తెలంగాణ రాష్ట్రమంటే ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అంటే కేసీఆర్ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నారు. నిన్న శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో చీకోడ్ లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”తెలంగాణ అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే కేసీఆర్ అని అన్నారు..దుబ్బాక నియోజకవర్గం చికోడ్ లో జరిగిన పాల్గొన్న ఆయన రాష్ట్రంలో కాంగ్రేస్ బీజేపీలకు నూకలు చెల్లాయన్నారు..మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయం ఖాయమని దీమా వ్యక్తం చేసారు.
మున్సిపోల్స్ లో ఓడిపోతామనే భయంతోనే ప్రతిపక్షాలు కోర్టులో వాయిదాలు కోరుతుందన్నారు.తెలంగాణ ప్రజలపార్టీ టీఆర్ఎస్. టీఆర్ఎస్ ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ. కాంగ్రెస్, బీజేపీలకు హైకమాండ్ ఢిల్లీలో ఉన్నారు.. టీఆర్ఎస్ కు హైకమాండ్ తెలంగాణప్రజలే అని ఉద్ఘాటించారు.