ఏపీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఎకరాల దేవాదాయ భూములను లీజుకిస్తామని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు .ఈ రోజు రాష్ట్రంలోని ఏలూరులో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ వేలం ద్వారా ఈ భూములను 33 సంవత్సరాలకుగానూ లీజుకిస్తామని తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలను ఆధునీకరిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
