తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఆనం రామనారాయణ రెడ్డి,ఆనం వివేకానందరెడ్డికి బిగ్ షాక్ తగిలింది.గత ముప్పై ఒక్క ఏళ్ళుగా వీరిద్దరి చేతుల్లో ఉన్న వీఆర్ కళాశాలను బయటకు తీసుకురావాలని ఎన్నో పోరాటాలు ..ఉద్యమాలు చేస్తున్న ఆ కళాశాల సిబ్బంది,పూర్వ విద్యార్థులు కృషి ఎట్టలకే ఫలించింది.కళాశాల ఆస్తుల విలువ మొత్తం ఏడువందల కోట్ల రూపాయలు ఉంటుంది.ఈ కళాశాల పాలకవర్గంలో ఉన్న మొత్తం ఏడుగురు సభ్యుల్లో ఇద్దరు పూర్వ విద్యార్థులు ..పాత కమిటీ నుండి ఇద్దరు..ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు ,కళాశాల ప్రిన్సిపాల్ ఉంటారు.
See Also:వైసీపీ ఎంపీలు రాజీనామా ..!
అయితే విద్యార్థులు ఎన్నుకునే ఆ ఇద్దరూ పూర్వ విద్యార్థులు తప్పా మిగిలిన ఐదుగురు ఆనం బ్రదర్స్ ఎవర్ని చెబితే వారే ఉండాలి .ఇదే రూల్ .దీంతో కళాశాల సిబ్బంది నియామకాల్లో ..ఆస్తుల్లో చాలా కుంభ కోణాలు జరిగేవి.అయితే ప్రస్తుతం ఉన్న పాలకవర్గం పదవీకాలం ముగిసిన కానీ ఎన్నికలు నిర్వహించడంలేదని కళాశాల పూర్వ విద్యార్థులు ఉన్నత న్యాయ స్థానం హైకోర్టును ఆశ్రయించారు.
See Also:జగన్ చేత కన్నీళ్లు పెట్టించిన చిన్నారి సమస్య ..విన్న వెంటనే ..!
దీంతో హైకోర్టు పాత పాలకవర్గాన్ని రద్దు చేయాలనీ ..మరల ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.దీనిపై ఆనం బ్రదర్స్ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం ను ఆశ్రయించగా హైకోర్టు వెలువరించిన తీర్పునే అమలుచేయాలని సుప్రీం తీర్పును ఇచ్చింది.జులైలో ఎన్నికలు నిర్వహించాలని ..అది కూడా కోర్టు పర్యవేక్షణలో నిర్వహించాలని సుప్రీం ఆదేశాలను జారీచేసింది ..