TimeLine Layout

January, 2022

  • 13 January

    సీఎం జగన్ తో చిరంజీవి భేటీ

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ప్రముఖ హీరో మెగాస్టార్‌ చిరంజీవి  గురువారం మధ్యాహ్నం తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో కలవనున్నారు . వీరిద్దరి మధ్య ఈ రోజు మధ్యాహ్నం మర్యాదపూర్వక లంచ్‌ భేటీ జరగనుంది. సినీ పరిశ్రమకు సంబంధించి పలు అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి సీఎం జగన్‌తో భేటీ కానున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

    Read More »
  • 13 January

    ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు

    నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. హిందూస్థాన్ యూనీలీవర్ (HUL) తమ ఉత్పత్తులైన వీల్, రిన్, సర్ఎక్సెల్, లైఫ్బయ్ తదితర సబ్బులు, డిటర్జెంట్ల ధరలను 3-20% వరకు పెంచింది. సర్ఎక్సెల్ సబ్బు రూ.10 నుంచి రూ.12, లైబ్బాయ్ రూ.29 నుంచి రూ. 31, కిలో వీల్ పౌడర్ రూ.60 నుంచి 62, రిన్ బండిల్ రూ.72 నుంచి రూ.76కు పెరిగాయి. ఇక గోధుమ పిండి ధర 5-8 శాతం, బాస్మతి బియ్యం …

    Read More »
  • 13 January

    పిల్లల్లో కరోనా కేసులు నిర్ధారణ లక్షణాలివే…

    ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని పిల్లల్లో కరోనా కేసులు నిర్ధారణ అవుతున్నట్లు వైద్యులు తెలిపారు. కడుపు నొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉన్న కొందరు చిన్నారులను టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఐదుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు.. ఇద్దరికి ఆక్సిజన్ చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లల్లో 101-102 డిగ్రీల జ్వరం, 3 విరేచనాలు వంటి లక్షణాలు ఉంటే టెస్టు చేయించాలని సూచిస్తున్నారు.

    Read More »
  • 13 January

    70రన్స్ లీడ్ లో టీమిండియా

    ఇండియా దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 3వ టెస్టులో 2వ రోజు ఆట పూర్తయింది. 2వ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ స్టంప్స్ సమయానికి 2వికెట్లు కోల్పోయి 57పరుగులు చేసింది. రాహుల్-10, మయాంక్-7 మరోసారి విఫలమయ్యారు. కోహ్లి-14, పుజారా-9 క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 210 పరుగులు చేసింది. పేసర్ బూమ్రా.. సఫారీల నడ్డి విరిచాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 223రన్స్ చేసింది. ప్రస్తుతానికి 70రన్స్ లీడ్ ఉంది.

    Read More »
  • 13 January

    అఖండ మూవీ కలెక్షన్ల సునామీ

    ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన అఖండ మూవీ కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. ఈనెల 20తో ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ టైంలో 50 రోజులు పాటు మూవీ రన్ కావడం అంటే మాములు విషయం కాదు. అఖండ విడుదలైన 10 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి చేరి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.73 కోట్లకు పైగా షేర్ (130 కోట్ల గ్రాస్) …

    Read More »
  • 13 January

    కోర్టులోనే కళ్లు తిరిగి పడిపోయిన మాజీ మంత్రి శంకర్రావు

    తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ మంత్రి శంకర్రావు కోర్టులోనే కళ్లు తిరిగి పడిపోయారు. 2కేసుల్లో ఆయన దోషిగా తేలారు. భూ వివాదంలో బెదిరింపు, మహిళను దూషించారన్న కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనను దోషిగా ప్రకటించింది. అంతేకాదు.. రూ.3,500 జరిమానా విధించింది. దీంతో శంకర్రావు అక్కడికక్కడే పడిపోయారు. షాద్నగర్ నమోదైన మరో కేసును కోర్టు కొట్టివేసింది.

    Read More »
  • 13 January

    RRR విడుదల జాప్యంపై రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు

    ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్,మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం RRR. అయితే ఈ చిత్రం విడుదల వాయిదా పడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో RRR వాయిదాపై హీరో రామ్ చరణ్ తొలిసారి స్పందించాడు. రౌడీ బాయ్స్ ప్రీ రిలీజ్ ఇవెంట్లో మాట్లాడుతూ.. ‘సినిమా కోసం 3 ఏళ్లు కష్టపడ్డాం. సంక్రాంతికి RRR మూవీ రిలీజ్ కాకపోయినా …

    Read More »
  • 13 January

    ఏపీలో కొత్తగా 3,205కరోనా కేసులు

    ఏపీలో గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో ఏకంగా 3,205కరోనా కేసులు వెలుగు చూశాయి. 2 రోజుల్లోనే 2వేలకు పైగా కేసులు పెరిగాయి. నిన్న 1,831 కేసులు వచ్చాయి. కాగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 10,119 యాక్టివ్ కేసులున్నాయి. విశాఖలో 695, చిత్తూరు 607, తూ.గో 274, శ్రీకాకుళం 268, గుంటూరు 224, కృష్ణా 217, విజయనగరం 212, నెల్లూరు జిల్లాలో 203, అనంతపురం జిల్లాలో 160 మంది వైరస్ బారినపడ్డారు. 281 మంది …

    Read More »
  • 13 January

    ఉద్యోగులకు మోదీ సర్కార్ ఊరటనిచ్చే నిర్ణయం

    దేశంలోని ఉద్యోగులకు మోదీ సర్కార్ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోబోతుంది. కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచనుంది. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి కౌ50వేలుగా ఉంది. దీన్ని 30-35 శాతానికి పెంచనున్నారు. వచ్చే బడ్జెట్లో దీనిపై ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. అయితే ఉద్యోగులు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకొని ఉంటే.. వారికి స్టాండర్డ్ డిడక్షన్ బెనిఫిట్ లభించదు. పాత పన్ను విధానంలో ఈ ప్రయోజనం ఉంటుంది.

    Read More »
  • 13 January

    కరోనా క్వారంటైన్ నిబంధనల్లో మార్పు

    కరోనా రోగుల కాంటాక్టులకు వారం రోజులే క్వారంటైన్ ఉంటుందని కేంద్రం తెలిపింది. అలాగే స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా బాధితులు సైతం 7 రోజుల్లోనే డిశ్చార్జ్ కావొచ్చని పేర్కొంది. కాగా దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నట్లు వెల్లడించింది. బెంగాల్(32%), ఢిల్లీ(23%), మహారాష్ట్ర (22%)లో పాజిటివిటీ రేటు అధికంగా ఉందని వివరించింది.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat