తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చొరవ, సంకల్ప బలంతో చారిత్రక వరంగల్ నగరం అభివృద్దికి కేరాఫ్ అడ్రస్ గా మారనుంది.ఈ నెల 22న వరంగల్ ఓఆర్ఆర్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం వరంగల్ ను హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.
1445 కోట్ల భారీ అంచనావ్యయంతో వరంగల్ చుట్టూ నాలుగు లేన్ల అవుటర్ రింగ్రోడ్ నిర్మాణం చేపడుతున్నది.
74 కిలోమీటర్ల పొడవుతో అన్ని హంగులతో రింగ్రోడ్ను నిర్మించాలని సంకల్పించింది. రింగ్రోడ్ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర హైవేపై 17.7 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి ప్రభుత్వం 669.59 కోట్ల రూపాయల ఖర్చుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
వరంగల్ నగరానికి మణిహారంగా నిలవనున్న ఓఆర్ఆర్ కు ఈ నెల 22న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.ఇక హైదరాబాద్ తరహాలో వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అద్భుత ప్రణాళికలతో ముందుకు సాగుతున్నది. త్వరలోనే వరంగల్ లో ప్రతిష్ఠాత్మకమైన టెక్స్ టైల్ పార్క్ ను ఏర్పాటు చేయనున్నది. విద్యార్థులకు శిక్షణనిచ్చే టాస్క్ కేంద్రాన్ని ఇప్పటికే ప్రారంభించబడింది .