సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫేస్బుక్ తర్వాత స్థానాన్ని ఆక్రమించింది వాట్సాప్.నిత్యం ఏదో ఒక సమాచారాన్ని వాట్సాప్ ద్వారా బంధువులకు మిత్రులకు చేరవేసుకుంటూ రోజులో సగం సమయం దానికోసం వెచ్చిస్తున్నారు .ఇలాంటి తరుణంలో వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.
ఇందులో భాగంగా ఆండ్రాయిడ్ కొత్త బీటా వెర్షన్లో గ్రూప్ వాయిస్ కాల్స్ చేసుకునే సౌకర్యం ఉండబోతుంది .ప్రస్తుతం ఈ కొత్త వెర్షన్ను
పరీక్షిస్తున్న వాబీటాఇన్ఫో వెబ్సైట్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.ఈ క్రమంలో గ్రూప్ వాయిస్ కాల్స్తో పాటు గ్రూప్ వీడియో కాల్స్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని వాబీటా తెలిపింది. వచ్చే ఏడాది ఈ ఫీచర్ అందుబాటులోకి రానుందని పేర్కొంది.అయితే వినియోగదారులు కాల్స్ చేసేటప్పుడు వాట్సాప్ 2.17.70 గ్రూప్ కాల్ చేయాలా అని సర్వర్కు రిక్వెస్ట్ పంపుతుందని తెల్పింది .