తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దురదృష్టవశాత్తు తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అయితే తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు అని స్పష్టం చేశారు. వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. ఒక వేళ బయటకు వెళ్లాలనుకుంటే …
Read More »TimeLine Layout
April, 2021
-
22 April
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిరు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.అగ్ర హీరో .. మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగా వేగం పెంచుతున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సెట్స్ పై ఉండగానే మరో మూడు చిత్రాలను అంగీకరించారు. చిరంజీవి. తాజాగా ఆయన వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ‘మహర్షి’ సినిమాతో దర్శకుడు వంశీ పైడిపల్లి విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నారు. ఇటీవలే చిరంజీవిని కలిసిన వంశీపైడిపల్లి ఓ కథను వినిపించగా, సామాజిక ఇతివృత్తంతో కూడిన …
Read More » -
22 April
కరోనా నుంచి కోలుకున్న వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవచ్చా..?
ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెల్సిందే. అయితే కరోనా నుంచి కోలుకున్న వారు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. పాజిటివ్ వచ్చి కోలుకున్న అనంతరం 90 రోజుల వరకు టీకా అవసరం లేదు. ఆ తర్వాత వేయించుకోవాలని WHO, అమెరికా CDCA సూచించాయి. కరోనా నుంచి కోలుకోగానే యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, 3 నెలల వరకు మళ్లీ వైరస్ వచ్చే అవకాశం తక్కువేనని …
Read More » -
22 April
ఉదయం మజ్జిగ తాగితే..?
ప్రస్తుతం ఉన్నభగభగ మండే ఎండల్లోనే కాదు ఉదయం పూటా మజ్జిగ తాగినా చాలా లాభాలుంటాయి. 1. కెలొరీలు, కొవ్వు శాతం తక్కువ కాబట్టి బరువు తగ్గవచ్చు. 2. కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది. పటిక బెల్లంతో కలిసి తాగితే పైత్యం తగ్గుతుంది. 3. పేగుల్లోని హానికర బ్యాక్టీరియా చచ్చిపోతుంది. మలబద్ధకం, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. 4. హైబీపీ ఉన్నవారు ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే బీపీ కంట్రోల్ …
Read More » -
22 April
2013 తర్వాత తొలిసారిగా ఎంఎస్ ధోని
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. సునీల్ నరైన్ బౌలింగ్ బౌండరీ కొట్టడం ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్ లో ధోనీ చివరిసారిగా 2013లో సరైన్ బౌలింగ్లో ఒక ఫోర్ కొట్టాడు. అప్పటి నుంచి 64 బంతులు ఎదుర్కొన్నప్పటికీ బౌండరీ బాదలేకపోయాడు. నిన్న 65వ బంతికి ఫోర్ కొట్టాడు. అది కూడా ఫ్రీ హిట్లో, ముందరికి కొడితే బాల్ వెనకవైపు వెళ్లి, బౌండరీ లైన్ దాటింది. ఇప్పటి వరకు ఒక్క …
Read More » -
22 April
ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై విజయం
బుధవారం కేకేఆర్ తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై విజయం సాధించింది. 221 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్ ఆటగాళ్లు చెన్నై బౌలర్లను భయపెట్టారు. కానీ 202 పరుగులకు ఆలౌటైంది. చెన్నై 18 రన్స్ తేడాతో గెలిచింది. కార్తీక్ (40), రస్సెల్ (54), కమిన్స్ (66) భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. అంతకుముందు గైక్వాడ్ (64), డుప్లెసిస్ (95*) రాణించడంతో చెన్నై 220/3 రన్స్ చేసింది. చాహర్ 4, ఎంగిడి 3, …
Read More » -
22 April
ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఉంది..తెలుసా..?
టీమిండియా మాజీ కెప్టెన్,స్టార్ క్రికెటర్ ధోనీ కూడా ఓ సెంటిమెంట్ ఫాలో అవుతాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మహీ.. ఏ సభ్యుడికి ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అని చెప్పడు. ఒకసారి ఇలా చెప్పగా ఆ గేమ్లో ప్రతికూల ఫలితం రావడం జరిగింది.. దీంతో అప్పట్నుంచి అభినందించడం ఆపేశాడట. అందుకే మ్యాచ్కు ముందు ఎవరి నుంచి ఆ పదాలు కోరుకోడని మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా చెప్పాడు. క్రికెట్ …
Read More » -
22 April
సీపీఎం నేత సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం
సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం నెలకొంది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుముూశారు. 34 ఏళ్ల వయసున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మొదట హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో ఆశిష్ ఏచూరికి చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో గురుగ్రామ్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆశిష్కు వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం …
Read More » -
22 April
దేశంలో కరోనా మహాప్రళయం
దేశంలో కరోనా మహాప్రళయంగా మారుతోంది. కొత్త కేసుల సంఖ్య భయపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3లక్షల 15వేల కేసులు వచ్చాయి. ప్రపంచంలో ఎక్కడా.. ఒక్క రోజు కేసులు ఇంత ఎక్కువగా నమోదు కాలేదు. రోజువారి మరణాలు2102చేరాయి. 24గంటల్లో అత్యధిక కేసులు నమోదు చేసింది దేశంగా నిలిచింది భారత్. రోజువారీ కేసుల్లో అమెరికాను దాటేసింది. కేవలం 17 రోజుల్లోనే రోజువారి కేసులు లక్ష నుంచి 3 లక్షలకు చేరాయి.
Read More » -
22 April
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కల్లోలం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో మరో 989 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు 93,450 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
Read More »