ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఎంత సంపాదించారో తెలుసా ..?.అక్షరాల పది హేను లక్షల కోట్ల రూపాయలు అంట .నమ్మరా ..అయితే ఇది నిజం అంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మేనమామ అయిన వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అంటున్నారు .
ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మూడున్నర ఏండ్లుగా అభివృద్ధి పేరుతో 15 లక్షల కోట్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకున్నారని ఆయన ఆరోపించారు. బాబు అధికారంలోకి వచ్చి మూడున్నరెండ్లు అయిన గత సార్వత్రిక ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు.
మరో వైపు ‘వైఎస్ఆర్ కుటుంబం’లో ఇప్పటి వరకు 75 లక్షల మంది భాగస్వాములు అయ్యారని… ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ఆయన తెలిపారు.