తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ ముప్పై తారీఖున జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఈ రోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగనుంది. పోస్టల్ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు జరుగనుంది. మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఒక్కో రౌండ్కు …
Read More »TRS విజయ గర్జన సభ కోసం స్థలాల పరిశీలన
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చారిత్రక వరంగల్ నగరంలో ఈ నెల 15వ తేదీన విజయ గర్జన సభ పెట్టాలని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు. దాదాపు 10 లక్షల మందితో భారీ ఎత్తున సభను ఈ సభ నిర్వహించి, విజయవంతం చేయాలని పార్టీ ముఖ్యనేతలకు సూచించారు. ఇందులో భాగంగా వరంగల్ …
Read More »ప్రత్యేక ఆకర్షణగా టెంపుల్ సిటీ
యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మికతతోపాటు పచ్చదనానికి నిలయంగా మారుతున్నది. ఆలయ పరిసరాల్లో 98 రకాలకు చెందిన 4.21 లక్షల మొక్కలు పెంచుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆలయానికి సులభంగా చేరుకునేలా రహదారి విస్తరణ పనులతోపాటు ఆలయం చుట్టూ రింగ్ రోడ్డు పనులు చేపట్టారు. రోడ్లకు ఇరువైపులా పచ్చదనం పెంపుపై వైటీడీఏ దృష్టిసారించింది. వాహనాల రద్దీ కారణంగా కాలుష్య సమస్యలు తలెత్తకుండా రకరకాల మొక్కలు నాటారు. తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ నుంచే …
Read More »‘దేశాన్ని సాకుతున్న నాలుగైదు అతిపెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి’
‘దేశాన్ని సాకుతున్న నాలుగైదు అతిపెద్ద రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి’ అని సీఎం కేసీఆర్ పదేపదే చెప్తుంటారు.కేంద్ర ప్రభుత్వ నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ పత్రిక చేసిన విశ్లేషణలో సైతం ఆర్థిక శక్తులుగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణను ఒకటిగా తేల్చింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ర్టాలతో పోల్చితే దక్షిణాది రాష్ర్టాలు బలంగా ఉన్నాయని వెల్లడించింది. ఈ విశ్లేషణలో దేశాన్ని తూర్పు, పశ్చిమ, మధ్య (సెంట్రల్), దక్షిణ, …
Read More »కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ అనుకూల స్టాండ్ తీసుకొన్న కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ అడుగుజాడల వెంటే నడిచిందని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఇంకా చాలాకాలం పడుతుందని కుండబద్దలు కొట్టా రు. సీఎల్పీ కార్యాలయంలో మీడియా తో చిట్చాట్ చేసిన జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు …
Read More »రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలి
కరోనా నియంత్రణకు మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు రెండో డోస్ తప్పకుండా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ సూచించారు. రాజేంద్రనగర్ సర్కిల్ రైజ్హోమ్ కాలనీలో శనివారం ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ..రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 3 కోట్లకు పైగా కొవిడ్ టీకాలు ఇచ్చామని, నగరంలో దాదాపు 90 శాతం పౌరులకు వ్యాక్సిన్ పూర్తయ్యిందని చెప్పారు. శనివారం నుంచి …
Read More »హైదరాబాద్లో ‘ప్లగ్ అండ్ ప్లే’ టెక్ సెంటర్!
టెక్నాలజీ రంగంలో వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్లో కార్యాలయం ఏర్పాటుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘ప్లగ్ అండ్ ప్లే’ టెక్ సెంటర్ సుముఖత వ్యక్తం చేసింది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం పారి్సలోని ప్లగ్ అండ్ ప్లే కార్యాలయాన్ని సందర్శించి సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. దేశంలోనే ప్రముఖ స్టార్టప్ నగరంగా హైదరాబాద్ కొనసాగుతోందని, టి-హబ్, వి-హబ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వినూత్న …
Read More »హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతం: శశాంక్ గోయల్
హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్గోయల్ తెలిపారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్ నమోదైందని, తుది నివేదికల తర్వాత మరింత పెరిగే అవకాశమున్నదని చెప్పారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమలాపూర్లో 224, 225 పోలింగ్కేంద్రాల్లో సమయం దాటిన తర్వాత కూడా ఓటర్లు బారులు తీరారని చెప్పారు. పోలిం గ్ ముగిశాక పోలింగ్ ఏజెంట్ల …
Read More »హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో 86.33 % పోలింగ్ నమోదు
హుజూరాబాద్ నియోజకవర్గానికి శనివారం జరిగిన ఉపఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఓటు హక్కును వినియోగించుకొన్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో 84.39 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఈసారి 86.33 % (కడపటి వార్తలు అందిన సమాచారం మేరకు) నమోదైంది. ఉదయం నుంచి పోలింగ్ గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం సమయంలో బాగా పెరిగింది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకొన్నారు. …
Read More »హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు చైతన్యం చాటారు
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు చైతన్యం చాటారని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతిఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. హుజూరాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. నాలుగు నెలలుగా పార్టీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకం, హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో గొప్ప విజయం సాధించబొతున్నామని …
Read More »