్ …

    Read More »
  • 20 January

    బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్ర ముప్పు

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఉగ్ర ముప్పు ఉందన్న హెచ్చరికలతో.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో నాంపల్లి పార్టీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే అప్రమత్తం చేయాలని కార్యాలయం సిబ్బందికి పోలీసులు సూచించారు. జనవరి 26 వరకు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి సమయంలో గస్తీని ముమ్మరం చేయాలని ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందిని ఆదేశించారు

    Read More »
  • 20 January

    గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ పొత్తు

    గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీలో భాగమైన ఆ పార్టీలు కాంగ్రెస్ లేకుండానే కూటమిగా ముందుకెళ్తున్నాయి. గెలిచేందుకు అవకాశమున్న సీట్లను తమకు కేటాయించాలని శివసేన కోరగా, కాంగ్రెస్ నిరాకరించినట్లు సమాచారం. తమతో జట్టుకట్టకపోవటం కాంగ్రెస్ దురదృష్టమని, గోవా ఎన్నికల్లో తమ బలాన్ని చూపుతామని శివసేన నేత సంజయ్ వ్యాఖ్యానించారు.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat