తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ టీమ్ అభిమానినే అయినప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ కాదని కన్నడ భామ రష్మికా మందన్న తాజాగా వ్యాఖ్యానించింది.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఐపీఎల్ను రెగ్యులర్గా ఫాలో అవుతానని చెప్పింది. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ను ఆర్సీబీ గెలుస్తుందనుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో లీగ్ వాయిదా పడటం తనను బాధించిందని చెప్పింది.
ఐపీఎల్లో ఆర్సీబీ నా ఫేవరెట్ టీమ్. అయితే విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ క్రికెటర్ కాదు. టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీకి నేను వీరాభిమానిని.
ధోనీ బ్యాటింగ్, వికెట్ కీపింగ్, కెప్టెన్సీ నాకు చాలా ఇష్టం. అతనో మాస్టర్ క్లాస్ ప్లేయర్. క్రికెట్లో ధోనీ నా ఆల్టైమ్ హీరో` అని రష్మిక చెప్పుకొచ్చింది.