Home / ANDHRAPRADESH / జ‌గ‌న్ పాద‌యాత్ర ఆపేస్తాడా.. టీడీపీ బ్యాచ్ ఇది మీకే..!

జ‌గ‌న్ పాద‌యాత్ర ఆపేస్తాడా.. టీడీపీ బ్యాచ్ ఇది మీకే..!

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ తేదీని వచ్చే నెల2కు మార్చారు. నవంబర్‌ 2 నుంచి ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుందని తెలిపారు. ఆరు నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర సాగనుంది. ఇక ఆరు నెలల పాటు తనకు వారం వారం కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ ఇప్పటికే సిబిఐ కోర్టులో పిటీషన్ వేశారు.

అయితే జగన్ పాదయాత్రకు సీబీఐ కోర్టు నో చెబితే ఆగిపోతుందన్న ప్రచారం జరుగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో ఆ ఊహాగానాల‌కు వైసీపీ ఎమ్మెల్యే రోజా బ్రేక్ వేసింది. ఒక వేళ కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని తమకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినా పాదయాత్రను వైసీపీ అధినేత కొనసాగిస్తారని రోజా ఊహాగానాలకు తెరదించారు. ప్రతి శుక్రవారం జగన్ సిబిఐ కోర్ట్ ముందు హాజరుకావలిసి వుంది. పాదయాత్ర తలపెట్టిన నేపథ్యంలో తనకు 6 నెలలపాటు మినహాయింపు కోరుతూ వైసిపి అధినేత కోర్టు ను అభ్యర్ధించారు. ఆ అభ్యర్థనపై కోర్టు తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు.

వారం వారం కోర్టు కి హాజరు కావలిసిన విపక్ష నేత పాదయాత్ర చేయలేరని ఆయన యాత్ర చేస్తా అని ప్రకటించిన రోజునుండి టీడీపీ ముమ్మరంగా ప్రచారం సాగిస్తుంది. ఆ ప్రచారం అలా ఉండగానే జగన్ అక్టోబర్‌లో తలపెట్టిన పాదయాత్ర కాస్తా నవంబర్ కి వాయిదా పడింది . ఈ నేపథ్యంలో ఆ ప్రచారం మరింత ముమ్మరం చేసింది టీడీపీ సర్కార్ . దాంతో క్యాడర్ కి నేతలకు పూర్తి క్లారిటీ ఇచ్చేందుకు వైసీపీ మీడియాతో ఈ అంశాన్ని పంచుకుంది. ఏది ఏమైనా అవసరమైతే కోర్టుకి వెళ్ళి వస్తూ అయినా అధినేత పాదయాత్ర కొనసాగిస్తారని ప్రకటించడంతో ఆ పార్టీ వర్గాల్లో ఉత్సహం వెల్లివిరుస్తుంది .

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat