సూపర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. వరుస విజయాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమెకు వచ్చిన అన్ని మంచి సినిమాలు ఇంకా ఏ హీరోయిన్ కూడా దక్కలేదనే చెప్పాలి. జేజమ్మగా తన ఉగ్రరూపం చూపించింల్ అనుష్క.. సరోజగా పిచ్చెక్కించింది. రుద్రమదేవిగా కత్తి పట్టి కదనరంగంలో దూకిన స్వీటీ.. దేవసేనగా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో క్రేజ్ను సంపాదించింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె ఊసే లేకుండా పోయింది.
అయితే దీనికి బలమైన కారణమే ఉంది. అనుష్క సైజ్ జీరో తర్వాత కాస్త ఒళ్ళు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని తగ్గించుకునే పనిలో పడింది స్వీటీ. ఇ ప్పటికే కొన్ని కిలోల బరువు తగ్గిన అనుష్క సహజ పద్ధతుల్లో బరువు తగ్గడం కోసం కేరళ ఆయుర్వేదంపై ఆధారపడుతోందని టాక్. కొద్ది నెలల పాటు కేరళలోనే వుండి ప్రకృతి చికిత్స తీసుకునే నిమిత్తం ఆమె అక్కడికి వెళుతోంది. దీంతో ప్రస్తుతం కొత్త సినిమాలేవీ ఆమె అంగీకరించడం లేదని తెలిసింది. ప్రస్తుతం ఆమె నటించిన భాగమతి సంక్రాంతికి విడుదలకు సిద్దం అవుతుంది.