దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి మే 29 నాటికి తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సర్వే సంస్థ ‘ సీ ఓటర్’ ఓ సర్వేను నిర్వహించింది. ఆరేళ్ల కాలంలో అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో దూసుకుపోతున్న ప్రధాని మోదీకి దేశ వ్యాప్తంగా 65శాతం ప్రజలు మద్దతు లభించిందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం దూసుడైన నిర్ణయాలతో ప్రజల దృష్టిని మోదీ ఆకర్శించారని …
Read More »ప్రధాని మోదీ కంటే సీఎం కేసీఆర్ భేష్
లాక్డౌన్ మరో రెండు, మూడు వారాలు పొడిగించాలని రాష్ట్రంలోని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారిని పకడ్బందీగా ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని తెలంగాణ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. మే 7వ తేదీ తర్వాత తెలంగాణలో లాక్డౌన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో కరోనాను పూర్తిస్థాయిలో అంతం చేసేందుకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగించాలా? వద్దా? అని ప్రముఖ న్యూస్ ఛానల్ సర్వే నిర్వహించింది. ఏప్రిల్ 29 నుంచి …
Read More »మద్యం ప్రియులకు శుభవార్త
దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను మరో రెండు వారాల పాటు పొడిగించిన విషయం విదితమే. అయితే గ్రీన్ జోన్లలో మద్యం, పాన్ దుకాణాలను అనుమతి ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం, పాన్ షాపుల వద్ద 6 అడుగులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. దుకాణాల వద్ద ఒకేసారి ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ రెండో దఫా ఈ …
Read More »విద్యాసంస్థలకు కేంద్రం మార్గదర్శకాలు
లాక్డౌన్ తర్వాత తెరిచే పాఠశాలలు, కళాశాలలకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. పాఠశాలలు, కళాశాలలకు వేర్వేరు మార్గదర్శకాలు సిద్ధం చేస్తుంది కేంద్రం. కొత్త సీటింగ్ ఆరేంజ్మెంట్, షిఫ్ట్ల వారీ తరగతులు ఉండాలని కేంద్రం పేర్కొంది. గ్రంథాలయం, క్యాంటీన్లు, హాస్టళ్లల్లో సరికొత్త పద్ధతులు పాటించాలని వెల్లడించింది. కళాశాలలు, వర్సిటీల్లో కొత్త చేరేవారికి సెప్టెంబర్ నుంచి విద్యా సంవత్సరం మొదలు కానుంది. విద్యాలయాల్లో ఉదయం నిర్వహించే అసెంబ్లీతో పాటు క్రీడా కార్యక్రమాలను …
Read More »లాక్డౌన్-3కి ముందే కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాలు
డౌన్-3 నిర్ణయానికి ముందే కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కార్మికులను, యాత్రికులను, విద్యార్ధులను తరలించడానికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతినిచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు రైల్వే శాఖ సహకరిస్తుంది. నోడల్ అధికారులు రైల్వేకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంయోజకులుగా ఉంటారు. టికెట్ల విక్రయాలపై రైల్వే శాఖ మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. వలస కార్మికులు, విద్యార్ధుల తరలింపు సమయంలో నిబంధనలు …
Read More »యడ్డీ రికార్డును బద్దలు కొట్టిన చౌహాన్
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అరుదైన రికార్డును సంపాందించారు.ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఇరవై ఐదు రోజుల పాటు మంత్రి వర్గం ఏర్పాటు చేయని ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ పేరుగాంచారు. అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్డూరప్ప పేరు మీద ఈ రికార్డు ఉంది.యడ్డీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు రోజుల పాటు ఆయన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే వీరిద్దరూ ఫిరాయింపులదారుల సహాకారంతోనే …
Read More »లాక్ డౌన్ నుండి వీటికి మినహాయింపు
లాక్డౌన్ నుంచి మరికొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినహాయింపులకు అదనంగా ఇవి ఉంటాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగానికి చెందిన నిర్మాణ పనులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల కార్యకలాపాలకు తాజాగా అనుమతినిచ్చింది. కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, ప్రాసెసింగ్.. తదితరాలకు కూడా అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని …
Read More »లాక్డౌన్ మార్గదర్శకాలు విడుదల
దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. హాట్స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందని ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో సాధారణ మార్గదర్శకాలు, అనుమతులు పనిచేయవని, నిత్యావసరాల పంపిణీ మినహా ఎలాంటి కార్యకలాపాలు ఉండవని తెలిపింది. మే 3 వరకు అన్ని విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైల్ సర్వీసులు రద్దు చేస్తున్నామని వెల్లడించింది. విద్యాసంస్థలు, …
Read More »రాష్ర్టాలు 30 వరకే.. కానీ కేంద్రం లాక్డౌన్ 3 రోజులు ఎందుకు పొడిగించిందంటే?
కరోనా వైరస్ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అన్ని రాష్ర్టాలు పకడ్బందీ చర్యలు తీసుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ పొడిగించకపోతే కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని ఆయా రాష్ర్టాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగించాయి. కరోనా పరిస్థితులు, లాక్డౌన్ పొడిగింపు వంటి అంశాలపై చర్చించేందుకు రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ రాష్ర్టాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం విదితమే. ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ …
Read More »కోవిడ్-19పై విజయం సాధించేందుకు మోదీ చెప్పిన ఏడు సూత్రాలు
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19)పై విజయం సాధించేందుకు ప్రతి భారతీయుడు పాటించాల్సిన ఏడు ముఖ్యమైన సూత్రాలను ప్రధాని మోదీ సూచించారు. మంగళవారం జాతిని ఉధ్దేశించి చేసిన ప్రసంగంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందకు విధించిన లాక్డౌన్ను మే 3వ తేదీ వరకూ పొడిస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం ప్రజలు పాటిస్తున్న నిబంధనలు అన్ని అప్పటివరకూ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అయితే తన ప్రసంగాన్ని ముగించే ముందు ప్రతీ భారతీయుడు పాటించాల్సిన …
Read More »