తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ల సమావేశం కొనసాగుతోంది. ఏపీ పునర్విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇరువురి మధ్య చర్చ కొనసాగుతోంది. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలతో పాటు గోదావరి జలాల సద్వినియోగం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా నదికి మళ్లించేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రెండు …
Read More »ఆపద్బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణలో నిరుపేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా ఉండి ఆదుకుంటున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.నియోజకవర్గంలోని ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఎర్ర రాజిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతుండగా అతడి వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్.ఓ.సి.ని బాధిత కుటుంబసభ్యులకు శుక్రవారం ఎమ్మెల్యే అందచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ పేదలకు కేసీఆర్ గారు అండగా ఉన్నారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు …
Read More »ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ వెనక అసలు కారణం ఇదే..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల స్నేహ సంబంధాలను పటిష్ఠం చేయడంతో పాటు రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఇరువురు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. గోదావరి, కృష్ణా నదులకు సంబంధించిన ప్రధానాంశాలు సహా 5 కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే పలు దఫాలు లాంఛనంగా ముఖ్యమంత్రుల భేటీలు జరిగాయి. గవర్నర్ సమక్షంలోనూ చర్చించారు. దీనికి …
Read More »సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం
సీఎం కేసీఆర్ తెలంగాణకు పర్యాయపదంగా మారిపోయారు. తెలంగాణ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే తెలంగాణ అనేలా ఆయన రాష్ట్రాన్ని మహాద్భుతంగా ముందుకు నడిపిస్తున్నారు. ఒకనాడు తెలంగాణ వస్తుందా అన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇప్పుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నేడు దిగ్విజయంగా ముందుకు సాగిపోతోంది. ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలుస్తూ తనకు తానే సాటి అని చాటుకుంటోంది. ఉద్యమ సమయంలో యావత్ తెలంగాణను ఒక్కతాటిపైకి తెచ్చిన నాయకుడు సీఎం …
Read More »ఘనంగా జయశంకర్ సార్ 8వ వర్ధంతి వేడుకలు
ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత, ఉద్యమ దిక్సూచి, సిద్దాంత కర్త స్వర్గీయ ప్రొ.జయశంకర్ సార్ 8వ వర్ధంతి సందర్భంగా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ శాఖ అద్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాల వేసి తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనంపాటించి ఘనంగా సభ్యులు అందరూ నివాళులర్పించారు. అనంతరం శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ …
Read More »తెలంగాణ వ్యాప్తంగా “కాళేశ్వర”సంబురాలు..
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణులు నేడు ఘనంగా సంబురాలు జరిపారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు సంబురాల్లో పాల్గొన్నారు. పట్టణాల్లో, గ్రామాల్లో పటాకులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకాలు చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ వద్ద జరిగిన సంబురాల్లో ఎమ్మెల్యే హరీశ్రావు పాల్గొనగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట …
Read More »కాళేశ్వరం విశిష్టతలు ఇవే
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అంతకుముందు ఏపీ సీఎం జగన్.. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజీ వద్ద గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొబ్బరికాయలు కొట్టారు. తదనంతరం సీఎం కేసీఆర్ గుమ్మడి కాయను కొట్టి.. రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించారు.ప్రతిష్టాత్మక కాళేశ్వరం విశిష్టతలు ఇవే. -147 టీఎంసీల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం …
Read More »కాళేశ్వరం జాతికి అంకితం
తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జాతికి అంకితం చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, శేరి …
Read More »కాళేశ్వరానికి విద్యుత్ సరఫరా ఇలా..?
తెలంగాణలో బీడుబారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని చరిత్రలో నిలిచిపోయేలా ముందుకు నడిపించడంలో విద్యుత్ అత్యంత ముఖ్యమైన భూమికను పోషించనున్నది. అత్యంత భారీమోటర్ల ద్వారా మేడిగడ్డ నుంచి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం.. సముద్రమట్టానికి 618 మీటర్ల పైన నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధమయింది. ఇందుకు కావాల్సిన ఇంధనం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లి. భారీ ఏర్పాట్లను పూర్తిచేసింది. రోజుకు 2 …
Read More »తెలంగాణ బీళ్లకు ప్రాణహితమే కాళేశ్వరం
తెలంగాణ నీటిపారుదలలో కాళేశ్వరం ప్రాజెక్టు చారిత్రక మలుపు. గోదావరి జలాల వినియోగంలో కాళేశ్వరానికి ముందు.. కాళేశ్వరానికి తరువాత అని చెప్పుకొనేలా సరికొత్త అధ్యాయానికి నాంది. తలాపునే వేల టీఎంసీల గోదావరిజలాలు పారుతున్నా.. వంద టీఎంసీల వినియోగానికి సైతం మొహం వాచిన తెలంగాణ రైతాంగం ఇప్పుడు 500-600 టీఎంసీల వినియోగానికి సమాయత్తమవుతున్నది. గోదావరి బేసిన్లో 954 టీఎంసీల వాటా జలాలున్నా పట్టుమని పదిశాతం వాడుకోలేని తెలంగాణ గడ్డ.. ఇప్పుడు ఏకంగా 60-70 …
Read More »