తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించే ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ సర్కారు పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే పలు ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి కానుండగా.. మరోవైపు కొన్ని ప్రాజెక్టుల నిర్మాణాలకు భూములను సేకరించే పనిలో ఉంది సర్కారు. అందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయే నిర్వాసితులకు దేశంలో ఎక్కడ లేని విధంగా.. ఇంతవరకు ఏ సర్కారు ఇవ్వని రీతిలో పరిహారం ఇస్తుంది టీఆర్ఎస్ …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పోచంపల్లి..
తెలంగాణలో ఈ నెలలో జరగనున్న వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,స్థానిక మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ బాస్కర్ ,చల్ల దర్మారెడ్డి ,ఎంపీలు పసునూరి దయాకర్,రాజ్యసభ ఎంపి బండా ప్రకాశ్, వికాలంగుల కార్పొరేషన్ చైర్మన్ డా కే వాసుదేవా రెడ్డిలతో కలిసి నామినేషన్ ధాఖలు చేశారు. విలేకరులతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూఎన్నికలు …
Read More »ఎమ్మెల్సీగా పోచంపల్లి గెలుపు లాంచనమే..
‘స్థానిక’ సంస్థల వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి(వరికోలు) శ్రీనివాస్రెడ్డికే అవకాశం దక్కింది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ఆదివారం ప్రకటించిన కేసీఆర్.. వరంగల్కు శ్రీనివాస్రెడ్డి పేరును కూడా వెల్లడించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ‘పోచంపల్లి’ పేరే ప్రచారంలో …
Read More »తమిళనాడులో సీఎం కేసీఆర్ బిజీ..బిజీ..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో సమావేశమయ్యారు. చెన్నైలోని అళ్వార్పేటలోని స్టాలిన్ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్ను స్టాలిన్ సాధరంగా ఆహ్వానించారు. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్బాలు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చురుకుగా అడుగులు వేస్తున్నారు. ఫెడరల్ఫ్రంట్ ఏర్పాటులో ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు రాష్ర్టాల పర్యటనలు చేపడుతున్నారు. …
Read More »శ్రీరంగనాథస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు తమిళనాడు పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా ప్రత్యేక విమానంలో ఎంపీలు వినోద్కుమార్, కేశవరావు, సంతోష్కుమార్తో కలిసి సీఎం కేసీఆర్ చెన్నైకి చేరుకున్నారు. ఈరోజు సోమవారం ఉదయం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read More »అనారోగ్యంతో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మృతి..!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందారు. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన సి.కనకారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి …
Read More »ఏకగ్రీవాల్లో టీఆర్ఎస్ హావా..!
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సమరం హడావుడి ఉన్న సంగతి విధితమే. అందులో భాగంగా ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు పోటిపడి మరి తొలివిడత ఎన్నికలకు తమ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. అయితే, తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2116ఎంపీటీసీలలో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి ఈ నెల ఆరో తారీఖున పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మొత్తం అరవై తొమ్మిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో …
Read More »టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని కలిసిన వరంగల్ నూతన మేయర్ గుండా ప్రకాష్
నూతనంగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికైన గుండా ప్రకాష్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మేయర్ గా ఎంపికైన ప్రకాష్ ని కేటీఆర్ అభినందించారు. నూతన మేయర్ తో పాటు జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, స్టేషన్గన్పూర్ …
Read More »ఢిల్లీలో ప్రభుత్వంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చేలా టీఆర్ఎస్ పార్టీ నడుచుకుంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలో ఏ రాజకీయ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాదని, సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని కేంద్ర పన్నుల్లో వాటా, అధికార వికేంద్రీకరణ ఫెడరల్ఫ్రంట్ ప్రధాన అంశాలుగా ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆస్క్ కేటీఆర్ హ్యాష్ట్యాగ్తో …
Read More »71ఏళ్ల చరిత్రలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చినా గట్టిగా నిలబడింది టీఆర్ఎస్ పార్టీ మాత్రమే
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ సైనికులందరికీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో కేటీఆర్ టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సైనికులుగా పని చేసిన తెలంగాణవాదులందరికీ శుభాకాంక్షలు. 71 ఏండ్ల చరిత్రలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయి. కానీ గట్టిగా నిలబడ్డ పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. 2001లో కేసీఆర్ ఒంటరిగా ఉద్యమం మొదలు పెట్టారని, త్యాగాల పునాదుల మీదనే …
Read More »