TimeLine Layout

August, 2021

  • 28 August

    మ‌ల‌క్‌పేటలో నేడు 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం..

    మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని పిల్లిగుడిసెలు బ‌స్తీలో నూత‌నంగా నిర్మించిన 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శ‌నివారం ప్రారంభించ‌నున్నారు. ఈ ఇండ్ల‌ను తొమ్మిది అంత‌స్తుల్లో రూ. 24.91 కోట్ల వ్య‌యంతో నిర్మించారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని స్ల‌మ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో మురికివాడ‌గా ఉన్న పిల్లిగుడిసెలు బ‌స్తీలో ఇప్పుడు డ‌బుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి.. …

    Read More »
  • 27 August

    చరణ్ మూవీలో జయరామ్

    క్రియేటివ్ జీనియస్ శంకర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రకి ఎంపికైనట్టు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలు చేస్తున్న చరణ్, తన 15వ సినిమాగా శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. క్రేజీ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ సరసన నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించబోతున్నాడు. శ్రీ …

    Read More »
  • 27 August

    అనసూయ నక్క తోక తొక్కిందా..?

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. ఇటీవలే టైటిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘లూసీఫర్’ మూవీకి అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతోంది. ఒరిజినల్ వెర్షన్‌లో మంజు వారియర్ పోషించిన పాత్ర ఇక్కడ అనసూయకి దక్కిందని నెట్టింట వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌ను …

    Read More »
  • 27 August

    సుప్రీంకోర్టుకు కొత్తగా న్యాయమూర్తులు

    ఎనిమిది మంది హైకోర్డు జడ్జిలు, సీనియర్‌ అడ్వకేట్‌ పీఎస్‌ నరసింహను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ గురువారం ఆమోదం తెలిపారు. కొత్తగా నియమితులైన సుప్రీంకోర్టు జడ్జిల్లో ముగ్గురు మహిళలు.. జస్టిస్‌ బీవీ నాగరత్న, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బేలా ఎం త్రివేది ఉన్నారు. తాజా నియామకాలతో సుప్రీంకోర్టులో ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టే …

    Read More »
  • 27 August

     దేశంలో కొత్తగా 44,658 క‌రోనా కేసలు

     దేశ‌వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 44,658 క‌రోనా పాజిటివ్ ( Corona Positive ) కేసులు కొత్త‌గా న‌మోదు అయ్యాయి. మ‌రో వైపు క‌రోనా వ‌ల్ల 496 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. వైర‌స్ సంక్ర‌మించిన వారిలో సుమారు 32 వేల మంది నిన్న కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,36,861గా ఉంది. అయితే 24 గంట‌ల్లో ఎక్కువ సంఖ్య‌లో …

    Read More »
  • 27 August

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంచలన ప్రకటన

    కాబూల్‌ విమానాశ్రయంలో పేలుళ్లకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు. ఉగ్రమూకలను వేటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు. ఐఎస్‌ఐఎస్‌ నాయకులను హతమార్చాలని అమెరికన్‌ ఆర్మీని ఆదేశించారు. ‘కాబుల్ ఎయిర్‌పోర్టులో జరిగిన పేలుళ్లలో మృతిచెందిన అమెరికా సైనికులు హీరోలు. ఈ ఘటనకు కారకులైన వారిని …

    Read More »
  • 27 August

    ఏడేండ్లలో పెట్టుబడులు 21,507 కోట్లు

    పరిశ్రమల ఏర్పాటుకు వెనువెంటనే అనుమతులిచ్చేందుకు తీసుకొచ్చిన టీఎస్‌ ఐ-పాస్‌.. కరెంటు కోత అన్న పదమే వినపడకుండా పరిశ్రమలకూ 24 గంటలు సరఫరా.. ఇలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పారిశ్రామికరంగానికి నవశకం మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాకు ఇండస్ట్రియల్‌ పార్కులు, హార్డ్‌వేర్‌ పార్కులు, ఐటీ టవర్లు, మెగా ఉత్పత్తి పరిశ్రమలు తరలివచ్చాయి. దేశంలోనే ప్రముఖ పరిశ్రమలు వెల్‌స్పన్‌, క్రోనస్‌, టాటా, విజయ్‌నేహా, …

    Read More »
  • 27 August

    హుజూరాబాద్ లో దళితబంధు పథకం యూనిట్ల పంపిణీ ప్రారంభం

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం యూనిట్ల పంపిణీ ప్రారంభమైంది. దళితబంధు ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారుల్లో నలుగురికి గురువారం ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో యూనిట్లను అందించారు. ఈ నలుగురిలో ఇద్దరు ట్రాక్టర్లు, ఒకరు ట్రాన్స్‌పోర్టు, మరొకరు ట్రావెల్‌ వాహనాన్ని ఎంపిక చేసుకొన్నారు. …

    Read More »
  • 27 August

    తెలంగాణ బీజేపీలో వర్గపోరు

    పేరుగొప్ప జాతీయ పార్టీ బీజేపీ.. రాష్ట్రంలో ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటల్లో చిక్కుకొన్నది. ఆధిపత్యపోరు రోజు రోజుకూ ముదిరి పాకాన పడటంతో ముగ్గురు నేతలు.. ఆరు గ్రూపులు అన్నట్టుగా మారింది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మాట అటుంచితే కనీసం పార్టీలో ఏ గ్రూపునకు మరే గ్రూపు ప్రత్యామ్నాయం అవుతుందో తేల్చుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల నేతృత్వంలోని గ్రూపులే ఎత్తుకుపై ఎత్తులతో రసకాందయంలో …

    Read More »
  • 26 August

    అక్టోబర్‌ 10న “మా” ఎన్నికలు

    ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ ఎన్నికలు అక్టోబర్‌ 10న నిర్వహించనున్నట్టు ప్రస్తుత అధ్యక్షుడు వీకే నరేశ్‌ ప్రకటించారు. ఇటీవల ‘మా’ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల విషయంలో క్రమశిక్షణ సంఘం (డీఆర్సీ) ఎలా చెబితే అలా చేస్తామని ఆయన తెలిపారు. వారంలో ఎన్నికల తేదీ ప్రకటిస్తామని డీఆర్సీ ఛైర్మన్‌ కృష్ణంరాజు అప్పుడు చెప్పారు. తాజాగా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించమని… సెప్టెంబర్‌ 12 లేదా అక్టోబర్‌ 10 – నెలలో రెండో ఆదివారం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat