టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకొన్న సంగతి తెలిసిందే. పెళ్ళయినప్పటి నుంచి సినిమాలు తగ్గించి.. ప్రతీ వెకేషన్ను భర్తతో ఆస్వాదించింది. నిన్న (శనివారం) నూతన సంవత్సరాది సందర్భంగా.. కాజల్ అభిమానులకు, నెటిజెన్స్ కు గౌతమ్ ఒక హింటిచ్చాడు. కాజల్ అగర్వాల్ ఫోటో ను షేర్ చేస్తూ తాము 2022 సంవత్సరం గురించి ఎదురుచూస్తున్నామని వ్యాఖ్యని జతచేశాడు. కాజల్ గర్భిణీ అనేలా …
Read More »Pavan అభిమానులకు బ్యాడ్ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 7న విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కరోనా కొత్త వైరస్ ఒమైక్రాన్ విస్తృతి కారణంగా పోస్ట్పోన్ చేస్తున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని ముందు ప్రకటించిన జనవరి 12న రిలీజ్ చేస్తారనే టాక్ మొదలైంది. కానీ, ఇది నిజం కాదని తెలుస్తోంది. ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న సితార …
Read More »షణ్ముక్ జశ్వంత్, దీప్తి సునయనకి గుడ్ బై..?
బిగ్ బాస్ కంటెస్టెంట్లు షణ్ముక్ జశ్వంత్, దీప్తి సునయన విడిపోయారు. ఇద్దరు విడిపోతున్నట్లు ఇన్స్టాలో దీప్తి సునయన తెలిపింది. షణ్ముక్తో బ్రేకప్పై పోస్ట్ పెట్టిన ఆమె.. ‘ఇద్దరం ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. మా వ్యక్తిగత జీవితాల్లో ముందుకెళ్లాలి అనుకుంటున్నాం. ఐదేళ్లు ఎంతో సంతోషంగా ఉన్నాం. కలిసి ఉండటానికి ప్రయత్నించాం. ఇద్దరి దారులు వేరని తెలుసుకున్నాం. ఇది మాకెంతో క్లిష్ట సమయం’ అని చెప్పింది
Read More »Bollywood ఎంట్రీపై సాయిపల్లవి క్లారిటీ
తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి. తాజాగా శ్యామ్ సింగరాయ్ మూవీలో దేవదాసి పాత్రలో నటించి మెప్పించిన ఆమె.. బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన సాయిపల్లవి.. ‘బాలీవుడ్ లో నటించేందుకు సిద్ధంగా ఉన్నా. అయితేస్క్రిప్ట్ ఎంతో ముఖ్యం. ఇప్పటికిప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెట్టలేను. మంచి కథ, పాత్ర ఎంతో అవసరం’ అని చెప్పింది.
Read More »ఏపీ ప్రభుత్వాన్ని కరోనాతో పోల్చిన ఆర్జీవీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కరోనాకు పెద్దగా తేడా లేదని డైరెక్టర్ RGV సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ఆయన మాట్లాడుతూ.. ‘థియేటర్లు, టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దీనిపై సినీ పెద్దలు మాట్లాడకపోవడంలో వింతేమీ లేదు. అసలు వారు మాట్లాడాల్సిన పని లేదు. ఇండస్ట్రీ పెద్దలంటే బాగా సెటిల్ అయినవారు. అలాంటి వారు ప్రభుత్వంతో గొడవ ఎందుకు పెట్టుకుంటారు, కావ్గా ఉంటారు’ అని చెప్పాడు.
Read More »‘పుష్ప’ టీమ్ కు సుకుమార్ బంపర్ ఆఫర్
ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన ‘పుష్ప’ సినిమా కోసం పని చేసిన కిందిస్థాయి సిబ్బందికి డైరెక్టర్ సుకుమార్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. టెక్నీషియన్స్, సెట్ బాయ్స్ పాటు సినిమా కోసం పనిచేసిన సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున గిఫ్ట్ ఇస్తానని ప్రకటించాడు. మూవీ షూటింగ్ సమయంలో వారందరూ అడవుల్లో ఎంతో కష్టపడ్డారని సుకుమార్ చెప్పుకొచ్చాడు. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా మంచి హిట్ సాధించింది.
Read More »కీర్తి సురేష్ భర్తగా నాగ శౌర్య
అన్నాత్తే మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ చెల్లెలిగా నటించి ప్రశంసలందుకున్న క్యూట్ హీరోయిన్ కీర్తి సురేశ్.. భోళాశంకర్లోనూ మెగాస్టార్ చిరంజీవికి సిస్టర్గా చేయనున్నట్లు తెలిసిందే. అయితే ఈ సినిమాలో కీర్తికి భర్తగా యంగ్ హీరో నాగశౌర్య నటించనున్నాడని టాలీవుడ్ టాక్ నడుస్తోంది. మూవీకి మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తుండగా.. తమిళంలో వచ్చిన వేదాళం సినిమాను తెలుగులో భోళాశంకర్గా రీమేక్ చేస్తున్నారు.
Read More »టికెట్ ధరల వ్యవహారంపై మంచు విష్ణు మౌనం ఎందుకు..?
ఏపీలో సినిమా టికెట్ ధరల వ్యవహారం రచ్చ లేపుతున్నా.. ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించకపోవడం చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఇప్పటికే పలువురు హీరోలు, డైరెక్టర్లు ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. అయితే విష్ణు ఇంతవరకు నోరు విప్పలేదు. కనీసం ట్వీట్ కూడా చేయకపోవడం గమనార్హం. సీఎం జగన్ బంధుత్వం వల్లే విష్ణు సైలెంట్ గా ఉంటున్నారని కొందరు వాదిస్తున్నారు.
Read More »Tollywood హీరో మంచు మనోజ్ కు కరోనా
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మంచు మనోజ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో తెలిపాడు. “నాకు కరోనా నిర్ధారణ అయ్యింది. నన్ను గత వారం నుంచి కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోండి. జాగ్రత్తలు తీసుకోండి. నా గురించి ఆందోళన చెందవద్దు. క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాతోనే ఉన్నాయి” అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.
Read More »Junior NTR సరసన సమంత
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలో హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్కు వెళ్లనుంది. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన సమంతను ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల ‘జనతా గ్యారేజ్ లో సామ్ హీరోయిన్ గా నటించడంతో మరోసారి ఎన్టీఆర్ …
Read More »