తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో మంగళవారం అతిభారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయయ్యాయి. నాలాలు పొంగుతున్నాయి. మరో రెండు, మూడురోజులు నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రజలను కోరారు. నగరంలో వరద పరిస్థితిపై అధికారులతో ఆయన ఈ ఉదయం సమీక్ష నిర్వహించారు. వరద సహాయక చర్యల్లో అన్ని బృందాలను నిమగ్నం …
Read More »కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన అవినీతి, లంచం కేసులో విచారణ ఎదుర్కొంటున్న రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో నాగరాజు ఉంటున్నాడు. నాగరాజు మృతదేహాన్ని చంచల్గూడ జైలు నుంచి ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ల్యాండ్ సెటిల్మెంట్ కేసులో కోటి పది లక్షల రూపాయాలు లంచం డిమాండ్ చేసిన ఆయన ఏసీబీకి అడ్డంగా చిక్కిన …
Read More »యాసంగి పంటల సాగుపై సీఎం కేసీఆర్ సమీక్ష
యాసంగి పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిపుణులు హాజరయ్యారు. యాసంగిలో ఏయే పంటలను ఏయే ప్రాంతాల్లో సాగు చేయాలనే అంశంపై సీఎం చర్చిస్తున్నారు. వానాకాలంలో మాదిరిగానే యాసంగిలోనూ నియంత్రిత సాగు స్ఫూర్తి కొనసాగాలని వ్యవసాయ శాఖ అధికారులతో నిన్న జరిగిన సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించిన …
Read More »4 బిల్లులకు తెలంగాణ శాసనసభ ఆమోదం
తెలంగాణ శాసనసభ కీలకమైన నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లులపై చర్చించి.. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. అనంతరం ఈ నాలుగు బిల్లులను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలు కావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఇండియన్ స్టాంప్ బిల్లు(తెలంగాణ)2020, …
Read More »జీహెచ్ఎంసీ చట్టానికి 5 సవరణలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి 5 సవరణలు తీసుకువస్తున్నట్లు ఈ రోజు మంగళ వారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. 50 స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ.. 10 శాతం బడ్జెట్ను పచ్చదనం కోసం కేటాయిస్తూ రెండవ చట్ట సవరణ.. అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో జవాబుదారీతనం పెంచుతూ మూడవ చట్ట సవరణ తెచ్చమన్నారు.. జీహెచ్ఎంసీ రిజర్వేషన్ …
Read More »పాత ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు చెల్లుబాటు
ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద 2015లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిబంధనలు, షరతులు అన్ని ఒకేవిధంగా ఉన్నందున పెండింగ్ దరఖాస్తులను ప్రస్తుత ఎల్ఆర్ఎస్ బోర్డులోకి తీసుకునేందుకు మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అనుమతి ఇచ్చారు. నిబంధనల ప్రకారం వాటిని క్రమబద్ధీకరించాలని సూచించారు. ఈ మేరకు ఎల్ఆర్ఎస్ పథకం 2015 కింద జనవరి 31,2020 వరకు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ …
Read More »అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి
అధికారులు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజాసేవలో మమేకం కావాలని గ్రూప్-2 అధికారులకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. సోమవా రం ఎంసీహెచ్చార్డీలో గ్రూప్-2 అధికారుల 40 రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సేవకు గ్రూప్-2 ఉద్యోగం గొప్ప అవకాశమన్నారు. కార్యక్రమంలో బీపీ ఆచార్యతోపాటు అదనపు డీజీ హరిప్రీత్సిం గ్, ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి, శిక్షణ తరగతుల కో ఆర్డినేటర్లు నబీ, …
Read More »నేడు రేపు అతి భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరవాసులకు ముఖ్యమైన సూచన. మంగళవారం, బుధవారం అతి భారీగా వర్షాలు పడనున్నాయి. వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాల ప్రకారం 72 గంటలపాటు నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్. లోకేశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొన్ని చోట్ల తొమ్మిది నుంచి 16 సెంటీమీటర్ల వరకూ కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. …
Read More »నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశం
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశం ఈ రోజు మంగళవారం మొదలుకానున్నది. ఇటీవల ప్రారంభమైన శాసన సభ కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి విదితమే. ఈ రోజు మొదలు కానున్న ఈ ప్రత్యేక సమావేశంలో జీహెచ్ఎంసీలో వార్డుల రిజర్వేషన్లకు రోటేషన్ లేకుండా ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగించే విధంగా బిల్లును తీసుకురానున్నది. నాలా చట్టం ,నేర విచారణ స్మృతి వంటి పలు ప్రత్యేక చట్టాలకు ప్ర్తభుత్వం పలు సవరణలను …
Read More »కవిత గెలుపు నిజామాబాద్ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుంది
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవితకు తెరాస సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. కవిత గెలుపు నిజామాబాద్ జిల్లాకే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కూడా మరింత దోహదం చేస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే ప్రజలకు, రైతులకు తప్పుడు హామీలతో బాండు పేపర్లు రాసిచ్చి మోసం చేసిన వ్యక్తిని గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించి పొరపాటు …
Read More »