దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. హాట్స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందని ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో సాధారణ మార్గదర్శకాలు, అనుమతులు పనిచేయవని, నిత్యావసరాల పంపిణీ మినహా ఎలాంటి కార్యకలాపాలు ఉండవని తెలిపింది. మే 3 వరకు అన్ని విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైల్ సర్వీసులు రద్దు చేస్తున్నామని వెల్లడించింది. విద్యాసంస్థలు, …
Read More »రాష్ర్టాలు 30 వరకే.. కానీ కేంద్రం లాక్డౌన్ 3 రోజులు ఎందుకు పొడిగించిందంటే?
కరోనా వైరస్ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అన్ని రాష్ర్టాలు పకడ్బందీ చర్యలు తీసుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ పొడిగించకపోతే కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని ఆయా రాష్ర్టాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించాయి. కరోనా పరిస్థితులు, లాక్డౌన్ పొడిగింపు వంటి అంశాలపై చర్చించేందుకు రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ రాష్ర్టాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం విదితమే. ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ …
Read More »కోవిడ్-19పై విజయం సాధించేందుకు మోదీ చెప్పిన ఏడు సూత్రాలు
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19)పై విజయం సాధించేందుకు ప్రతి భారతీయుడు పాటించాల్సిన ఏడు ముఖ్యమైన సూత్రాలను ప్రధాని మోదీ సూచించారు. మంగళవారం జాతిని ఉధ్దేశించి చేసిన ప్రసంగంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందకు విధించిన లాక్డౌన్ను మే 3వ తేదీ వరకూ పొడిస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం ప్రజలు పాటిస్తున్న నిబంధనలు అన్ని అప్పటివరకూ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అయితే తన ప్రసంగాన్ని ముగించే ముందు ప్రతీ భారతీయుడు పాటించాల్సిన …
Read More »మే 3వరకు లాక్ డౌన్ పొడిగింపు
కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం తొలుత ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ గడువు ఇవాల్టితో పూర్తవుతుంది. ఈ లాక్ డౌన్ను లాక్డౌన్ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
Read More »లాక్ డౌన్ నిబంధనలను ఉల్లఘించిన బీజేపీ ఎమ్మెల్యే
కరోనా వైరస్ నియంత్రణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. ఈ వైరస్ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. కానీ లాక్డౌన్ నిబంధనలు ప్రజాప్రతినిధులే ఉల్లంఘిస్తున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకులే తప్పటడుగు వేస్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే.. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తుముకూరు జిల్లాలోని టురువేకెరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎం జయరాం లాక్డౌన్ …
Read More »ఏడాదికి 10 రోజులు ప్రపంచమంతా లాక్డౌన్ చేద్దాం
ప్రపంచంలో అనేకదేశాల్లో ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండటంతో వాతావరణ కాలుష్యం, భూతాపంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ప్రపంచమంతా ఒప్పుకొంటే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏడాదికి కనీసం పదిరోజులపాటు పరిమితస్థాయిలో లాక్డౌన్ ప్రకటిస్తే బాగుంటుందని వినూత్న ప్రతిపాదన చేశారు. కరోనా వ్యాప్తిని కట్టడిచేసేందుకు లాక్డౌన్ను మరికొంతకాలం కొనసాగించాలన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని, అయితే దీనిపై సమిష్టిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. కరోనా మహమ్మారి …
Read More »కరోనాను నిర్మూలించేందుకు లాక్డౌన్ను గౌరవించాలి
కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రజలందరూ ఇండ్లలోనే ఉండి సహకరించాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. బుధవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ పట్టణంలో, బాల్కొండ మండల కేంద్రంలో కరోనా నేపథ్యంలో ఏర్పాటుచేసిన కంటైన్మెంట్ క్లస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలందరూ లాక్డౌన్ను గౌరవించి.. కరోనాను నిర్మూలించేందుకు లాక్డౌన్ను గౌరవించాలని కోరారు. ప్రజలు ఇండ్లలోంచి బయటకు రాకుండా …
Read More »లాక్డౌన్ రూల్స్ను కఠినంగా అమలు చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. లాక్డౌన్ రూల్స్ను కఠినంగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ పిలుపునిచ్చారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆటోలను, క్యాబ్లను, ప్రయివేటు వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. లాక్డౌన్ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్డౌన్ను అమలు చేయడం వల్ల కరోనాను నియంత్రించొచ్చు అని …
Read More »