Home / Tag Archives: telanganacm (page 441)

Tag Archives: telanganacm

నేటితో ఆర్టీసీ ఉత్కంఠకు తెర

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. సమ్మె చేస్తోన్న సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగం చేయాలనుకునేవారు భేషరతుగా వచ్చి విధుల్లో చేరాలని రెండు మూడు సార్లు ప్రకటించింది. అయిన కానీ ఆర్టీసీ సిబ్బంది వెనక్కి తగ్గలేదు. కోర్టు మెట్లు ఎక్కిన ఆర్టీసీ సిబ్బందికి హైకోర్టు లేబర్ కోర్టుకు కేసును బదలాయిస్తూ.. ప్రభుత్వం దయచూపి విధుల్లోకి …

Read More »

తెలంగాణలో ఉద్యోగాల జాతర

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం త్వరలోనే వైద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నది. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న మొత్తం పన్నెండు వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర తెలిపారు. వైద్య ఖర్చుల నుంచి రాష్ట్రంలో పేదవార్ని ఆదుకునేందుకు సర్కారు ఉచిత వైద్యసేవల కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను పెంచుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం …

Read More »

డ్రైవర్ పాడె మోసిన మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ లోని బుల్లెట్ ఫ్రూప్ కారు ప్రమాదానికి గురి అవ్వడంతో ఇద్దరు మృత్యువాతపడగా .. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంగతి విదితమే. మృతి చెందిన వారిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కారు డ్రైవర్ పార్థసారథి, సోషల్ మీడియా ఇంఛార్జ్ పూర్ణ ఉన్నారు. అయితే రోడ్డు ప్రమాదం మృతి చెందిన పార్థసారధి అంతిమయాత్రలో మంత్రి ఎర్రబెల్లి …

Read More »

రవీంద్రభారతిలో ప్రముఖ గాయని సుశీల జన్మదిన వేడుకలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రముఖ గాయని సుశీల గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి, ప్రముఖ పాత్రికేయులకు పురస్కారాల ప్రదానంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కళల ను, కళాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. …

Read More »

యువతికి మంత్రి కేటీఆర్ భరోసా

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు యువతికి భరోసాగా నిలిచారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటకు చెందిన అంబటి బాలయ్యకు ఇద్దరు కూతుర్లు. కొడుకున్నారు. రెండో కూతురు (21)రజిత డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం ఇంట్లోనే ఉంటుంది. రజిత గత కొన్నాళ్లుగా నరాల బలహీనత వ్యాధితో బాధపడుతుంది. దీంతో సరిగ్గా నాలుగురోజుల కిందట తీవ్ర అస్వస్థతకు …

Read More »

మంత్రి హారీష్ కృషి-సిద్దిపేటకు మరో ఘనత

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం సిద్దిపేట. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుంచి నేటి వరకు అన్ని రంగాల్లో సిద్దిపేటను ముందువరుసలో ఉంచుతూ యావత్తు తెలంగాణను సిద్దిపేటవైపు చూసేలా అభివృద్ధి చేస్తోన్నారు. తాజాగా సిద్దిపేట మరో అంశంలో ఖాతినోందింది. సహాజంగా మనం మన ఇంట్లో కానీ మార్కెట్లో కానీ పాడైపోయిన లేదా కుళ్లిపోయిన కూరగాయలను చెత్తలో వేస్తాం. లేదా …

Read More »

మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్ లో కారు ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయాణిస్తోన్న కాన్వాయ్ లోని కారు ప్రమాదానికి గురైంది. నిన్న శనివారం హైదరాబాద్ నుంచి తన నియోజకవర్గమైన పాలకుర్తికి వెళ్తోన్న సమయంలో జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని చీటూరు గ్రామ శివారులో శనివారం రాత్రి పదకొండున్నరకు మంత్రి కాన్వాయ్ లోని బుల్లెట్ ప్రూఫ్ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో మంత్రి సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ,డ్రైవర్ పార్థసారధి …

Read More »

ప్రతి ధాన్యపు గింజను కొంటాం

రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ప్రతి ధాన్యపు గింజను కొంటామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.శనివారం దామెర మండలం సింగరాజుపల్లి గ్రామంలో ఐకెపి వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిదాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర కల్పించడం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు.అందుకు అనుగుణంగా రైతులు ధాన్యాన్ని తేమలేకుండా తీసుకురావాలన్నారు.ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1835,సాదారణ ధాన్యానికి రూ.1815 ధర చెల్లిస్తుందన్నారు.మధ్య …

Read More »

మంత్రి ఈటెల రాజేందర్ కి ఆహ్వానం

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 సంవత్సరంను “నర్సింగ్ ఇయర్” గా ప్రకటించింన సందర్భంగా రవీంద్రభారతిలో జరగబోయే కార్యక్రమమునకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారిని కలసి నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆహ్వానించడం జరిగింది.అమెరికా, ఇంగ్లండ్ యూరప్ వంటి దేశాల ప్రభుత్వాలు అధికారికంగా నర్సింగ్ ఇయర్ ను జరుపుకోబోతున్నాయి.   అందులో భాగంగా భారత్ దేశంలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా …

Read More »

సిద్ధిపేట జిల్లా మొదటి స్థానం పొందాలి

సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 12 రెసిడెన్షియల్ కళశాలలు, 14 మోడల్ స్కూల్స్, 36 ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాల్స్ తో వంద శాతం ఫలితాలు రాబట్టేలా విద్యాబోధన చేపట్టాలని, రాష్ట్ర ఉత్తీర్ణతలో సిద్ధిపేట జిల్లా మొదటి స్థానం పొందాలనే అంశంపై డీఆర్వో చంద్రశేఖర్, ఉన్నత విద్యా శాఖ జూనియర్ కళాశాల జిల్లా ఆర్ఐఓ సుధాకర్ తో కలిసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat