Home / Tag Archives: telangana governament (page 89)

Tag Archives: telangana governament

అండగా ఉంటాం.. ఆధైర్యపడకండి-మంత్రి కేటీఆర్

తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ మహానగరంలో  వరదలో చిక్కుకున్న హబ్సీగూడ, రామంతాపూర్‌ పరిసర ప్రాంతాల ప్రజలను అన్ని విధాలా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా హబ్సీగూడ, రామంతాపూర్‌ ప్రాంతాల్లో రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …

Read More »

దుబ్బాక టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సోలిపేట సుజాత నామినేషన్

దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సోలిపేట సుజాత బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌తో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ సమర్పించారు. దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నెల 16వ తేదీ వరకు నామిషన్ల స్వీకరణకు గడువు ఉండగా.. 17న పరిశీలన, 19వ …

Read More »

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రహహిస్తున్న‌ది. చాదర్‌ఘాట్‌ వద్ద పది అడుగుల మేర నీటి ప్రవాహం వచ్చి చేరింది. మూసానగర్, శంకర్ నగర్, కమల్‌నగర్ పూర్తిగా నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు మిద్ద‌ల‌పైకి చేరారు. చాదర్‌ఘాట్‌ దగ్గర కొత్త వంతెనపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో కోఠి, దిల్‌సుఖ్‌నగర్‌కు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వ‌ర‌ద ఉధృతిలో అంబ‌ర్‌పేట‌-దిల్‌సుఖ్‌న‌గ‌ర్ దారిలో …

Read More »

పాత ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు చెల్లుబాటు

ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద 2015లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిబంధనలు, షరతులు అన్ని ఒకేవిధంగా ఉన్నందున పెండింగ్‌ దరఖాస్తులను ప్రస్తుత ఎల్‌ఆర్‌ఎస్‌ బోర్డులోకి తీసుకునేందుకు మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ అనుమతి ఇచ్చారు. నిబంధనల ప్రకారం వాటిని క్రమబద్ధీకరించాలని సూచించారు. ఈ మేరకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం 2015 కింద జనవరి 31,2020 వరకు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ …

Read More »

అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజాసేవలో మమేకం కావాలని గ్రూప్‌-2 అధికారులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సోమవా రం ఎంసీహెచ్చార్డీలో గ్రూప్‌-2 అధికారుల 40 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సేవకు గ్రూప్‌-2 ఉద్యోగం గొప్ప అవకాశమన్నారు. కార్యక్రమంలో బీపీ ఆచార్యతోపాటు అదనపు డీజీ హరిప్రీత్‌సిం గ్‌, ప్రభుత్వ సలహాదారు జీఆర్‌ రెడ్డి, శిక్షణ తరగతుల కో ఆర్డినేటర్లు నబీ, …

Read More »

నేడు రేపు అతి భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యమైన సూచన. మంగళవారం, బుధవారం అతి భారీగా వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాల ప్రకారం 72 గంటలపాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డి.ఎస్‌. లోకేశ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని చోట్ల తొమ్మిది నుంచి 16 సెంటీమీటర్ల వరకూ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. …

Read More »

దర్గాలో మాజీ ఎంపీ కవిత

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో‌ నాంపల్లిలోని యుసిఫియన్‌ దర్గాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చాదర్‌ సమర్పించారు. ముస్లిం మతపెద్దల ఆశీస్సులు అందుకున్నారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈరోజు సోమవారం   వెలువడనున్న నేపథ్యంలో ఆమె దర్గాను సందర్శించారు. కవిత వెంట హోంమంత్రి మహమూద్‌ అలీ, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ బాబా …

Read More »

తెలంగాణలో పత్తి కొనుగోలుకు 300 కేంద్రాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలుకు మార్కెటింగ్‌శాఖ చర్యలు ముమ్మరంచేసింది. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 300 కేంద్రాల ఏర్పాటుచేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే పత్తి కొనుగోలుకు సీసీఐ సమ్మతించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా పత్తి కొనుగోళ్లకు జిన్నింగ్‌ మిల్లులను ఎంపికచేసిన సీసీఐ ఆ జాబితాను రాష్ట్ర మార్కెటింగ్‌శాఖకు పంపించింది. ఎంపికచేసిన జిన్నింగ్‌ మిల్లులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేవా? అని మార్కెటింగ్‌శాఖ పరిశీలిస్తున్నది. మరోవైపు పత్తి పంటచేతికి రావడం ప్రారంభమైంది. …

Read More »

అభ్యర్థి ఎవరైన గెలుపు పక్కా..!

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఓట్ల న‌మోదు, ఎన్నికల్లో గెలుపు ఎత్తుగ‌డ‌ల‌పై మంత్రులు నేత‌ల‌తో స‌మీక్ష చేశారు. అభ్య‌ర్థి ఎవ‌రైనా, గెలుపు ఖాయంగా ప‌ని చేయాల‌ని నిర్ణ‌యించారు. పార్టీ బాధ్యులు, వివిధ విభాగాల బాధ్యుల‌తో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌పై మంత్రులిద్ద‌రూ సుదీర్ఘంగా చ‌ర్చించారు. ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షుడు బోయిన‌పల్లి వినోద్ కుమార్, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్క‌ర్, మండ‌లి ప్ర‌భుత్వ చీఫ్ విప్ బోడ‌కుంటి వెంక‌టేశ్వ‌ర్లు, రాష్ట్ర …

Read More »

దుబ్బాక ఉపఎన్నిక‌పై ఎన్ఆర్ఐల‌తో మంత్రి హ‌రీశ్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

టీఆర్ఎస్ ఎన్ఆర్ఐల‌తో మంత్రి హ‌రీశ్‌రావు వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. దుబ్బాక ఉపఎన్నిక‌పై ఎన్ఆర్ఐల‌కు వివించారు. దుబ్బాకలో ఎన్నిక‌ల ప్ర‌చార స‌ర‌ళిని వారికి వివ‌రించారు. ఈఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐల పాత్ర‌పై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగా రెడ్డి మ‌ర‌ణంతో దుబ్బాక‌లో ఉపఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. దీంతో రామ‌లింగా రెడ్డి భార్య సుజాత‌ను టీఆర్ఎస్ పార్టీ త‌న అభ్య‌ర్థిగా బ‌రిలోకి దించింది. మంత్రి హ‌రీశ్‌రావు ముమ్మ‌రంగా ప్రచారం నిర్వ‌హిస్తున్నారు. ఉపఎన్నిక‌లు వ‌చ్చేనెల 3న జ‌ర‌గున్నాయి. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat