హుజురాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన బిజెపి యూత్ నాయకులు చందు రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఆదివారం వీణవంక మండల కేంద్రంలో జరిగిన ధూం ధామ్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పటివరకు బీజేపీలో ఈటల రాజేందర్ కు మద్దతు గా యాక్టివ్ గా పనిచేసిన యూత్ నాయకులు చందు రెడ్డి శ్రీకాంత్ రెడ్డి.. టిఆర్ఎస్ నేత, హుజురాబాద్ మాజీ …
Read More »Huzurabad By Poll-బీజేపీకి షాక్
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటి చేస్తున్న పార్టీ అయిన బీజేపీ నుంచి అధికార పార్టీ టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు తాము తోడుంటామంటూ యువత గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈక్రమంలో జమ్మికుంట పట్టణ టీఆర్ఎస్ విద్యార్థి, యూత్ విభాగాలతో మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు …
Read More »Huzurabad By Poll-టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్ నియోజవర్గంలోని జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామ బీజేపీ వార్డు మెంబర్లు షాగర్ల మనీష కుమార్, షాగర్ల రజిత శ్రీనివాస్, కనిక జగభాయి నరేష్, కరట్లపెల్లి శ్రీనివాస్ మంత్రి హరీశ్రావు, జమ్మికుంట ఇన్చార్జి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమక్షంలో టీఆర్ఎస్ చేరారు. …
Read More »5వేల కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తా-గెల్లు శ్రీనివాస్యాదవ్
ఈటల నిర్లక్ష్య ధోరణివల్ల నియోజకవర్గంలో ఒక్క కుటుంబానికి కూడా డబుల్ బెడ్ రూం ఇల్లు రాలేదని, తనను గెలిపిస్తే సీఎం కేసీఆర్తో మాట్లాడి ఐదు వేల నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తానని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ తెలిపారు. కమలాపూర్ మండలం దేశరాజ్పల్లెలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, పేర్యాల రవీందర్రావుతో కలిసి శనివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో సరికొత్త విధానం..
తెలంగాణలో ప్రభుత్వ వైద్యారోగ్య వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడున్న మూడంచెల వైద్య వ్యవస్థ స్థానంలో ఐదంచెల వ్యవస్థను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. పల్లె దవాఖానలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానలు ఏర్పాటుచేస్తూ ప్రజలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామంలోనే నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యంతో ప్రమోటివ్ కేర్ను, జిల్లా పరిధిలోనే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేందుకు …
Read More »హూజూరాబాద్ By Elections-బుల్లెట్ బండెక్కి ప్రచారానికి వచ్చేత్తా..పా అంటూ దివ్యాంగుడు
హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో దివ్యాంగుడైన డి. మహేశ్ బుల్లెట్ బండెక్కి ప్రచారానికి వచ్చేత్తా..పా అంటూ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపుకోసం చేస్తున్న ఎన్నికల ప్రచారం పలువురిని ఆకర్శిస్తోంది. తన బుల్లెట్ బైక్కు ఫ్లెక్సీలు కట్టుకుని జనచైతన్యయాత్ర పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు చిత్రాలతో ఉన్న ప్లెక్సీలు బైక్కు మూడు వైపుల కట్టుకుని ఎక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే అక్కడికి …
Read More »హూజూరాబాద్ By Elections-కాంగ్రెస్,బీజేపీలకు షాక్
హూజూరాబాద్లో కారుజోరు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. బుధవారం వీణవంక మండలం లోని మల్లన్న పల్లి గ్రామానికి చెందిన 15 మంది, రెడ్డిపల్లి గ్రామానికి చెందిన 25 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గులాబీ కండువా కప్పి పార్టీలోకి …
Read More »అడ్డంగా దొరికిపోయిన ఈటల
అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. బీజేపీ నేతల్లో ఈటల రాజేందర్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వెలగబెట్టిన ప్రబుద్ధ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. గ్యాస్బండపై రూ.291 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వస్తున్నదంటూ నోటికొచ్చిన అబద్ధమాడుతున్నారు. ప్రచారం ఒక్కో గ్యాస్బండపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.291 పన్నువాటాగా వస్తున్నదని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ …
Read More »Huzurabad లో BJPకి ఎదురీత..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులపట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాగ్రహం పెల్లుబికుతున్నది. హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఓటు అడిగేందుకు బీజేపీ నాయకులు తమ ఇంటికి రావొద్దని ప్రజలు ఖరాఖండిగా చెబుతున్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణవాసులు తమ ఇంటి ముందు ‘ఓటు కోసం బీజేపీ నాయకులు రావొద్దు.. మా ఓట్లు టీఆర్ఎస్కే’ అని ఉన్న బోర్డులను ఏర్పాటుచేసుకొన్నారు. 27వ వార్డులో ప్రతీ ఇంటి ఎదుట గేట్లకు ఏర్పాటుచేసిన బోర్డులు బీజేపీపై వ్యతిరేకతకు పరాకాష్ఠగా …
Read More »ఈటలపై ఎమ్మెల్యే సుమన్ ఫైర్
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే తప్పులు బయటపడుతాయనే రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చారు. విభజన హామీలను తుంగలో తొక్కి బీజేపీ తెలంగాణను మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్ పథకాలతో పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి …
Read More »