యూపీలో చివరి దశ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. ప్రయాగ్జ్ బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్ జోషి సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. మయాంక్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, మహిళల భద్రత, యువతపై అఖిలేశ్ దృష్టి పెట్టారని, రాష్ట్ర భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉందని, అందుకే ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు మయాంక్ తెలిపారు.
Read More »BJP కి షాకిస్తున్న అఖిలేష్ యాదవ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీని ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ముప్పు తిప్పలు పెడుతున్నారు. మొన్నటి వరకు బలంగా కనిపించిన అధికార బీజేపీకి షాకిచ్చేలా.. వలసలను ఆహ్వానిస్తూ తమ పార్టీ బలపడుతోందనే సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు,మంత్రులు బీజేపీని వీడి ఎస్పీలో చేరుతున్నారు.. మరోవైపు ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు ఊగిసలాటలో ఉన్నారట. అఖిలేష్ దెబ్బకు …
Read More »యూపీ అసెంబ్లీ ఎన్నికలకి తొలి విడత నోటిఫికేషన్ విడుదల
యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాల్టి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యాయి.. పశ్చిమ యూపీలోని 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 10న ఎన్నికలు జరగనున్నాయి. కాగా తొలి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్ళ్ పార్టీలు విడుదల చేయగా.. బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.
Read More »BJP కి షాక్
యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు నిష్క్రమిస్తున్నారు. రోజుల వ్యవధిలో ఇద్దరు మంత్రులు సహా ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీని వీడారు. తాజాగా ఓబీసీ నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే ముఖేష్ వర్మ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసినట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం దళితులు, బీసీలు, మైనారిటీలను పట్టించుకోలేదని లేఖలో ఆరోపించారు.
Read More »