తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ముద్ర పథకంలో అన్యాయం చేస్తుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరోపించారు. ముద్ర పథకం కింద రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు 28,86,210 మందికి మాత్రమే రుణాలు అందాయని ఆయన అన్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర జనాభాతో పోలిస్తే ఇది కేవలం 7.42 శాతమే అని ఆయన విమర్శించారు. దీనికి సంబంధించిన వినోద్ కుమార్ కేంద్ర ఆర్థిక శాఖ …
Read More »ఉప ఎన్నికల్లో డబ్బులను నమ్ముకుంటున్న ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,టీఆర్ఎస్ నేతలు తమ తమ అభ్యర్థుల తరపున ప్రచార పర్వాన్ని మమ్మురం చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరోకరు దుమ్మెత్తిపోసుకుంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ,మండలిలో విప్ అయిన …
Read More »శానంపూడి సైదిరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం
హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటికి దిగిన శానంపూడి సైదిరెడ్డికి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గంలో సైదిరెడ్డి ఎక్కడకెళ్లిన ప్రజలు ఎదురు వచ్చి మరి హారతులు పడుతున్నారు. అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తోన్న టీఆర్ఎస్ పార్టీకే ప్రజా ఆదరణ లభిస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సత్యవతి గరిడేపల్లి,మఠంపల్లి మండల్లాల్లో ప్రచారం …
Read More »సిరిసిల్ల చీరను కట్టిన న్యూజిలాండ్ ఎంపీ
తెలంగాణ రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులు ప్రపంచంలోని దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్న సంగతి విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధికై.. నేతన్నల సంక్షేమంకోసం పలు పథకాలను చేపడుతున్న విషయం మనకు తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన నేతన్నలు వేసిన చీరను న్యూజిలాండ్ దేశానికి చెందిన మహిళా ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ ధరించారు. న్యూజిలాండ్ లో జరుగుతున్న బతుకమ్మ వేడుకల్లో భాగంగా …
Read More »ప్రజా సమస్యలపై మంత్రి మల్లారెడ్డి ఆరా
తెలంగాణ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ రోజు తన నియోజకవర్గంలోని క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జెడ్పీ వైస్ ఛైర్మన్ వెంకటేష్, మంత్రి రాజశేఖర్ రెడ్డి, కమిషనర్ వాణి, అధికారులు, స్థానిక నాయకులు …
Read More »ప్రపంచ పర్యాటక కేంద్రంగా జోగులాంబ
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గద్వాల జోగులాంబ జిల్లాలో పర్యటించారి. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలోని పర్యాటక సలహాదారు నీరజ్,పర్యాటక డివిజన్ అధిపతి ఎస్ఎస్ వర్మలతో కూడిన కేంద్ర బృందం జోగులాంబ ఆలయాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” జోగులాంబ క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాము. జోగులాంబ ఆలయానికి ప్రసాద్ పథకం కింద సాయం అందించేలా కేంద్రాన్ని …
Read More »టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
హుజూర్ నగర్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని ఎమ్మెల్యే,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ అన్నారు..24,27 బూత్ లలో సాయిబాబా వీదితో పాటు పలు వీదులలో శానంపూడి సైదిరెడ్డిని గెలిపించవలసిందిగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ పాల్గొన్న ఇంచార్జ్ లు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ …
Read More »ఈ నెల 19వరకు విద్యాసంస్థలకు సెలవులు
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన మొత్తం నలబై ఎనిమిది వేల మంది సిబ్బంది గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్రంలో ప్రజలకు ,ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో ప్రభుత్వ ,ఎయిడెడ్ ,ప్రైవేట్ జూనియర్,డిగ్రీ కాలేజీలకు ,పాలిటెక్నిక్ ,ఇంజినీరింగ్,లా ,ఎంబీఏ,ఎంసీఏ,ఫార్మసీ కాలేజీలతో పాటుగా అన్ని యూనివర్సీటీలకు ఈ నెల పంతొమ్మిదో …
Read More »తెలంగాణ ఆసుపత్రులకు అవార్డులు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు కేంద్రం ఇచ్చే కాయకల్ప అవార్డులు దక్కాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులల్లో సౌకర్యాలు,పారిశుధ్యం,వ్యర్థాల నిర్వహణ,ఇన్ ఫెక్షన్ నివారణ,తదితర లాంటి పలు అంశాల ప్రాతిపదికన రాష్ట్రం నుంచి నాలుగు ఆసుపత్రులు కాయకల్ప అవార్డులకు ఎంపికయ్యాయి. జిల్లా ఆసుపత్రుల విభాగంలో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి మొదటిస్థానం దక్కింది. సంగారెడ్డి ,కొండాపూర్ జిల్లా ఆసుపత్రులు ద్వితీయ స్థానంలో నిలిచాయి. పీహెచ్సీ-సీహెచ్ సీ విభాగంలో పాల్వంచ ఆరోగ్య కేంద్రానికి ప్రథమ …
Read More »ఐటీలో బెంగళూరు కంటే హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి
హెచ్ఐసీసీలో రెండో రోజు వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్, తెలంగాణ ప్రభుత్వం, ఇండియా డిజైన్ ఫోరం ఆధ్వర్యంలో సమావేశాలు జరుగుతున్నాయి.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో తొలిసారి వరల్డ్ డిజైన్ అసెంబ్లీ సమావేశాలు జరగడం సంతోషంగా ఉంది. …
Read More »