తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా కేశవరావు, పేదలకు అందించిన న్యాయ సేవలను సీఎం స్మరించుకున్నారు. కేశవరావు కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించాలని, సీఎస్ సోమేశ్ కుమార్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
Read More »TimeLine Layout
August, 2021
-
9 August
రతన్టాటాను రాష్ట్రపతి చేయాలి
మెగా బ్రదర్ నాగబాబు తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక అంశం మీద మాట్లాడుతుంటారు. తాజాగా దేశ రాష్ట్రపతి అంశంపై స్పందించారు. ‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలి’ అంటూ రతన్ టాటా పేరు సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. …
Read More » -
9 August
చేర్యాలలో రూ. కోటి 25 లక్షలతో బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనo
సిద్దిపేట జిల్లా చేర్యాలలో రూ. కోటి 25 లక్షలతో అన్ని హంగులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనo నిర్మిస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇవాళ అంబేద్కర్ కమ్యూనిటీ భవనానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు …
Read More » -
9 August
మహేష్ బాబుకు శుభాకాంక్షలు వెల్లువ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెలువెత్తుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే కాక రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారు కూడా విషెస్ అందిస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మహేష్ బాబుకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా సందర్భాలలో వారిద్దరు స్నేహ భావంతో మెలగడం మనం చూశాం. తాజాగా కేటీఆర్.. మహేష్కి విషెస్ …
Read More » -
9 August
దళితులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణ లో హుజురాబాద్ నియోజకవర్గంలోని దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా దళితులను వ్యాపారులుగా మార్చేందుకు దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నారు ముఖ్యమంత్రి.ఈ క్రమంలో హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ. 500 కోట్లు విడుదల చేస్తూ …
Read More » -
9 August
అదిరిపోయిన మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ – మీరు చూసేయండి..?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. నేడు (ఆగస్ట్ 9) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ అభిమానులతో పాటూ యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇందులో ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా …
Read More » -
9 August
దేశంలో కొత్తగా 35,499 కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 35,499 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. తాజాగా 39,686 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్ కారణంగా 447 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 3,11,39,457 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 4,02,188 ఉన్నాయని పేర్కొంది.మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు దేశంలో 4,28,309 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. …
Read More » -
9 August
కుల వృత్తుల మనుగడకు సీఎం కేసీఆర్ పెద్దఎత్తున నిధులు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కుల వృత్తుల మనుగడకు సీఎం కేసీఆర్ పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీకి రూ.10 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని నర్సింగాయిపల్లి కాలనీలో గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పౌల్ట్రీఫాం మాదిరిగానే గొర్రెల పెంపకానికి ప్రోత్సాహకాలు అందించేలా …
Read More » -
9 August
బిగ్ బాస్ ఎంట్రీపై బ్యూటీ క్లారిటీ
ఒకప్పుడు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత ఫేడ్ ఔట్ అయిన వారికి బిగ్ బాస్ ఓ వరంగా మారుతుంది. ఈ షో ద్వారా మళ్లీ జనాలలో బాగా గుర్తింపు దక్కుతుంది. ఈ క్రమంలోనే అవకాశాలు రాక ఖాళీగా ఉన్న స్టార్స్ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో సీజన్ 5 కార్యక్రమం మరి కొద్ది రోజులలో మొదలు కానుండగా, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ …
Read More » -
9 August
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ కేశవరావు కన్నుమూత
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ కేశవరావు కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సంతాప సూచకంగా రాష్ట్రంలోని అన్ని కోర్టులకు హైకోర్టు సెలవు ప్రకటించింది. 2017 సెప్టెంబర్ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేశవరావు సేవలు అందించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జస్టిస్ కేశవరావు అంత్యక్రియలు జరగనున్నాయి.
Read More »