TimeLine Layout

May, 2021

  • 18 May

    టీఎస్ ఎంసెట్ గడువు పెంపు

    తెలంగాణలో ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్‌, వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్‌ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 18 వరకు గడువు ఉండగా.. దీనిని పొడిగిస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువులోపు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎంసెట్‌ కన్వీనర్‌, జేఎన్‌టీయూ రెక్టార్‌ ఆచార్య గోవర్ధన్‌ తెలిపారు. కాగా, సోమవారం …

    Read More »
  • 18 May

    కోహ్లీపై రష్మిక సంచలన వ్యాఖ్యలు

    తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ టీమ్ అభిమానినే అయినప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ కాదని కన్నడ భామ రష్మికా మందన్న తాజాగా వ్యాఖ్యానించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఐపీఎల్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతానని చెప్పింది. ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ను ఆర్‌సీబీ గెలుస్తుందనుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో లీగ్‌ వాయిదా పడటం తనను బాధించిందని చెప్పింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ నా ఫేవరెట్ టీమ్. …

    Read More »
  • 17 May

    భారత్ లో కొత్తగా 2,81,386 కరోనా కేసులు

    భారత్లో గడిచిన 24 గంటల్లో 2,81,386 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,49,65,463గా ఉంది. ఇక నిన్న 4106 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,74,390గా ఉంది. ప్రస్తుతం దేశంలో 35,16,997 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 3,78,741 మంది డిశ్చార్జ్ అయ్యారు.

    Read More »
  • 17 May

    కరోనా నియంత్రణలో తెలంగాణ టాప్

    కరోనా నియంత్రణ, మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ టాప్ లో నిలిచినట్లు 2 సంస్థలు చేసిన సర్వేలో తేలింది. కరోనా నియంత్రణలో తెలంగాణ, రాజస్థాన్, హర్యానా తొలి 3 స్థానాల్లో నిలిచాయి.. మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ, పంజాబ్, తమిళనాడు టాప్లో ఉన్నాయని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, మరో సంస్థ తెలిపాయి. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ పడకలు పెంచడం, RT-PCR ల్యాబ్ల ఏర్పాటులో తెలంగాణ కీలకంగా వ్యవహరించింది.

    Read More »
  • 17 May

    ఆసుపత్రిలో బీజేపీ నేత లక్ష్మణ్

    తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకొని ఐసోలేషన్లో ఉండాలని లక్ష్మణ్ సూచించారు.

    Read More »
  • 17 May

    కరోనా బాధితులకు అండగా రకుల్ ప్రీత్ సింగ్

    తనవంతు సాయంగా కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముందుకొచ్చింది. ఇప్పటికే కొంత సొమ్ము సమకూర్చిన రకుల్.. తన స్నేహితుల ద్వారా మరికొంత మొత్తాన్ని సేకరిస్తోంది. ఆ నిధులతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సమకూర్చేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

    Read More »
  • 17 May

    ఎంపీ రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

    ఏపీ అధికార పార్టీ అయిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. వైద్య పరీక్షల పర్యవేక్షణకు జ్యూడీషియల్ అధికారిని నియమించాలని సూచించింది. వైద్య పరీక్షలను వీడియో రికార్డింగ్ చేసి నివేదికలను సీల్డ్ కవర్లో ఇవ్వాలని పేర్కొంది. రఘురామ బెయిల్ పిటిషన్ను శుక్రవారానికి వాయిదా వేసింది.

    Read More »
  • 17 May

    COVID లక్షణాలు -నిర్ధారణ – విశ్లేషణ

    ■ COVID లక్షణాలు | నిర్ధారణ | విశ్లేషణ | ■ జ్వరం, దగ్గుతో ఉన్న ఓ వ్యక్తి(40) కరోనా నిర్ధారణ కోసం *ఆర్ టీ-పీసీఆర్* (రివర్స్ ట్రాన్స్ క్రిప్షన్ పొలిమెరేజ్ చైన్ రియాక్షన్ ) పరీక్ష చేయించుకోగా ఫలితాల్లో నెగెటివ్ వచ్చింది. > లక్షణాలు అలాగే ఉండడంతో వైద్యుని సలహా మేరకు కొవిడ్ చికిత్సనే ఇంటి వద్ద పొందాడు. > 10 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోగా, మరింతగా …

    Read More »
  • 17 May

    చంద్రబాబు వెన్నుపోటుకు బలైన ‘రాజు’

    నాటి నాదెండ్ల నుంచి ఎన్టీఆర్, దగ్గుబాటి, జయప్రద, లక్ష్మీపార్వతి, రేణుకాచౌదరి నుంచి నిన్నటి మోత్కుపల్లి నరసింహులు, రేవంత్ రెడ్డి లాంటి వందలాదిమంది చంద్రబాబు కుటిల రాజకీయాలను నమ్మి ఆయన వలలో చిక్కుకుని సర్వనాశనం అయిపోయారు. ఆ తరువాతిరోజుల్లో వారంతా చంద్రబాబు సర్వనాశనమైపోవాలని, పురుగులుపడిపోవాలని బహిరంగంగా దూషించినవారే. మమతా, స్టాలిన్, దేవెగౌడ, కేజ్రీవాల్, కేసీఆర్, లాలూ ప్రసాద్, రాహుల్ గాంధీ, కుమారస్వామి లాంటి నాయకులు అందరూ చంద్రబాబును ఛీ కొట్టినవారే. చివరకు …

    Read More »
  • 17 May

    ఈటెల ను నమ్ముకున్న వాళ్ళ … రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరమేనా..?

    ఈటెల ను నమ్ముకున్న వాళ్ళ … రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరమే !! రాజకీయంగా ముందు చూపు లేని వాళ్ళే అలాంటి వాళ్ళ వెంట వెళతారు అసలు కేసీఆర్ కు దూరం కావడమే ఈటెల దురదృష్టం అంటున్న రాజకీయ విశ్లేషకులు కనీసం మరో పదేళ్ళపాటు టి ఆర్ ఎస్ కు తిరుగులేదనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్న మెజార్టీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ , బీజేపీ కానీ కొత్త పార్టీలు కానీ టి ఆర్ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat