అనసూయ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ప్రముఖ తెలుగు ఛానల్ అయిన ఈటీవీ లో ప్రసారమై “జబర్దస్త్ “.అంతగా ఒకవైపు ఆమె తన యాంకరింగ్ తో మరో వైపు అప్పుడప్పుడు అందాలను అరబొస్తూ అందరి మదిని దోచుకుంది అమ్మడు .ఆ మధ్య టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో మరదల పాత్రలో మెప్పించగ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అమ్మడు నటించింది .
తాజాగా ఈ ముద్దు గుమ్మ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా లేటెస్ట్ గా వస్తోన్న మూవీ రంగస్థలం 1985 లో నటిస్తుంది .ఈ సందర్భాంగా ఈ హాట్ యాంకర్ ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది .ఈ క్రమంలో అమ్మడు రంగస్థలం లో వచ్చిన అవకాశం గురించి వివరిస్తూ చెర్రి హీరోగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం 1985’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తుండగా మరోవైపు ఈ అమ్మడు కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా సెట్లో జరిగిన కొన్ని సంఘటనలను అనసూయ ఓ ఆంగ్లపత్రికతో పంచుకుంటూ ‘రామ్చరణ్ ఏ విషయాన్నైనా చాలా త్వరగా నేర్చుకుంటారు. కొత్త పనులు నేర్చుకోవడానికి చిన్న పిల్లాడిలా ఆయన చూపించే ఉత్సుకతను చూస్తే సంతోషంగా అనిపిస్తుంది. సెట్లో మేము సినిమాలు, ఆహారం గురించి చాలా మాట్లాడుకున్నాం. కాకరకాయ వంట చేసుకొస్తానని చరణ్, సుకుమార్కు ప్రామిస్ చేశా. ఆ వంట నేను బాగా చేస్తా. నా తర్వాతి షూటింగ్ షెడ్యూల్లో వారికి ఈ వంట వండిపెట్టడానికి చాలా ఆతృతగా ఉన్నా’ అని ఆమె చెప్పారు.