Home / Tag Archives: telangana governament (page 48)

Tag Archives: telangana governament

తెలంగాణ‌లో లాక్‌డౌన్‌పై మంత్రి ఈట‌ల స్ప‌ష్ట‌త‌

తెలంగాణ‌లో లాక్‌డౌన్ పెట్టే ఆలోచ‌న లేద‌ని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్ప‌ష్టం చేశారు. రేప‌ట్నుంచి 19 జిల్లా డ‌యాగ్నొస్టిక్ హ‌బ్‌లు ప్రారంభిస్తామ‌న్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారికి జిల్లా డ‌యాగ్నొస్టిక్ కేంద్రాల్లో ర‌క్త ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారు 3, 4 రోజుల‌కు ఒక‌సారి ర‌క్త ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. రాష్ర్టంలో ఔష‌ధాలు, ఆక్సిజ‌న్ ఎక్కువ ధ‌ర‌కు అమ్మితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని …

Read More »

కేంద్ర ప్ర‌భుత్వంపై మంత్రి ఈట‌ల ఫైర్

కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు తెలంగాణ‌కు చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కుల‌పై రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేత‌లు బాధ్య‌తారాహిత్యంగా మాట్లాడుతున్నారు. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకుని రాష్ర్టాల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప‌రిస్థితులు ఎలా ఉన్నాయో ప‌రిశీలించి మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణ‌లో 4 రాష్ర్టాల‌కు చెందిన రోగుల‌కు చికిత్స అందిస్తున్నామ‌ని తెలిపారు. మేం కేంద్రాన్ని విమ‌ర్శించ‌ట్లేదు.. వారే …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 7,994 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 7,994 మందికి వైరస్ సోకింది. మరో 58 మంది మృతి చెందారు. అదే సమయంలో 4,009 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76,060 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 80,181 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో 1,630, మేడ్చల్ 615, రంగారెడ్డి 558 కరోనా కేసులు నమోదయ్యాయి.

Read More »

పేదలు వైద్యానికి ఇబ్బంది పడకుండా కృషి: డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్

సితాఫలమండీ లోని తన సికింద్రాబాద్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా తాను మంజూరు చేయించిన 72 మందికి రూ.50 లక్షల విలువజేసే చెక్కలను ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పేదలకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని, ప్రభుత్వ పరంగా పేదలను ఆదుకొనేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని …

Read More »

సీఎం కేసీఆర్ గారికి కరోనా నెగిటీవ్

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,సీఎం కేసీఆర్  గారి వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవి రావు ఆధ్వర్యం లోని వైద్య బృందం బుధవారం నాడు  ఇసోలేషన్ లో వున్న సీఎంకు వ్యవసాయ క్షేత్రం లో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించగా…రాపిడ్ టెస్టులో నెగటివ్ గా రిపోర్టు వచ్చింది. కాగా ఆర్టీపీసియార్ పరీక్షా ఫలితాలు నేడు గురువారం రానున్నాయి.

Read More »

సైబరాబాద్‌లో 17మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 17మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌గా సుధీర్‌కుమార్, ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్‌గా వెంకటేశ్వర్‌రెడ్డి, పేట్‌బషీరాబాద్ డిఐగా కరంపురి రాజును నియమించారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌ను యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ యునిట్‌కు బదిలీ చేశారు. ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్ జగదీశ్వర్‌ను సిపిఓకు బదిలీ చేశారు. సైబర్ క్రైంలో పనిచేస్తున్న సునీల్, …

Read More »

తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుక‌లు

తెలంగాణ భ‌వ‌న్‌లో టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. పార్టీ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ కే కేశ‌వ‌రావు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి క‌లిసి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హం, ఆచార్య జ‌య‌శంక‌ర్ విగ్ర‌హానికి కేకే పూలమాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు పాల్గొన్నారు. అనంత‌రం కే కేశ‌వ‌రావు మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అకుంఠిత కార్య‌దీక్ష‌తో గాంధేయ మార్గంలో తెలంగాణ ఉద్య‌మాన్ని …

Read More »

జల దృశ్యం నుంచి..సుజల దృశ్యం దాకా..

కేసీఆర్‌ గారు 2001లో పార్టీ స్థాపించేనాటికి కేంద్రంలో ఎన్డీయే అధికారంలో ఉన్నది. దేశవ్యాప్తంగా బీజేపీ బలం పుంజుకుంటున్నది. మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వందేండ్ల చరిత్ర గల కాంగ్రెస్‌ కూడా ఇటు రాష్ట్రంలో, అటు జాతీయస్థాయిలో బలంగానే ఉన్నది. ఇక రాష్ట్రంలో చంద్రబాబు ప్రభావం నడుస్తున్న కాలం అది. అప్పుడు రాష్ట్రంలో పరిస్థితి కూడా అంత ఆశాజనకంగా ఏమీ లేదు. 1950ల్లో ఒకసారి, 1969లో ఒకసారి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎగిసిపడింది. …

Read More »

మంత్రి పువ్వాడ సమక్షంలో 150 మందితో TRSలో చేరిన 18వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిని పద్మ..

ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్(KMC) ఎన్నికల్లో 18వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో ఉన్న అభ్యర్థిని అయినాల పద్మ, భర్త శ్రీనివాసరావు తో పాటు 150 మంది కార్యకర్తలు స్థానిక తెరాస అభ్యర్థి మందడపు లక్ష్మీ మనోహర్ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సమక్షంలో తెరాసలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పు సాదరంగా ఆహ్వానించారు. అభివృద్ధికి చిరునామా గా ఉన్న తెరాస …

Read More »

గులాబీ శ్రేణుల‌కు మంత్రి కేటీఆర్ పిలుపు

మంగళవారం (ఏప్రిల్ – 27) టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణను సాధించి ఆత్మగౌరవాన్ని చాటిన గులాబీ జెండాను ప్రతి జిల్లాలో, మండలాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణ చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో పార్టీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపలేకపోతున్న‌ట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat