జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పెద్దగా యాక్టీవ్గా ఉండరు. అయితే జనసేన పార్టీ కార్యకలాపాల కోసం ట్విట్టర్ను మాత్రం వినియోగిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయ పరమైన అంశాలను మాత్రమే ఇందులో పోస్ట్ చేసే పవన్ కళ్యాణ్, అందుకు విరుద్ధంగా తొలిసారి ఓ అభిమాని ఫోటోను పోస్ట్ చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ ఏంటి.. అభిమాని ఫోటో పోస్ట్ చేయడం ఏంటని ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. స్వయంగా తాను తీసుకున్న సెల్ఫీనే పవన్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులందరికీ కొత్త ఉత్సాహన్నిచ్చారు.
పవన్ నుండి బహుశా ఇది ప్రారంభం ఏమో.. ఇక ముందు ముందు భవిష్యత్తులో ఇలాంటి సిత్రాలు మరిన్నిపోస్ట్లు జనసేనాని ట్విట్టర్ ఖాతాలో దర్శనమిస్తాయేమో అన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక, ఆర్ధిక పరివర్తన కోసం నిరంతరం పనిచేసి అలుపు ఎరుగని కార్యకర్త మా నిమ్మల వీరన్నతో.. అంటూ పవర్ స్టార్ పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మమూలుగానే పవన్ ఏదైనా పని చేస్తే పవన్ ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు.. మరి ఎప్పుడూ చేయని ఓ పనిని స్వయంగా పవర్ స్టార్ చేస్తే.. ఆ మాత్రం హంగామా లేకుండా ఎలా ఉంటుందని కొందరు అనుకుంటుంటగా.. పవన్కు పాలిటిక్స్ బాగానే అలవాటు పడుతున్నారని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.