తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రైస్ మిల్లర్లకు ఇకపై ఎలాంటి అధికారుల వేధింపులు ఉండవని భరోసానిచ్చారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరిన్నీ రైస్ మిల్లర్లను ఏర్పాటు చేయాలి.ఇందుకోసం పారిశ్రామికవాడల్లో స్థలాలు కేటాయిస్తాము. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లుగా రైస్ మిల్లర్లను గుర్తిస్తామని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో తెలిపారు.రాష్ట్రంలో నలబై లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములు నిర్మించాల్సినవసరం ఉందని సీఎం ప్రకటించారు.
Read More »నల్లగొండ జిల్లా ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త
నల్లగొండ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు.జిల్లాలోని నకిరేకల్లో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు .ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో నకిరేకల్ పట్టణానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. …
Read More »