తెలంగాణలో సింగరేణిలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే దాకా పోరాటం సాగుతుందని కార్మిక సంఘాలు వెల్లడించాయి.
Read More »సింగరేణి కార్మికులకు రూ.72, 500 బోనస్
దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ (పీఎల్ ఆర్) రూ.72, 500 చెల్లించేందుకు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు అంగీకరించాయి. ఈ మేరకు ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో యాజమాన్యాలు బోనస్పై చర్చించి పరస్పర అంగీకారానికి వచ్చాయి. గతేడాది బోనస్ రూ.68,500గా నిర్ణయించగా ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచారు.ఈ నిర్ణయంతో సింగరేణి వ్యాప్తంగా 43 వేల మంది కార్మికులకు లబ్ధి కలగనుంది.
Read More »ఐటీ వినియోగంలో సింగరేణి ముందంజ
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో విశ్వేశ్వరయ్య భవన్ లో మంగళవారం “మైనింగ్స్ లో ఐటీ వినియోగం – ముందడుగు సదస్సు జరిగింది. ఈ సదస్సులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ ఆర్ సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ” ఐటీ వినియోగంలో సింగరేణి దేశంలోనే అగ్రగామిగా ఉంది. అదే సమయంలో బొగ్గు ఉత్పత్తి ,టర్నోవర్ సాధించడంలోనూ ఆదర్శంగా నిలుస్తుంది అని అన్నారు.రాబోయే కాలంలో ఐటీ వినియోగాన్ని విస్తృత పరుస్తూ .. …
Read More »