Home / Tag Archives: minister of telangana (page 65)

Tag Archives: minister of telangana

మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న మంత్రి తలసాని

మేడారం సమ్మక్క, సారలమ్మలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తులాభారం వేసి అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మేడారం జాతర కుంభమేళాను తలపించేలా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. …

Read More »

భక్తరామదాసు తెలంగాణ గర్వించదగిన వాగ్గేయ కారుడు

తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన ఉన్నప్రముఖ వాగ్గేయకారుడు, శ్రీరామభక్తుడు, భద్రాచల రామదాసు విగ్రహం వద్ద వారి 389 వ జయంతి ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి డా. …

Read More »

మేడారం మహాజాతరకు పకడ్బందీ ఏర్పాట్లు

మేడారం మహాజాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ చెప్పారు.వచ్చేనెల 16 నుంచి 19 వరకు జరిగే జాతరలో అమ్మవార్లను దర్శించుకోవటానికి వచ్చే వీఐపీ, వీవీఐపీలకు ఇచ్చే పాస్‌ (సాట్ల)లలో వారు దర్శించుకొనే తేదీ,సమయం కచ్చితంగా ఉండేలా ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు.తద్వారా సాధారణ భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బంది కలుగదని వెల్లడించారు. సమ్మక్క-సారలమ్మలు గద్దెల మీద కొలువైన రోజే సీఎం కేసీఆర్‌ దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారని ఆమె …

Read More »

మంత్రి ఎర్రబెల్లి కి కరోనా

తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఢిల్లీలో వారం రోజులు పర్యటించి, నిన్న రాత్రి  హైదరాబాద్ మహానగరానికి వచ్చిన మంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రోనా చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కంగుతినడం ఖాయం

ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ కంగుతినడం ఖాయమని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. కనీసం బీఫారం కూడా ఇవ్వకుండా అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్‌ కుటిల రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. ఎక్స్ అఫీషియో సభ్యులు హోదాలో సూర్యాపేటలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధిస్తారని …

Read More »

సిద్దిపేటలో ఓటు వేసిన మంత్రి హారీష్ రావు

ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి హరీశ్‌ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటిసారిగా ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎక్స్‌అఫీషియో హోదాలో ఓటు హక్కు కల్పించారని చెప్పారు. ప్రజాప్రతినిథులు మాత్రమే ఓటర్లు కావడంతో 99 శాతం ఓట్లు నమోదవుతాయని తెలిపారు. …

Read More »

నిరుపేద విద్యార్థులకు ఎస్ ఫౌండేషన్ చేయూత

నిరుపేద విద్యార్థులపై ఎస్ ఫౌండేషన్ వారు మరోమారు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గుంటకండ్ల సునీతా జగదీష్ రెడ్డి. పెన్ పహడ్ మండలం లింగాల గ్రామనికి చెందిన దళిత నిరుపేద విద్యార్థులు, క్రీడాకారిణి రణపంగ గౌతమి, రణపంగు గాయత్రి లకు ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేసి.. ఇరువురి చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటామని భరోసా కలిపించారు. ఈ సందర్బంగా సోమవారం వారి …

Read More »

ఎంపీ సంతోష్ కుమార్ కి మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన శుభాకాంక్షలు

హరిత ప్రేమికుడు, మొక్కలంటే అమితమైన మక్కువ చూపే నేత, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించి ఖండంతారాలకు తెలంగాణ రాష్ట్ర కీర్తిని, పచ్చదనం గొప్పదనాన్ని చాటుతున్న రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశుసంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతిరాథోడ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులు వారు మరెన్నో జరుపుకోవాలని, ప్రజా క్షేమం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం …

Read More »

ఇది రైతు విజయం – మంత్రి KTR

నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ఇవాళ ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో.. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అధికారంలో ఉన్నవారి శ‌క్తి క‌న్నా.. ప్ర‌జాశ‌క్తియే ఎప్ప‌టికీ గొప్ప‌ద‌ని మంత్రి కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. రైతుల చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించ‌డంలో తెలంగాణ స‌ర్కార్ ముందున్న విష‌యం తెలిసిందే. కేంద్రం తెచ్చిన నూత‌న సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ తెలంగాణ ప్ర‌భుత్వం ఆందోళ‌న కూడా చేప‌ట్టింది. అయితే ట్విట్ట‌ర్ వేదిక …

Read More »

ఇది అన్నదాతలు సాధించిన విజయం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నూత‌న‌ సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా సాగిన ఉద్య‌మం ఫ‌లించిందని, ఇది అన్న‌దాత‌లు సాధించిన విజ‌యంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అభివ‌ర్ణించారు. ప్ర‌జాస్వామ్య ప‌ద్ధతిలో రైతులు చేసిన సుధీర్ఘ‌ పోరాటానికి కేంద్ర దిగిరాక త‌ప్ప‌లేద‌న్నారు. రైతుల‌కు మ‌ద్ధ‌తుగా… వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు వ్య‌తిరేఖంగా సీయం కేసీఆర్ చేప‌ట్టిన ఉద్య‌మ‌ సెగ ఢిల్లీకి త‌గిలింద‌ని తెలిపారు. సీయం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అన్న‌దాత‌లకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat