రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గా ఎన్నికైన మొదటి సారి నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తెలిపారు. ఆనాడు అశోక చక్రవర్తి చెట్లు నాటితే ఈనాడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటించి దేశ వ్యాప్తంగా పచ్చని వణంలాగా …
Read More »నిలకడగా దాదా ఆరోగ్యం
యాంజీయోప్లాస్టీ చేయించుకున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని బుధవారం డిశ్చార్జ్ చేస్తామని ఉడ్ల్యాండ్ హాస్పిటల్ ఎండీ, సీఈవో డాక్టర్ రూపాలీ బసు తెలిపారు. 48 ఏళ్ల గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె చెప్పారు. ‘వైద్య పరంగా సౌరవ్ ఆరోగ్యం ఎంతో బాగుంది. హాయిగా నిద్రపోయాడు, అల్పాహారం తీసుకొన్నాడు. మాతో కూడా మాట్లాడాడు. ఎంతో అనుభవజ్ఞులైన 15 మంది డాక్టర్ల బృందం గంగూలీ డిశ్చార్జ్పై నిర్ణయం తీసుకొంద’ని రూపాలీ మీడియాకు …
Read More »ప్రముఖ పాటల, మాటల రచయిత వెన్నెలకంటి మృతి
ప్రముఖ పాటల, మాటల రచయిత వెన్నెలకంటి (64) ఇక లేరు. గుండెపోటుతో ఆయన ఈరోజు(మంగళవారం) చెన్నైలో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. వెన్నెలకంటిగానే ఆయన అందరికీ పరిచయం. తమిళ చిత్రాలను తెలుగులో అనువాదం చేసే విషయంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండేది. లిరిసిస్ట్గానూ ఆయన ఎన్నో పాటలను రచించారు. మొత్తంగా ఆయన 1000కి పైగా చిత్రాలకు పని చేశారు. ఆదిత్య 369, క్రిమినల్, …
Read More »ట్విట్టర్ లో రెచ్చిపోయిన రష్మిక
ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` వంటి విజయాలతో టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఎదిగింది హీరోయిన్ రష్మిక. ప్రస్తుతం ఈమె తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల సినిమాల్లో నటిస్తోంది. తాజాగా మరో రెండు పెద్ద చిత్రాల్లో నటించే అవకాశం రష్మికను వరించినట్టు సమాచారం. తాజాగా సోషల్ మీడియా ద్వారా రష్మిక అభిమానులతో టచ్లోకి వచ్చింది. అయితే తన కొత్త సినిమాల గురించి మాట్లాడడానికి నిరాకరించింది. `నా వర్క్ గురించి …
Read More »త్వరలో తెలంగాణలో 1400 మంది రేషన్ డీలర్ల నియామకం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1400 రేషన్ షాపులకు త్వరలో డీలర్లను నియమిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచి ప్రజలకు, రేషన్ డీలర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ముషీరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం, నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరణ కార్యక్రమాన్ని …
Read More »తెలంగాణలో గురు,శుక్రవారాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,500 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రజారోగ్యశాఖ సంచాలకుడు గడల శ్రీనివాసరావు తెలిపారు. వైద్యారోగ్యశాఖ సిబ్బందికి తొలివిడుతలో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. సాంకేతిక సమస్యలు, వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ, వ్యాక్సినేటర్ల తయారీ తదితర అంశాలపై సన్నద్ధమయ్యేందుకు గురు, శుక్ర వారాల్లో రాష్ర్ట వ్యాప్తంగా డ్రైరన్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లోని ఏడు …
Read More »తెలంగాణలో కొత్తగా 417 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 417 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 472 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల కేవలం ఇద్దరు మాత్రమే మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 2,88,410గా ఉంది. మొత్తం రికవరీలు 2,81,872 మంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల …
Read More »తెలంగాణలో టీ సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు
తెలంగాణలో నిరుద్యోగుల ఉపాధి కల్పన కోసం టీ సేవ ఆన్లైన్ కేంద్రాల ఏర్పాటుకు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు అని టీ సేవ సంస్థ డైరెక్టర్ ఆడపా వెంకట్ రెడ్డి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. టికెట్ల బుకింగ్, కొత్త పాన్కార్డు, వివిధ టెలికాం పోస్టు పెయిడ్, ప్రీపెయిడ్ రీఛార్జులు, మనీ ట్రాన్స్ఫర్ల వంటి వివిధ రకాల సేవలను టీ సేవలో అందించాలని తెలిపారు. వివరాలకు …
Read More »రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో 6,014.45 కోట్లు జమ
తెలంగాణలో యాసంగి సీజన్ రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు 56,57,489 మంది రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇందుకోసం రూ. 6,014.45 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 120.29 లక్షల ఎకరాలకు రైతుబంధు అందించినట్టు మంగళవారం పేర్కొన్నారు.
Read More »ఏపీలో సంక్రాంతికి ఎన్ని రోజులు సెలవులు అంటే…?
ఆంధప్రదేశ్లో సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. 9న రెండవ శనివారం…10వ తేదీ ఆదివారం కావడంతో మరో రెండు రోజులు సెలవులు కలిసిరానున్నాయి. 11న అమ్మ ఒడి రెండో విడత నగదు పంపిణీ కారణంగా విద్యా శాఖ పనిచేయనుంది.
Read More »