TimeLine Layout

April, 2021

  • 19 April

    ఢిల్లీలో 7రోజులు లాక్‌డౌన్

    దేశరాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈరోజు నుంచి వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ లాక్‌డౌన్ ఈ రోజు(సోమవారం) రాత్రి 10 గంటల నుంచి వచ్చే సోమవారం అంటే ఏప్రిల్ 26 ఉదయం 6 గంటల వరకూ కొనసాగనుంది. కరోనా చైన్ తెగ్గొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఢిల్లీ సర్కారు వెల్లడించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఈరోజు ఉదయం …

    Read More »
  • 19 April

    క‌రోనా వాక్సిన్ తీసుకున్న‌ మంత్రి గంగుల క‌మలాక‌ర్

    కరీంనగర్ ఆర్టీసీ వర్క్ షాప్ ఆస్పత్రిలోని వాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు… వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మొదటి డోస్ టీకా తీసుకున్నారు..కరోనా వాక్సినేషన్ పట్ల ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.ఈ సంద‌ర్భంగా అక్క‌డి సిబ్బందితో ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీకా కేంద్రంలో ఉన్న స‌దుపాయాలు, టీకా స‌ర‌ఫ‌రాల‌పై అధికారుల‌తో చ‌ర్చించి నిరంత‌రం …

    Read More »
  • 19 April

    ఇల్లంత‌కుంట‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాలకిష‌న్‌, న్యాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావుతో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆ తర్వాత వివేకానంద విగ్రహం దగ్గర సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం, బస్టాండ్‌ వద్ద మహిళా సంఘ …

    Read More »
  • 18 April

    ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదు : మంత్రి ఈటల

    కరోనా రోగులకు చికిత్సనందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆదివారం బీఆర్‌కే భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.కరోనా తగ్గిందనుకున్న సమయంలో రెండో వేవ్‌ మొదలైందని అన్నారు. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ బారినపడిన వారిలో 5 శాతం మందిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘45 సంవత్సరాలు నిండిన …

    Read More »
  • 18 April

    అల్లు అర్జున్ పై దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు

    తెలుగు సినిమా ఇండస్ట్రీకు చెందిన స్టైల్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబోలో తెరకెక్కనున్న మూవీ ‘ఐకాన్’. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తవగా, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాత దిల్రాజు వెల్లడించాడు. తమ బ్యానర్లోని తర్వాతి చిత్రం ‘ఐకాన్’ అని ఆయన స్పష్టం చేశాడు. ‘పుష్ప’ టీజర్ చివర్లో బన్నీ పేరు ముందు.. ‘స్టైలిష్ స్టార్’ బదులు ‘ఐకాన్ స్టార్’ అని వేయడం తనకు తెలియదని, …

    Read More »
  • 18 April

    సరికొత్త పాత్రలో పూజా హెగ్దే

    యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో పూజా ఓ మెడికల్ స్టూడెంట్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలా పూజా దగ్గరకు విక్రమ్ (ప్రభాస్) ఓ ప్రమాదం వల్ల వైద్యానికి వస్తాడని.. అక్కడ్నుంచి వీరి మధ్య ప్రేమ చిగురిస్తుందని వార్తలొస్తున్నాయి. అటు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

    Read More »
  • 18 April

    మహారాష్ట్రలో కరోనా విజృంభణ

    మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఒక్కరోజే 67,123 కరోనా కేసులు, 419 మరణాలు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. ఇవాళ 56,783 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 6,47,933 యాక్టివ్ కేసులున్నాయని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కాగా కరోనాతో మహారాష్ట్రలో ఇప్పటివరకు 59,970 మరణాలు సంభవించాయి.

    Read More »
  • 18 April

    తెలంగాణలో నేడు వ్యాక్సినేషన్ బంద్

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు వ్యాక్సినేషన్ నిలిపివేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. సోమవారం నుంచి యథాతథంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సినేషన్ నిల్వలు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండగా.. ప్రజలెవరూ వ్యాక్సినేషన్ కేంద్రాలకు రేపు రావొద్దని ప్రభుత్వం సూచించింది.

    Read More »
  • 18 April

    వైసీపీ మాజీ మంత్రి మహమ్మద్ జానీ మృతి

    ఏపీ అధికార వైసీపీకి చెందిన మాజీ మంత్రి మహమ్మద్ జానీ ఇవాళ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. స్వగృహంలోనే చనిపోయారు. ఆయన స్వస్థలం గుంటూరు. ఇక్కడి నుంచే పలుమార్లు పోటీచేసి నెగ్గిన ఆయన.. ఎమ్మెల్సీ, మండలి డిప్యూటీ ఛైర్మన్ గా పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రి వర్గాల్లో.. వాణిజ్య, చక్కెర శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు.

    Read More »
  • 18 April

    మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమం

    మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇటీవల కరోనా బారినపడిన ఆయన చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి రాష్ట్ర విభజన అనంతరం అధినేత చంద్రబాబుతో విభేదించారు. 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat