సిద్ధిపేట జిల్లాలో మరో నాలుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాల నిర్మాణాలకు ₹14 కోట్లు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు గారు తెలిపారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆ దిశగా జిల్లాలో మండలానికి ఒక కస్తూర్బా బాలికల పాఠశాలలను మంజూరు చేసుకున్నామని చెప్పారు.16 పాఠశాలలకు స్వంత భవనాలు ఉన్నాయ్.. 6 పాఠశాలలకు స్వంత భవనాలు లేక విద్యార్థులకు …
Read More »టీఎస్ బీపాస్ వెబ్సైట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
పట్టణ ప్రాంతాల్లో నిర్మాణ అనుమతులను సులభతరం చేయడానికి రూపొందించిన టీఎస్ బీపాస్ వెబ్సైట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెబ్సైట్ను ఆవిష్కరించారు. దీంతో రాష్ట్రంలో టీఎస్బీపాస్ నేటినుంచి అమల్లోకి వచ్చింది. పట్టణప్రాంతాల్లో భవన నిర్మాణం, లేఅవుట్లకు సులభతరంగా, వేగంగా అనుమతులివ్వడం కోసం ఈ వెబ్సైట్ను ప్రభుత్వం రూపొందించింది. దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారు. నిర్దేశించిన గడువులోగా అనుమతులు, …
Read More »ఇప్పటికి ధరణి రిజిస్ట్రేషన్లు 12,705
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జోరందుకుంటున్నది. ధరణి పోర్టల్కు విశేష స్పందన లభిస్తున్నది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు చేసుకునేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కేవలం 10 రోజుల్లోనే 12,705 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నాటికి 8,488 రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు కాగా, బుధవారం సాయంత్రానికి ఆ సంఖ్య 12,705కు చేరుకున్నది. అంటే రెండ్రోజుల్లోనే 4,217 రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మూడ్రోజులుగా సగటున రెండువేలకు మించి రిజిస్ట్రేషన్లు, …
Read More »మానవత్వం చాటుకున్న మంత్రి హరీష్ రావు
మాసాయి పేట వద్ద జాతీయ రహదారి వద్ద ఇద్దరు యువకులు బైక్ పై వెళుతూ..బైక్ స్క్రిడ్ అయి కింద పడ్డారు.. ఈ సమయంలో దౌల్తాబాద్ నుండి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో మంత్రి హరీష్ రావు గారు కింద పడిపోయిన ఇద్దరి యువకులను గమనించి కారులో ఆపి దిగారు… జరిగిన సంఘటనను అడిగి తెలుసుకొని.వారికి గాయాలను గుర్తించి అక్కడ ఉన్న ఎస్ ఐ గారి కి చెప్పి ఆసుపత్రి చేపించారు.. ఇద్దరి …
Read More »“ది అరవింద్ షో” రూం ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం నగరంలో టిఆర్ యస్ పార్టీ నగర అధ్యడు కమర్తపు మురళి కి చెందిన అరవింద్ బ్రాండెడ్ షోరూం ఇల్లెందు క్రాస్ రోడ్డు కరెంట్ ఆఫీస్ ఏదురగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడూతూ జిల్లా వాసులకి నాణ్యమైన దుస్తులు అందించే అరవింద్ షోరూం స్థాపించిన మురళికి శుభాకాంక్షులు తెలిపారు.నూతన వస్తాల కోనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని …
Read More »ఆరేండ్లలో 28 వేల పోలీసు నియామకాలు
తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని, ఆరేండ్లలో దాదాపు 28వేల మంది పోలీసు సిబ్బంది నియామకాలు చేపట్టారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాయని.. సాంకేతికత, ఫ్రెండ్లీ పోలీసీంగ్తో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని అభినందించారు. ప్రజాభద్రత, రక్షణకు ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్.. పోలీసుశాఖకు అనేక వాహనాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ సెంటర్లో ఏర్పాటుచేసిన …
Read More »దక్షిణకొరియా కంపెనీలకు మంత్రి కేటీఆర్ ఆహ్వానం
తెలంగాణలో కొరియా పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియా కంపెనీలు ముందుకు రావాలన్నారు. ఈ పార్క్లో సకల సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. భారత్-కొరియా బిజినెస్ ఫోరం బుధవారం ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఎ్సఐపాస్ విధానం అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు గడించిందని గుర్తుచేశారు. …
Read More »దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తున్నా: మంత్రి హరీశ్ రావు
దుబ్బాక ఉపఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు ప్రజా తీర్పును శిరసావహిస్తామని..టీఆర్ఎస్ కు ఓటేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేసిన మంత్రి.. ఓటమికి గల కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. ఓడినా దుబ్బాక ప్రజల్లోనే ఉంటామన్న హరీశ్. సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
Read More »తెలంగాణలో కరోనా అప్డేట్ -కొత్తగా 1,196 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,196 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,53,651కి చేరింది ఇందులో 18,027 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,34,234 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా ఐదుగురు కరోనాతో మృతిచెందగా, మొత్తం 1,390 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఇప్పటివరకు 47,29,401 కరోనా టెస్టులు చేశారు.
Read More »జవహర్నగర్లో వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని జవహర్నగర్లో జీహెచ్ఎంసీ, రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ సంయుక్తాధ్వర్యంలో మున్సిపల్ వ్యర్థాలతో విద్యుత్(వేస్ట్ టూ ఎనర్జీ)ను ఉత్పత్తిచేసే ప్లాంటును నిర్మించారు. 19.8మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంటును మంగళవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అయితే దక్షిణ భారతదేశంలోనే వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తిచేసే మొదటి ప్లాంటు ఇది కావడం విశేషం. ఘన …
Read More »